ETV Bharat / bharat

పోలీస్​ ఠాణాలో అగ్ని ప్రమాదం.. దస్త్రాలు దగ్ధం!

author img

By

Published : Feb 3, 2021, 10:42 AM IST

Updated : Feb 3, 2021, 10:50 AM IST

దేశంలో రెండు వేర్వేరు చోట్ల బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. బిహార్​లోని ఓ పోలీస్​ స్టేషన్​లో చెలరేగిన మంటల్లో.. అక్కడి ఫర్నీచర్​, ఇతర దస్త్రాలు దగ్ధమయ్యాయి. గుజరాత్​లోని ఓ భవనంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

Fire broke out at the Maniayari Police station in Bihar
రెండు వేర్వేరు చోట్ల భారీ అగ్ని ప్రమాదం

బిహార్‌ ముజఫర్‌పుర్‌ జిల్లా మనియారీ పోలీస్​ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఠాణాలోని ఫర్నీచర్‌, ఇతర దస్త్రాలు కాలి బూడిదయ్యాయి. అయితే.. విద్యుత్తు షార్ట్​సర్క్యూట్​ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

పోలీస్​ ఠాణాలో అగ్ని ప్రమాదం.. దస్త్రాలు దగ్ధం!

గుజరాత్​లోనూ..

గుజరాత్​ అహ్మదాబాద్​లోనూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నారన్​పురా ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనంలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. గ్రౌండ్​ ఫ్లోర్​లోని మూడు దుకాణాల్లో చెలరేగిన మంటల నుంచి ఎనిమిది మందిని కాపాడినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం.

అయితే.. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వైరల్​: ప్రభుత్వ వైద్య కళాశాలలో శునకం హల్​చల్​

బిహార్‌ ముజఫర్‌పుర్‌ జిల్లా మనియారీ పోలీస్​ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఠాణాలోని ఫర్నీచర్‌, ఇతర దస్త్రాలు కాలి బూడిదయ్యాయి. అయితే.. విద్యుత్తు షార్ట్​సర్క్యూట్​ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

పోలీస్​ ఠాణాలో అగ్ని ప్రమాదం.. దస్త్రాలు దగ్ధం!

గుజరాత్​లోనూ..

గుజరాత్​ అహ్మదాబాద్​లోనూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నారన్​పురా ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనంలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. గ్రౌండ్​ ఫ్లోర్​లోని మూడు దుకాణాల్లో చెలరేగిన మంటల నుంచి ఎనిమిది మందిని కాపాడినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం.

అయితే.. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వైరల్​: ప్రభుత్వ వైద్య కళాశాలలో శునకం హల్​చల్​

Last Updated : Feb 3, 2021, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.