ETV Bharat / bharat

ప్రణాళిక మేరకే చంద్రయానం: ఇస్రో ఛైర్మన్ శివన్

ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మేరకే చంద్రయాన్ పయనిస్తోందని ప్రకటించారు ఇస్రో ఛైర్మన్ శివన్. జాబిల్లి తలంపై మరికొద్ది గంటల్లో విక్రమ్ ల్యాండర్ దిగనున్న నేపథ్యంలో వివిధ భాగాలు సజావుగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రయోగం విజయాన్ని ఆకాంక్షిస్తూ 130 కోట్లమంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రధాని మోదీ వరుస ట్వీట్లు చేశారు.

author img

By

Published : Sep 6, 2019, 3:33 PM IST

Updated : Sep 29, 2019, 3:52 PM IST

ప్రణాళిక మేరకే చంద్రయానం: ఇస్రో ఛైర్మన్ శివన్

భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంతరిక్ష కార్యక్రమం చంద్రయాన్-2. మరికొన్ని గంటల్లో జాబిల్లి తలంపై విక్రమ్ ల్యాండ్​ కానుంది. ఈ ప్రయోగం అంతా సజావుగా సాగుతోందని ప్రకటించారు ఇస్రో ఛైర్మన్ శివన్.

"మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అంతా ప్రణాళిక ప్రకారమే సాగుతోంది. మొట్టమొదటి సారి ఇలాంటి ప్రయోగం చేస్తున్న కారణంగా చంద్రయాన్-2 బృందం అందరిలో కచ్చితంగా ఉత్కంఠ ఉంటుంది."

- శివన్, ఇస్రో ఛైర్మన్

సెన్సర్లు, కంప్యూటర్లు, కమాండ్ సిస్టమ్స్ చక్కగా పనిచేస్తున్నాయని... జాబిల్లిపై ఉండే వాతవరణాన్ని సృష్టించి ప్రయోగాలు చేపట్టిన నేపథ్యంలో ప్రయోగం విజయవంతం కావడంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. చంద్రయాన్ ల్యాండింగ్ నవజాత శిశువును ఊయలలో ఉంచడం వంటిదన్నారు.

విక్రమ్ ల్యాండర్ తెల్లవారుజాము 1.30-2.30 నిమిషాల మధ్య ల్యాండ్ కానుంది. ప్రగ్యాన్ రోవర్ ఉదయం 5.30-6.30 నిమిషాల మధ్య విక్రమ్ నుంచి బయటకు రానుంది. తెల్లవారుజాము 1.10 నిమిషాల నుంచి ప్రయోగం లైవ్ ప్రసారం కానుంది.

చంద్రుడిపై ల్యాండర్ దిగే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రోలో ఉండనున్నారు. మోదీతో పాటు ఆన్​లైన్ క్విజ్​ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులు ఇస్రోలో చంద్రయాన్​ను వీక్షించనున్నారు.

మోదీ వరుస ట్వీట్లు...

చంద్రయాన్ ప్రయోగం విజయాన్ని కాంక్షిస్తూ వరుస ట్వీట్లు చేశారు ప్రధాని మోదీ. 130 కోట్ల మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, మన శాస్త్రవేత్తల పరాక్రమాన్ని ప్రపంచ దేశాలు మరోసారి చూడనున్నారని పేర్కొన్నారు. ఇస్రో క్విజ్​లో గెలిచిన చిన్నారులతో కలిసి, జాబిల్లిపై దిగే ప్రక్రియను చూడనున్నాను అని వెల్లడించిన మోదీ... ఆ క్షణాలను ప్రజలు వీక్షించాలని... సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు.

modi
మోదీ ట్వీట్

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ఇస్రో ఏం చేసినా ప్రత్యేకమే..!

భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంతరిక్ష కార్యక్రమం చంద్రయాన్-2. మరికొన్ని గంటల్లో జాబిల్లి తలంపై విక్రమ్ ల్యాండ్​ కానుంది. ఈ ప్రయోగం అంతా సజావుగా సాగుతోందని ప్రకటించారు ఇస్రో ఛైర్మన్ శివన్.

"మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అంతా ప్రణాళిక ప్రకారమే సాగుతోంది. మొట్టమొదటి సారి ఇలాంటి ప్రయోగం చేస్తున్న కారణంగా చంద్రయాన్-2 బృందం అందరిలో కచ్చితంగా ఉత్కంఠ ఉంటుంది."

- శివన్, ఇస్రో ఛైర్మన్

సెన్సర్లు, కంప్యూటర్లు, కమాండ్ సిస్టమ్స్ చక్కగా పనిచేస్తున్నాయని... జాబిల్లిపై ఉండే వాతవరణాన్ని సృష్టించి ప్రయోగాలు చేపట్టిన నేపథ్యంలో ప్రయోగం విజయవంతం కావడంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. చంద్రయాన్ ల్యాండింగ్ నవజాత శిశువును ఊయలలో ఉంచడం వంటిదన్నారు.

విక్రమ్ ల్యాండర్ తెల్లవారుజాము 1.30-2.30 నిమిషాల మధ్య ల్యాండ్ కానుంది. ప్రగ్యాన్ రోవర్ ఉదయం 5.30-6.30 నిమిషాల మధ్య విక్రమ్ నుంచి బయటకు రానుంది. తెల్లవారుజాము 1.10 నిమిషాల నుంచి ప్రయోగం లైవ్ ప్రసారం కానుంది.

చంద్రుడిపై ల్యాండర్ దిగే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రోలో ఉండనున్నారు. మోదీతో పాటు ఆన్​లైన్ క్విజ్​ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులు ఇస్రోలో చంద్రయాన్​ను వీక్షించనున్నారు.

మోదీ వరుస ట్వీట్లు...

చంద్రయాన్ ప్రయోగం విజయాన్ని కాంక్షిస్తూ వరుస ట్వీట్లు చేశారు ప్రధాని మోదీ. 130 కోట్ల మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, మన శాస్త్రవేత్తల పరాక్రమాన్ని ప్రపంచ దేశాలు మరోసారి చూడనున్నారని పేర్కొన్నారు. ఇస్రో క్విజ్​లో గెలిచిన చిన్నారులతో కలిసి, జాబిల్లిపై దిగే ప్రక్రియను చూడనున్నాను అని వెల్లడించిన మోదీ... ఆ క్షణాలను ప్రజలు వీక్షించాలని... సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు.

modi
మోదీ ట్వీట్

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ఇస్రో ఏం చేసినా ప్రత్యేకమే..!

Bengaluru, Sep 06 (ANI): While talking on Chandrayaan-2, Space Scientist RC Kapoor said that they are waiting for smooth and hazard free landing. "We have waiting for this day from a very long time and you may remember that Chandrayaan-2 has been proposed even before the Chandrayaan-1 was launched. Now it is ready and both gadgets are going on their respective orbits," he further added. Chandrayaan-2 Vikram lander will make a soft landing on the surface of the Moon in the early hours of Saturday (September 7). The Vikram lander is scheduled to make its soft landing between 1.30 am to 2.30 am.
Last Updated : Sep 29, 2019, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.