ETV Bharat / bharat

'ప్రజాస్వామ్యమా? వారసత్వ రాజకీయాలా?'

బిహార్​లో మహాకూటమిపై విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్న ఎన్డీఏకు, వారసత్వ రాజకీయాలకు అంకితమైన వారికి మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు. సీఎం నితీశ్​కుమార్, మోదీ బంధువులు ఎవరైనా పార్లమెంటులో ఉన్నారా? అని ప్రజలను ప్రశ్నించారు.

author img

By

Published : Nov 1, 2020, 1:40 PM IST

Updated : Nov 1, 2020, 2:15 PM IST

Has any relative of Nitish Kumar been sent to Rajya   Sabha? Do you find any relative of Modi in Parliament?: PM  Modi asks at Bihar rally.
'ప్రజాస్వామ్యానికి, వారసత్వ రాజకీయాలకు మధ్య పోరు'

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్న ఎన్డీఏకు, వారసత్వ రాజకీయాలను ఆరాధించే మహాకూటమికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సమస్తీపుర్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

సమస్తీపుర్ ర్యాలీలో మాట్లాడుతున్న మోదీ

"బిహార్ సీఎం నితీశ్​ కుమార్ బంధువులు ఎవరైనా రాజ్యసభలో ఉన్నారా? మోదీ కుటుంబీకులు ఎవరైనా పార్లమెంటులో ఉన్నారా?" అని ప్రజలను ప్రశ్నించారు ప్రధాని. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బిహార్​లో 1000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్​పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర రైతుల కోసం వ్యవసాయ రంగంలో మౌలికసదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు మోదీ గుర్తు చేశారు.

ఈ ర్యాలీలో ప్రధానితో పాటు బిహార్​ సీఎం నితీశ్​ కుమార్, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్న ఎన్డీఏకు, వారసత్వ రాజకీయాలను ఆరాధించే మహాకూటమికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సమస్తీపుర్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

సమస్తీపుర్ ర్యాలీలో మాట్లాడుతున్న మోదీ

"బిహార్ సీఎం నితీశ్​ కుమార్ బంధువులు ఎవరైనా రాజ్యసభలో ఉన్నారా? మోదీ కుటుంబీకులు ఎవరైనా పార్లమెంటులో ఉన్నారా?" అని ప్రజలను ప్రశ్నించారు ప్రధాని. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బిహార్​లో 1000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్​పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర రైతుల కోసం వ్యవసాయ రంగంలో మౌలికసదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు మోదీ గుర్తు చేశారు.

ఈ ర్యాలీలో ప్రధానితో పాటు బిహార్​ సీఎం నితీశ్​ కుమార్, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు.

Last Updated : Nov 1, 2020, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.