ETV Bharat / bharat

పీపీఈ కిట్లపై నిర్లక్ష్యం.. జంతువుల పాలిట శాపం

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత భద్రతలో పీపీఈ కిట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటి వల్ల ఉపయోగం ఎంత ఉందో.. వాడేసిన తర్వాత సరైన రీతిలో పడేయకపోతే అంతే నష్టం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం.. మూగ జీవాల పాలిట శాపంగా మారుతోంది. ఓసారి వాటి వివరాలు తెలుసుకుందాం రండి..

author img

By

Published : Jul 26, 2020, 12:21 PM IST

Updated : Jul 26, 2020, 12:42 PM IST

Monkeys dragged the used PPE kits
వాడేసిన పీపీఈ కిట్లపై నిర్లక్ష్యం.. వానరాలకు శాపం

దేశంలోనే కరోనా మహమ్మారి కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది తమిళనాడు. నీలగిరి జిల్లాలో వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఊటి, పరిసర ప్రాంతాల్లో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అక్కడ ప్రభుత్వాస్పత్రుల్లో వసతుల కొరతతో నగరంలోని లారెన్స్​ పాఠశాలలో కొవిడ్​ శిబిరం ఏర్పాటు చేసి.. 50 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు.

పీపీఈ కిట్లపై నిర్లక్ష్యం.. జంతువుల పాలిట శాపం

అయితే.. వైద్య సిబ్బంది ఉపయోగించిన పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులను నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తున్నారు. ఇలాంటి సంఘటనలపై ఇటీవల ఫిర్యాదులు పెరిగాయి. అధికారుల తీరుపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీపీఈ కిట్లు, ఔషధాల డబ్బాలు, సిరంజీలను బహిరంగ ప్రదేశాల్లో పారవేసినప్పుడు.. వాటిని కోతుల గుంపు నోట కరుచుకుని తీసుకెళ్లే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీని ద్వారా కోతులు వైరస్​ బారినపడటమే కాదు.. ​ మరింత మందికి మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం అధికంగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరో సంఘటన

కోయంబత్తూర్​ జిల్లాలోని కొడిసియా ఎగ్జిబిషన్​ కాంప్లెక్స్​ ముందు ఈనెల 10న ఓ శునకం.. పీపీఈ కిట్టును నోటకరుచుకొని లాక్కెళ్లటం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారటం వల్ల.. భారీగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదీ చూడండి:'కార్గిల్​ వీరుల శౌర్యం.. భావితరాలకు స్ఫూర్తిదాయకం'

దేశంలోనే కరోనా మహమ్మారి కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది తమిళనాడు. నీలగిరి జిల్లాలో వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఊటి, పరిసర ప్రాంతాల్లో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అక్కడ ప్రభుత్వాస్పత్రుల్లో వసతుల కొరతతో నగరంలోని లారెన్స్​ పాఠశాలలో కొవిడ్​ శిబిరం ఏర్పాటు చేసి.. 50 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు.

పీపీఈ కిట్లపై నిర్లక్ష్యం.. జంతువుల పాలిట శాపం

అయితే.. వైద్య సిబ్బంది ఉపయోగించిన పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులను నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తున్నారు. ఇలాంటి సంఘటనలపై ఇటీవల ఫిర్యాదులు పెరిగాయి. అధికారుల తీరుపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీపీఈ కిట్లు, ఔషధాల డబ్బాలు, సిరంజీలను బహిరంగ ప్రదేశాల్లో పారవేసినప్పుడు.. వాటిని కోతుల గుంపు నోట కరుచుకుని తీసుకెళ్లే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీని ద్వారా కోతులు వైరస్​ బారినపడటమే కాదు.. ​ మరింత మందికి మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం అధికంగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరో సంఘటన

కోయంబత్తూర్​ జిల్లాలోని కొడిసియా ఎగ్జిబిషన్​ కాంప్లెక్స్​ ముందు ఈనెల 10న ఓ శునకం.. పీపీఈ కిట్టును నోటకరుచుకొని లాక్కెళ్లటం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారటం వల్ల.. భారీగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదీ చూడండి:'కార్గిల్​ వీరుల శౌర్యం.. భావితరాలకు స్ఫూర్తిదాయకం'

Last Updated : Jul 26, 2020, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.