ETV Bharat / bharat

లాక్​డౌన్ 4.0 రూల్స్​ ఇలా ఉంటాయ్!

author img

By

Published : May 15, 2020, 6:57 PM IST

Updated : May 15, 2020, 7:50 PM IST

సోమవారం ప్రారంభం కానున్న నాలుగో విడత లాక్​డౌన్లో మరిన్ని అంక్షలను సడలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి నిబంధనలు విధించాలనే అధికారం పూర్తిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలకే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైల్వే, దేశీయ విమాన ప్రయాణ సేవలను పాక్షికంగా పునరుద్ధరించనునట్లు చెప్పారు.

Greater relaxations in lockdown 4.0
లాక్​డౌన్ 4.0లో మరిన్ని ఆంక్షల సడలింపు- రాష్ట్రాలకే అధికారం

లాక్​డౌన్​ 4.0లో ఎలాంటి ఆంక్షలు విధించాలనే నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలకే వదిలేయనున్నటు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి రైల్వే, దేశీయ విమాన ప్రయాణ సేవలను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్​ మాల్స్​, సినిమా హాల్స్​ దేశవ్యాప్తంగా ఎక్కడా పున:ప్రారంభించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. కంటైన్​మెంట్​ ప్రాంతాలు మినహా రెడ్​జోన్లలో​ సెలూన్లు, ఆప్టికల్ షాపులు తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు.

నాలుగో విడత లాక్​డౌన్​లో అనేక ఆంక్షలు సడలించనున్నట్లు చెప్పారు అధికారులు. గ్రీన్​ జోన్లలో అన్ని సేవలకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఆరెంజ్​ జోన్లలో పరిమిత ఆంక్షలు ఉంటాయని, రెడ్​ జోన్లలోని కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో మాత్రమే కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనల మేరకే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తుది మార్గదర్శకాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

ఆ రాష్ట్రాల్లో మాత్రం...

పంజాబ్, బంగాల్, మహారాష్ట్ర, అసోం, తెలంగాణ... లాక్​డౌన్ కొనసాగించాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల మేరకు గ్రీన్​, ఆరెంజ్​, రెడ్​ జోన్ల జిల్లాలను నిర్ణయించే అధికారం తమకు ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నట్లు చెప్పారు. ఈ వినతికి కేంద్రం అంగీకారం తెలిపే అవకాశముందని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించడం, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను అనుమతించడం వంటి నిర్ణయాలు రాష్ట్రాలు తీసుకునే వీలుంటుందని చెప్పారు.

ఏ రాష్ట్రమూ లాక్​డౌన్​ను పూర్తిగా ఎత్తివేయాలని కోరుకోవడం లేదని, క్రమక్రమంగా ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాలని భావిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. రైల్వే, విమాన ప్రయాణ సేవలను పాక్షికంగా పునరుద్ధరిస్తున్నప్పటికీ ఇప్పట్లో ఇవి పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. కర్ణాటక, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలు రైల్వే సేవలను మే చివరి వరకు పూర్తి స్థాయిలో పునరుద్ధరించవద్దని కోరుతున్నట్లు వివరించారు. ​ఇప్పటికే దిల్లీ నుంచి 15 రైళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయని, వందే భారత్​ విషన్​లో భాగంగా విమాన సేవలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.

లాక్​డౌన్ 4.0లో ఇలా..

  • కంటైన్​మెంట్​ ప్రాంతాలు మినహా రెడ్​జోన్లలో స్థానికంగా బస్సులు, మెట్రో సేవలకు పరిమిత సంఖ్యలో ప్రయాణికులతో అనుమతి.
  • రెడ్​ డోన్లలో ఆటోలు, ట్యాక్సీలకు షరతులతో అనుమతి.
  • మార్కెట్లను తెరిచే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం
  • రెడ్​జోన్లలోనూ నిత్యావసరేతర వస్తువుల సరఫరాకు ఈ-కామర్స్ సంస్థలకు అనుమతి.
  • కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ముంబయిలో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతర్​జిల్లా ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించే యోచనలో ఉంది.
  • గుజరాత్​లోని పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
  • ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించేందుకు దిల్లీ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నాయి.
  • హోటళ్లు, రెస్టారెంట్లు సహా పర్యటక రంగాన్ని పునరుద్ధరించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది.
  • వలస కార్మికులు సొంత ఊర్లకు చేరుకున్నాక కరోనా కేసులు పెరుగుతున్న బిహార్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి.

లాక్​డౌన్​ 4.0లో ఎలాంటి ఆంక్షలు విధించాలనే నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలకే వదిలేయనున్నటు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి రైల్వే, దేశీయ విమాన ప్రయాణ సేవలను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్​ మాల్స్​, సినిమా హాల్స్​ దేశవ్యాప్తంగా ఎక్కడా పున:ప్రారంభించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. కంటైన్​మెంట్​ ప్రాంతాలు మినహా రెడ్​జోన్లలో​ సెలూన్లు, ఆప్టికల్ షాపులు తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు.

నాలుగో విడత లాక్​డౌన్​లో అనేక ఆంక్షలు సడలించనున్నట్లు చెప్పారు అధికారులు. గ్రీన్​ జోన్లలో అన్ని సేవలకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఆరెంజ్​ జోన్లలో పరిమిత ఆంక్షలు ఉంటాయని, రెడ్​ జోన్లలోని కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో మాత్రమే కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనల మేరకే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తుది మార్గదర్శకాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

ఆ రాష్ట్రాల్లో మాత్రం...

పంజాబ్, బంగాల్, మహారాష్ట్ర, అసోం, తెలంగాణ... లాక్​డౌన్ కొనసాగించాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల మేరకు గ్రీన్​, ఆరెంజ్​, రెడ్​ జోన్ల జిల్లాలను నిర్ణయించే అధికారం తమకు ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నట్లు చెప్పారు. ఈ వినతికి కేంద్రం అంగీకారం తెలిపే అవకాశముందని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించడం, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను అనుమతించడం వంటి నిర్ణయాలు రాష్ట్రాలు తీసుకునే వీలుంటుందని చెప్పారు.

ఏ రాష్ట్రమూ లాక్​డౌన్​ను పూర్తిగా ఎత్తివేయాలని కోరుకోవడం లేదని, క్రమక్రమంగా ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాలని భావిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. రైల్వే, విమాన ప్రయాణ సేవలను పాక్షికంగా పునరుద్ధరిస్తున్నప్పటికీ ఇప్పట్లో ఇవి పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. కర్ణాటక, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలు రైల్వే సేవలను మే చివరి వరకు పూర్తి స్థాయిలో పునరుద్ధరించవద్దని కోరుతున్నట్లు వివరించారు. ​ఇప్పటికే దిల్లీ నుంచి 15 రైళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయని, వందే భారత్​ విషన్​లో భాగంగా విమాన సేవలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.

లాక్​డౌన్ 4.0లో ఇలా..

  • కంటైన్​మెంట్​ ప్రాంతాలు మినహా రెడ్​జోన్లలో స్థానికంగా బస్సులు, మెట్రో సేవలకు పరిమిత సంఖ్యలో ప్రయాణికులతో అనుమతి.
  • రెడ్​ డోన్లలో ఆటోలు, ట్యాక్సీలకు షరతులతో అనుమతి.
  • మార్కెట్లను తెరిచే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం
  • రెడ్​జోన్లలోనూ నిత్యావసరేతర వస్తువుల సరఫరాకు ఈ-కామర్స్ సంస్థలకు అనుమతి.
  • కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ముంబయిలో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతర్​జిల్లా ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించే యోచనలో ఉంది.
  • గుజరాత్​లోని పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
  • ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించేందుకు దిల్లీ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నాయి.
  • హోటళ్లు, రెస్టారెంట్లు సహా పర్యటక రంగాన్ని పునరుద్ధరించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది.
  • వలస కార్మికులు సొంత ఊర్లకు చేరుకున్నాక కరోనా కేసులు పెరుగుతున్న బిహార్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి.
Last Updated : May 15, 2020, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.