ETV Bharat / bharat

కేంద్రం అనుమతిచ్చినా.. ఆంక్షలు కొనసాగించేందుకే మొగ్గు!

author img

By

Published : Apr 26, 2020, 5:45 AM IST

Updated : Apr 26, 2020, 6:26 AM IST

నెల రోజులుగా దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్​డౌన్​ నుంచి పురపాలిక సంస్థల పరిధిలోని చిన్న, నిత్యావసర సరకుల దుకాణాలు తెరిచేందుకు కేంద్రం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసిన మరునాడు కొన్ని రాష్ట్రాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్​డౌన్​ నిబంధనలు సడలించేందుకు నిరాకరించాయి. మరికొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

lockdown curbs
కేంద్రం అనుతిచ్చినా సరే ఆంక్షలు ఎత్తివేయని రాష్ట్రాలు

లాక్​డౌన్ కారణంగా ప్రజలకు నిత్యావసర సరకుల కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఆవాసాలు, కాలనీల్లోని చిన్న దుకాణాలకు కేంద్రం అనుమతించింది. జాగ్రత్తలు పాటిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన మహారాష్ట్రలో మాత్రం మే 3 వరకూ లాక్​డౌన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం ఇచ్చిన అనుమతులపై అనేక సందేహాలున్నాయన్నారు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్​ తోపే. ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు.

గుజరాత్​లో...

గుజరాత్​లోనూ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో రెడ్ జోన్లుగా ఉన్న అహ్మదాబాద్ కార్పోరేషన్​ పరిధిలోని 6 వార్డుల్లో దుకాణాలు తెరిచేందుకు నగరపాలక సంస్థ నిరాకరించింది. మిగతా ప్రాంతాల్లో ఆంక్షలను సడలించి, దుకాణాలకు షరతులతో కూడిన అనుమతులిచ్చింది.

మమత నిర్ణయం కోసం

బంగాల్లో దుకాణాలకు అనుమతులు ఇచ్చే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఈ అంశంపై మమత సర్కారు ఓ నిర్ణయానికి రానున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్​లో..

మధ్యప్రదేశ్​లో​ దుకాణాలు తెరుచుకోవడం వల్ల వివిధ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి కనిపించింది. అయితే, హాట్​స్పాట్​లుగా ఉన్న ఇండోర్, భోపాల్, ఉజ్జెయిన్, జబల్పూర్ నగరాల్లో లాక్​డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలకు అనుమతినిచ్చే అంశంపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వనుందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

దేశ రాజధానిలో..

కేంద్రం అనుమతుల మేరకు ఆవాసాలు, కాలనీల్లోని చిన్న దుకాణాలు తెరిచేందుకు దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్​ జోన్లలోని దుకాణాలకు షరతులపై అనుమతించింది. రెడ్​జోన్లలో యథాతథ స్థితి కొనసాగుతుందని ప్రకటించింది.

ఒడిశాలో..

ఒడిశాలో వ్యవసాయం, పరిశ్రమలు సహా వివిధ రంగాలకు చెందిన సుమారు 86 వేల మంది కార్మికులు తమ పనులకు హాజరయ్యేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. పని ప్రదేశాలకు కార్మికుల తరలింపులో యాజమాన్యాలు సరైన జాగ్రత్తలు, వ్యక్తిగత దూరం పాటించేలా చూడాలని సూచించింది.

వలస కూలీలు స్వరాష్ట్రానికి..

లాక్​డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వలస కూలీలను విడతల వారీగా స్వరాష్ట్రానికి తీసుకురావాలని యోగి సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే హరియాణాలో ఉన్న 2,224 మందిని 82 బస్సుల్లో యూపీకి చేర్చామన్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. మరో విడతలో 11 వేల మందిని తీసుకురానున్నట్లు ప్రకటించారు. వారంతా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'రాపిడ్​ టెస్ట్ కిట్లతో కరోనా పరీక్షలు నిర్వహించవద్దు'

లాక్​డౌన్ కారణంగా ప్రజలకు నిత్యావసర సరకుల కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఆవాసాలు, కాలనీల్లోని చిన్న దుకాణాలకు కేంద్రం అనుమతించింది. జాగ్రత్తలు పాటిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన మహారాష్ట్రలో మాత్రం మే 3 వరకూ లాక్​డౌన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం ఇచ్చిన అనుమతులపై అనేక సందేహాలున్నాయన్నారు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్​ తోపే. ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు.

గుజరాత్​లో...

గుజరాత్​లోనూ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో రెడ్ జోన్లుగా ఉన్న అహ్మదాబాద్ కార్పోరేషన్​ పరిధిలోని 6 వార్డుల్లో దుకాణాలు తెరిచేందుకు నగరపాలక సంస్థ నిరాకరించింది. మిగతా ప్రాంతాల్లో ఆంక్షలను సడలించి, దుకాణాలకు షరతులతో కూడిన అనుమతులిచ్చింది.

మమత నిర్ణయం కోసం

బంగాల్లో దుకాణాలకు అనుమతులు ఇచ్చే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఈ అంశంపై మమత సర్కారు ఓ నిర్ణయానికి రానున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్​లో..

మధ్యప్రదేశ్​లో​ దుకాణాలు తెరుచుకోవడం వల్ల వివిధ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి కనిపించింది. అయితే, హాట్​స్పాట్​లుగా ఉన్న ఇండోర్, భోపాల్, ఉజ్జెయిన్, జబల్పూర్ నగరాల్లో లాక్​డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలకు అనుమతినిచ్చే అంశంపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వనుందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

దేశ రాజధానిలో..

కేంద్రం అనుమతుల మేరకు ఆవాసాలు, కాలనీల్లోని చిన్న దుకాణాలు తెరిచేందుకు దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్​ జోన్లలోని దుకాణాలకు షరతులపై అనుమతించింది. రెడ్​జోన్లలో యథాతథ స్థితి కొనసాగుతుందని ప్రకటించింది.

ఒడిశాలో..

ఒడిశాలో వ్యవసాయం, పరిశ్రమలు సహా వివిధ రంగాలకు చెందిన సుమారు 86 వేల మంది కార్మికులు తమ పనులకు హాజరయ్యేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. పని ప్రదేశాలకు కార్మికుల తరలింపులో యాజమాన్యాలు సరైన జాగ్రత్తలు, వ్యక్తిగత దూరం పాటించేలా చూడాలని సూచించింది.

వలస కూలీలు స్వరాష్ట్రానికి..

లాక్​డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వలస కూలీలను విడతల వారీగా స్వరాష్ట్రానికి తీసుకురావాలని యోగి సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే హరియాణాలో ఉన్న 2,224 మందిని 82 బస్సుల్లో యూపీకి చేర్చామన్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. మరో విడతలో 11 వేల మందిని తీసుకురానున్నట్లు ప్రకటించారు. వారంతా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'రాపిడ్​ టెస్ట్ కిట్లతో కరోనా పరీక్షలు నిర్వహించవద్దు'

Last Updated : Apr 26, 2020, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.