ETV Bharat / bharat

అందరి కళ్లూ 14పైనే- లాక్‌డౌన్‌ ముగిస్తారా.. పొడిగిస్తారా?

author img

By

Published : Apr 6, 2020, 5:47 AM IST

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెల 14తో ముగిస్తారా, మళ్లీ పొడిగిస్తారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి చర్చ దీనిపైనే. లాక్‌డౌన్‌ ఎత్తేసే పక్షంలో కార్యకలాపాలు ఎలా పునఃప్రారంభించాలన్న దానిపై రైల్వే సహా వివిధ శాఖలు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నాయి.

Govt likely to allow flight operations in staggered manner post lockdown
లాక్​డౌన్​ తర్వాత దశలవారీగా విమాన రాకపోకలు!

కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వాస్తవానికి ఈ నెల 14తో పూర్తవ్వాలి. 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్లు ఉత్తర్​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెప్పడం గమనార్హం. తమ రాష్ట్రానికి చెందిన ఎంపీలతో ఆయన ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ గురించి మాత్రమే యోగి ప్రస్తావించారా లేదా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ గురించా అన్న విషయంలో స్పష్టత లేదు.

విద్యాసంస్థల ప్రారంభంపై..

దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై సమీక్షించిన తర్వాతే పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతే ప్రభుత్వానికి అతి ముఖ్యమైన అంశమని స్పష్టంచేశారు. ఏప్రిల్‌ 14 తర్వాత కూడా పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చినా.. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా చూసేందుకు తమ మంత్రిత్వశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు.

ప్రభుత్వం నుంచి మరో ప్యాకేజీ..

లాక్‌డౌన్‌ ప్రభావాన్ని సాధ్యమైనంత మేర తగ్గించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఒక ప్యాకేజిని ప్రకటిస్తే ఎలా ఉంటుందనేది కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై ఇంకా పక్కాగా ఒక నిర్ణయానికైతే రాలేదని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. వినియోగాన్ని పెంచడానికి అవసరమైన చర్యల్ని ప్యాకేజిలో చేర్చేందుకు చర్చలు జరుగుతున్నా ఇంకా ఏదీ ఖరారు కాలేదని వివరించారు. లాక్‌డౌన్‌ అనంతర పరిణామాలకు తగ్గట్టుగా కొన్ని పథకాల్లో మార్పులు తీసుకురావడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరోవైపు రాష్ట్రాల మధ్య, ఒక్కో రాష్ట్రం లోపల నిత్యావసర వస్తువుల రవాణా సజావుగా సాగేందుకు ట్రక్కు డ్రైవర్లు, కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి పవన్‌కుమార్‌ అగర్వాల్‌ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.

దశలవారీగా విమానాల రాకపోకలు

21 రోజుల లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత దేశీయ, అంతర్జాతీయ విమాన సేవల్ని ప్రభుత్వం దశలవారీగా అనుమతించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 14వ తేదీ తర్వాతి ప్రయాణాలకు టికెట్లను బుక్‌ చేసుకునే స్వేచ్ఛ విమానయాన సంస్థలకు ఉందని చెప్పారు. ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే మాత్రం ఆ మేరకు టికెట్లను రద్దు చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతానికి ఎయిరిండియా మినహా మిగిలిన విమానయాన సంస్థలు ఈ నెల 14 తర్వాతి ప్రయాణాలకు టికెట్లు ఇస్తున్నాయి. ఎయిరిండియా మాత్రం ఈ నెల 30 తర్వాతి తేదీలకే టికెట్లు ఇస్తోంది.

పరారయ్యేందుకు 'తబ్లీగీ'ల యత్నం

నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు హాజరైన 18 మంది మలేసియా వాసులు దిల్లీ, చెన్నై విమానాశ్రయాల నుంచి అక్రమంగా తమ దేశానికి తరలిపోయేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికార వర్గాలు వమ్ము చేశాయి. దిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో తబ్లీగీ జమాత్‌ ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి మలేసియా నుంచి 75 మంది హాజరయ్యారు. వారిలో 8 మంది.. అధికారులకు దొరకకుండా ఇన్నాళ్లూ దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో దాక్కున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో చిక్కుకున్న తమ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు తాజాగా మలేసియా ప్రభుత్వం దిల్లీ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటుచేసింది. దానిద్వారా స్వదేశానికి పారిపోయేందుకు 8 మంది తబ్లీగీ సభ్యులు ప్రయత్నించగా.. విమానం ఎక్కడానికి ముందే వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటు చెన్నైలోనూ ఇలాగే ప్రయత్నించి 10 మంది పట్టుబడ్డారు. వీరంతా ఇన్నిరోజులూ టెన్‌కాశిలో తలదాచుకున్నారు. మరోవైపు, నిజాముద్దీన్‌లోని తబ్లీగీ జమాత్‌ ప్రధాన కార్యాలయం నుంచి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల బృందం పలు వస్తువుల్ని స్వాధీనం చేసుకుంది.

ఇదీ చూడండి: పీఎఫ్ ఖాతాదారులకు ఊరట- ఆధార్​తో పుట్టిన తేదీ మార్పు

కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వాస్తవానికి ఈ నెల 14తో పూర్తవ్వాలి. 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్లు ఉత్తర్​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెప్పడం గమనార్హం. తమ రాష్ట్రానికి చెందిన ఎంపీలతో ఆయన ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ గురించి మాత్రమే యోగి ప్రస్తావించారా లేదా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ గురించా అన్న విషయంలో స్పష్టత లేదు.

విద్యాసంస్థల ప్రారంభంపై..

దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై సమీక్షించిన తర్వాతే పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతే ప్రభుత్వానికి అతి ముఖ్యమైన అంశమని స్పష్టంచేశారు. ఏప్రిల్‌ 14 తర్వాత కూడా పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చినా.. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా చూసేందుకు తమ మంత్రిత్వశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు.

ప్రభుత్వం నుంచి మరో ప్యాకేజీ..

లాక్‌డౌన్‌ ప్రభావాన్ని సాధ్యమైనంత మేర తగ్గించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఒక ప్యాకేజిని ప్రకటిస్తే ఎలా ఉంటుందనేది కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై ఇంకా పక్కాగా ఒక నిర్ణయానికైతే రాలేదని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. వినియోగాన్ని పెంచడానికి అవసరమైన చర్యల్ని ప్యాకేజిలో చేర్చేందుకు చర్చలు జరుగుతున్నా ఇంకా ఏదీ ఖరారు కాలేదని వివరించారు. లాక్‌డౌన్‌ అనంతర పరిణామాలకు తగ్గట్టుగా కొన్ని పథకాల్లో మార్పులు తీసుకురావడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరోవైపు రాష్ట్రాల మధ్య, ఒక్కో రాష్ట్రం లోపల నిత్యావసర వస్తువుల రవాణా సజావుగా సాగేందుకు ట్రక్కు డ్రైవర్లు, కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి పవన్‌కుమార్‌ అగర్వాల్‌ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.

దశలవారీగా విమానాల రాకపోకలు

21 రోజుల లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత దేశీయ, అంతర్జాతీయ విమాన సేవల్ని ప్రభుత్వం దశలవారీగా అనుమతించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 14వ తేదీ తర్వాతి ప్రయాణాలకు టికెట్లను బుక్‌ చేసుకునే స్వేచ్ఛ విమానయాన సంస్థలకు ఉందని చెప్పారు. ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే మాత్రం ఆ మేరకు టికెట్లను రద్దు చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతానికి ఎయిరిండియా మినహా మిగిలిన విమానయాన సంస్థలు ఈ నెల 14 తర్వాతి ప్రయాణాలకు టికెట్లు ఇస్తున్నాయి. ఎయిరిండియా మాత్రం ఈ నెల 30 తర్వాతి తేదీలకే టికెట్లు ఇస్తోంది.

పరారయ్యేందుకు 'తబ్లీగీ'ల యత్నం

నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు హాజరైన 18 మంది మలేసియా వాసులు దిల్లీ, చెన్నై విమానాశ్రయాల నుంచి అక్రమంగా తమ దేశానికి తరలిపోయేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికార వర్గాలు వమ్ము చేశాయి. దిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో తబ్లీగీ జమాత్‌ ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి మలేసియా నుంచి 75 మంది హాజరయ్యారు. వారిలో 8 మంది.. అధికారులకు దొరకకుండా ఇన్నాళ్లూ దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో దాక్కున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో చిక్కుకున్న తమ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు తాజాగా మలేసియా ప్రభుత్వం దిల్లీ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటుచేసింది. దానిద్వారా స్వదేశానికి పారిపోయేందుకు 8 మంది తబ్లీగీ సభ్యులు ప్రయత్నించగా.. విమానం ఎక్కడానికి ముందే వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటు చెన్నైలోనూ ఇలాగే ప్రయత్నించి 10 మంది పట్టుబడ్డారు. వీరంతా ఇన్నిరోజులూ టెన్‌కాశిలో తలదాచుకున్నారు. మరోవైపు, నిజాముద్దీన్‌లోని తబ్లీగీ జమాత్‌ ప్రధాన కార్యాలయం నుంచి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల బృందం పలు వస్తువుల్ని స్వాధీనం చేసుకుంది.

ఇదీ చూడండి: పీఎఫ్ ఖాతాదారులకు ఊరట- ఆధార్​తో పుట్టిన తేదీ మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.