ETV Bharat / bharat

తిండి తినకుండా 16 ఏళ్లుగా 'టీ'తోనే!

మానవుని ప్రాథమిక అవసరాల్లో ఆహారం ఒకటి. ఒక్కపూట తినకపోతేనే.. రెండో పూట కాస్త తొందరగా తినేలా ప్రణాళికలేసుకుంటాం. లేదా చిరుతిళ్లు తినేందుకు ప్రయత్నిస్తుంటాం. అలాంటిది భోజనమే మానేసి.. 'టీ'తో 16 ఏళ్లుగా అద్భుతంగా జీవిస్తున్నాడో వ్యక్తి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం!

author img

By

Published : Jun 12, 2020, 5:12 PM IST

Everyone needs food to Survive but For this man Tea is Enough
తిండి తినకుండా పదహారేళ్లుగా 'టీ'తోనే!
తిండి తినకుండా పదహారేళ్లుగా 'టీ'తోనే!

జీవి మనుగడ కోసం తిండి చాలా అవసరం. ఆకలేసినా, వేయకపోయినా ఆరోగ్యంపై శ్రద్ధవహిస్తూ సమయానికి ఏదో ఒకటి తింటుంటారు చాలా మంది. ఏమీ తినకుండా ఒకరోజు.. మహా అయితే రెండు రోజులు ఉండొచ్చు. కానీ, కర్ణాటకకు చెందిన శ్రీశైల మాత్రం 16 ఏళ్ల నుంచి అసలు ఆహారమే లేకుండా.. కేవలం 'టీ'తో జీవనం సాగిస్తున్నాడు.

బెల్గాం జిల్లా నగనూరులో నివాసముండే 36 ఏళ్ల శ్రీశైల.. తన 20 ఏళ్ల వయస్సు నుంచి ఆహారం తీసుకోవడమే మానేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పనుల్లో నిమగ్నమయ్యే ఈ రైతు.. పూటకు ఓ కప్పు టీ తీసుకొని మిగతావారిలాగే అన్ని పనులు చేస్తుంటాడు.

ఆరోగ్య సమస్యలూ లేవాయే..

పదహారేళ్లుగా ఎన్నడూ ఆకలి వేయలేదని చెబుతున్న శ్రీశైలను చూసి గ్రామస్థులు విస్తుపోతున్నారు. ఈ విషయంపై తన కుటుంబ సభ్యులు.. ప్రముఖ వైద్యులకు చూపించారు. అయితే అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని తేల్చిచెప్పారా డాక్టర్లు. భోజనం మానేసి.. టీ తాగుతున్నందువల్ల ఎలాంటి ప్రమాదంలేదని భరోసా ఇచ్చారట.

ఇదీ చదవండి: ఏడేళ్ల కూతురి గొంతు కోసి.. తల్లి ఆత్మహత్య!

తిండి తినకుండా పదహారేళ్లుగా 'టీ'తోనే!

జీవి మనుగడ కోసం తిండి చాలా అవసరం. ఆకలేసినా, వేయకపోయినా ఆరోగ్యంపై శ్రద్ధవహిస్తూ సమయానికి ఏదో ఒకటి తింటుంటారు చాలా మంది. ఏమీ తినకుండా ఒకరోజు.. మహా అయితే రెండు రోజులు ఉండొచ్చు. కానీ, కర్ణాటకకు చెందిన శ్రీశైల మాత్రం 16 ఏళ్ల నుంచి అసలు ఆహారమే లేకుండా.. కేవలం 'టీ'తో జీవనం సాగిస్తున్నాడు.

బెల్గాం జిల్లా నగనూరులో నివాసముండే 36 ఏళ్ల శ్రీశైల.. తన 20 ఏళ్ల వయస్సు నుంచి ఆహారం తీసుకోవడమే మానేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పనుల్లో నిమగ్నమయ్యే ఈ రైతు.. పూటకు ఓ కప్పు టీ తీసుకొని మిగతావారిలాగే అన్ని పనులు చేస్తుంటాడు.

ఆరోగ్య సమస్యలూ లేవాయే..

పదహారేళ్లుగా ఎన్నడూ ఆకలి వేయలేదని చెబుతున్న శ్రీశైలను చూసి గ్రామస్థులు విస్తుపోతున్నారు. ఈ విషయంపై తన కుటుంబ సభ్యులు.. ప్రముఖ వైద్యులకు చూపించారు. అయితే అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని తేల్చిచెప్పారా డాక్టర్లు. భోజనం మానేసి.. టీ తాగుతున్నందువల్ల ఎలాంటి ప్రమాదంలేదని భరోసా ఇచ్చారట.

ఇదీ చదవండి: ఏడేళ్ల కూతురి గొంతు కోసి.. తల్లి ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.