ETV Bharat / bharat

ఆన్​లైన్​ క్లాసులు.. ఖైదీల భవితకు బాటలు - gujarat jail online classes

జైలు.. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించే బంధీఖానా. అయితే గుజరాత్​లోని ఓ సెంట్రల్​ జైలు మాత్రం చదువులమ్మకు నిలయంగా మారింది. ఆన్​లైన్​ క్లాసులు వింటూ.. భవిష్యత్తుకు జైలులోనే బాటలు వేసుకుంటున్నారు అక్కడి ఖైదీలు. జైలు అధికారులే దగ్గరుండి ఖైదీలను చదివిస్తున్నారు. మరి, ఆ చదువుల జైలు కథేంటో చూసేద్దాం రండి...

Gujarat: Lajpore jail inmates get online education for exam preparation
జైల్లో ఆన్​లైన్​ క్లాసులకు హాజరవుతున్న ఖైదీలు!
author img

By

Published : Jul 13, 2020, 3:19 PM IST

తెలిసీతెలియక నేరాలు చేసి జైలుపాలైతే.. వారి భవిష్యత్ అంధకారమేనా? ​ ఇక వారి బతుకుల్లో వెలుగు నిండే అవకాశమే లేదా? కచ్చితంగా ఉందంటున్నారు గుజరాత్​లోని, లాజ్​పుర్​ సెంట్రల్​ జైలు అధికారులు. అందుకే ఆ జైలులో ఖైదీలకు శిక్షతో పాటు, క్రమశిక్షణ కూడా నేర్పుతున్నారు. ఇకపై నేరాలకు పాల్పడకుండా భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నారు. ఆన్​లైన్​ క్లాసులు పెట్టించి 10వ తరగతి, ఇంటర్​ పరీక్షలకు ఖైదీలను సిద్ధం చేస్తున్నారు.

Gujarat: Lajpore jail inmates get online education for exam preparation
జైల్లో ఆన్​లైన్​ క్లాసులకు హాజరవుతున్న ఖైదీలు!

సూరత్​ జిల్లా సచిన్​లోని లాజ్​పుర్​ సెంట్రల్​ జైల్లో మొత్తం 2100 మంది ఖైదీలున్నారు. ఒక్క తప్పుతో వారి భవిష్యత్తు నాశనం కాకూడదని భావించిన జైలు అధికారులు.. ఆసక్తి ఉన్న వారిని చదివించాలని నిర్ణయించారు. పలు కేసుల్లో శిక్షను అనుభవిస్తున్న 63 మందికి ప్రత్యేకంగా ఆన్​లైన్​ క్లాసులు ఏర్పాటు చేశారు.

పీపీ సావని స్కూలు సిబ్బంది ఆన్​లైన్​లో ఖైదీలకు పాఠాలు బోధిస్తున్నారు. 2019లో 13 మంది ఇలా ఆన్​లైన్​ క్లాసులు విని.. ఎస్​ఎస్​సీ పాసయ్యారు. దీంతో, గుజరాత్​లోనే ఖైదీలకు ఆన్​లైన్​ క్లాసులు పెట్టించిన తొలి జైలుగా నిలిచింది లాజ్​పుర్​ సెంట్రల్​ జైల్​. ఇప్పుడు జైలు సూపరింటెండెంట్​ మనోజ్​ నినామా ఆధ్వర్యంలో.. 63 మంది ఖైదీలతో మరో అకడమిక్​ సెషన్ ప్రారంభమైంది.

ఇదీ చదవండి: 'కరోనా వేళ జైలు గోడలే మాకు శ్రీరామ రక్ష'

తెలిసీతెలియక నేరాలు చేసి జైలుపాలైతే.. వారి భవిష్యత్ అంధకారమేనా? ​ ఇక వారి బతుకుల్లో వెలుగు నిండే అవకాశమే లేదా? కచ్చితంగా ఉందంటున్నారు గుజరాత్​లోని, లాజ్​పుర్​ సెంట్రల్​ జైలు అధికారులు. అందుకే ఆ జైలులో ఖైదీలకు శిక్షతో పాటు, క్రమశిక్షణ కూడా నేర్పుతున్నారు. ఇకపై నేరాలకు పాల్పడకుండా భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నారు. ఆన్​లైన్​ క్లాసులు పెట్టించి 10వ తరగతి, ఇంటర్​ పరీక్షలకు ఖైదీలను సిద్ధం చేస్తున్నారు.

Gujarat: Lajpore jail inmates get online education for exam preparation
జైల్లో ఆన్​లైన్​ క్లాసులకు హాజరవుతున్న ఖైదీలు!

సూరత్​ జిల్లా సచిన్​లోని లాజ్​పుర్​ సెంట్రల్​ జైల్లో మొత్తం 2100 మంది ఖైదీలున్నారు. ఒక్క తప్పుతో వారి భవిష్యత్తు నాశనం కాకూడదని భావించిన జైలు అధికారులు.. ఆసక్తి ఉన్న వారిని చదివించాలని నిర్ణయించారు. పలు కేసుల్లో శిక్షను అనుభవిస్తున్న 63 మందికి ప్రత్యేకంగా ఆన్​లైన్​ క్లాసులు ఏర్పాటు చేశారు.

పీపీ సావని స్కూలు సిబ్బంది ఆన్​లైన్​లో ఖైదీలకు పాఠాలు బోధిస్తున్నారు. 2019లో 13 మంది ఇలా ఆన్​లైన్​ క్లాసులు విని.. ఎస్​ఎస్​సీ పాసయ్యారు. దీంతో, గుజరాత్​లోనే ఖైదీలకు ఆన్​లైన్​ క్లాసులు పెట్టించిన తొలి జైలుగా నిలిచింది లాజ్​పుర్​ సెంట్రల్​ జైల్​. ఇప్పుడు జైలు సూపరింటెండెంట్​ మనోజ్​ నినామా ఆధ్వర్యంలో.. 63 మంది ఖైదీలతో మరో అకడమిక్​ సెషన్ ప్రారంభమైంది.

ఇదీ చదవండి: 'కరోనా వేళ జైలు గోడలే మాకు శ్రీరామ రక్ష'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.