జమ్ముకశ్మీర్ అనంత్నాగ్ జిల్లా కుంద్రూ ఆర్మీ ఆయుధ డిపోలో జరిగిన ఓ పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను పాలూ నివాసి ఫయాజ్ అహ్మద్ భట్, ఉత్తెర్సూ మైద్పాల్ ప్రాంతానికి చెందిన గుల్జార్ అహ్మద్ ఖాన్లుగా గుర్తించారు.
కశ్మీర్ లోయలో కుంద్రూ ఆయుధ డిపోనే అతిపెద్దది. 2007లోనూ కుంద్రూ ఆయుధ డిపోలో పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో పలువురు మృతి చెందారు.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో మాస్క్ల అపహరణ.. నిందితుడు ఫార్మాసిస్టే!