ETV Bharat / bharat

'సామాన్యుల వెన్ను విరుస్తున్న ప్రభుత్వ విధానాలు'

ప్రభుత్వం తన విధానాలతో సామాన్యుల వెన్ను విరిచేస్తోందని కాంగ్రెస్​ ఆరోపించింది. ఉన్న సమస్యలను పరిష్కరించకుండా.. సామాన్యుడిపై మొసలి కన్నీరు కారుస్తోంతోందని మండిపడింది​.

author img

By

Published : Mar 8, 2020, 9:42 PM IST

Govt policies breaking back of common man: Cong
'సామాన్యుల వెన్ను విరుస్తున్న ప్రభుత్వ విధానాలు'

కేంద్రంపై మరోమారు విమర్శనాస్త్రాలను సంధించింది కాంగ్రెస్​. సామాన్యులకు అండగా ఉంటామని చెబుతూనే వారి వెన్ను విరిచే విధానాలను కేంద్రం ప్రోత్సహిస్తోందని హస్తం పార్టీ సీనియర్​ నేత, అధికార ప్రతినిధి అభిషేక్​ మను సింఘ్వీ అభిప్రాయపడ్డారు. సామాన్యుడిపై భాజపా మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. ఇందుకు జీవిత, వాహన బీమా ప్రీమియంలను పెంచే ప్రతిపాదనలు, ఈపీఎఫ్​ వడ్డీ రేటును తగ్గించే నిర్ణయాలు ఓ కారణమన్నారు.

ఉత్పాదకత, ఉపాధి, రూపాయి పతనం, ద్రవ్యోల్బణం, సామాజిక విభేదాలు వంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అహంకారం పెరిగిందని మండిపడ్డారు సింఘ్వీ.

దిగువ, మధ్య తరగతి వారిపై భారం

వాహనాల థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ ప్రీమియం 20 శాతం పెంచడం వల్ల ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలపై ప్రభావం పడనుందని తెలిపారు సింఘ్వీ. అయితే ఈ నిర్ణయాలను ఆపే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. దీని వల్ల దిగువ, మధ్య తరగతి కుటుంబాలపై అధిక భారం పడుతోందన్నారు.

" కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నిర్ణయాలను ఆపే అధికారం ప్రభుత్వానికి ఉన్నా ఆ దిశగా జోక్యం చేసుకోవడం లేదు. రెగ్యులేటర్లను సమర్థిస్తూనే సామాన్యుడిపై మొసలి కన్నీరు కారుస్తోంది ప్రభుత్వం. ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.144 పెంచింది. అందులోనూ ఈ పెరిగిన ధర సబ్సీడీకి వర్తించదు. ఒక్కో ఇంటికి 12 సిలిండర్ల సబ్సీడీ ఉన్నా అందడం లేదు. అదే విధంగా ఈపీఎఫ్​ వడ్డీ రేటును 8.65 నుంచి 8.5కు తగ్గించింది ప్రభుత్వం."

-- అభిషేక్​ మను సింఘ్వీ, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

ఈ పథకాలన్నీ వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి కాంగ్రెస్ డిమాండ్​ చేస్తోంది. యస్​ బ్యాంక్ సంక్షోభం గురించి ప్రస్తావించిన సింగ్వీ డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇదీ చదవండి: నారీమణుల చేతుల్లో మోదీ ట్విట్టర్, ఫేస్​బుక్​ ఖాతాలు

కేంద్రంపై మరోమారు విమర్శనాస్త్రాలను సంధించింది కాంగ్రెస్​. సామాన్యులకు అండగా ఉంటామని చెబుతూనే వారి వెన్ను విరిచే విధానాలను కేంద్రం ప్రోత్సహిస్తోందని హస్తం పార్టీ సీనియర్​ నేత, అధికార ప్రతినిధి అభిషేక్​ మను సింఘ్వీ అభిప్రాయపడ్డారు. సామాన్యుడిపై భాజపా మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. ఇందుకు జీవిత, వాహన బీమా ప్రీమియంలను పెంచే ప్రతిపాదనలు, ఈపీఎఫ్​ వడ్డీ రేటును తగ్గించే నిర్ణయాలు ఓ కారణమన్నారు.

ఉత్పాదకత, ఉపాధి, రూపాయి పతనం, ద్రవ్యోల్బణం, సామాజిక విభేదాలు వంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అహంకారం పెరిగిందని మండిపడ్డారు సింఘ్వీ.

దిగువ, మధ్య తరగతి వారిపై భారం

వాహనాల థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ ప్రీమియం 20 శాతం పెంచడం వల్ల ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలపై ప్రభావం పడనుందని తెలిపారు సింఘ్వీ. అయితే ఈ నిర్ణయాలను ఆపే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. దీని వల్ల దిగువ, మధ్య తరగతి కుటుంబాలపై అధిక భారం పడుతోందన్నారు.

" కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నిర్ణయాలను ఆపే అధికారం ప్రభుత్వానికి ఉన్నా ఆ దిశగా జోక్యం చేసుకోవడం లేదు. రెగ్యులేటర్లను సమర్థిస్తూనే సామాన్యుడిపై మొసలి కన్నీరు కారుస్తోంది ప్రభుత్వం. ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.144 పెంచింది. అందులోనూ ఈ పెరిగిన ధర సబ్సీడీకి వర్తించదు. ఒక్కో ఇంటికి 12 సిలిండర్ల సబ్సీడీ ఉన్నా అందడం లేదు. అదే విధంగా ఈపీఎఫ్​ వడ్డీ రేటును 8.65 నుంచి 8.5కు తగ్గించింది ప్రభుత్వం."

-- అభిషేక్​ మను సింఘ్వీ, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

ఈ పథకాలన్నీ వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి కాంగ్రెస్ డిమాండ్​ చేస్తోంది. యస్​ బ్యాంక్ సంక్షోభం గురించి ప్రస్తావించిన సింగ్వీ డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇదీ చదవండి: నారీమణుల చేతుల్లో మోదీ ట్విట్టర్, ఫేస్​బుక్​ ఖాతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.