ETV Bharat / bharat

ఆ విషయంలో భారత్​ కన్నా పాకిస్థాన్​ భేష్​: రాహుల్​

author img

By

Published : Oct 16, 2020, 11:04 AM IST

కరోనా వైరస్​ను కట్టడి చేయటంలో భారత్​ కన్నా పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ మంచి పనితీరును కనబరిచాయని పేర్కొన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఇది భాజపా ప్రభుత్వానికి మరో అతిపెద్ద ఘనత అంటూ ట్విట్టర్​లో విమర్శలు గుప్పించారు. దేశ వృద్ధి రేటును పొరుగు దేశాలతో పోలుస్తూ ఐఎంఎఫ్​ ఛార్ట్​ను ట్యాగ్​ చేశారు.

rahul gandhi
కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ

కేంద్ర ప్రభుత్వంపై మారోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది సుమారు 10.3 శాతం మేర క్షీణిస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్​) అంచనాలను పేర్కొంటూ.. ఇది ప్రభుత్వ అతిపెద్ద ఘనత అంటూ ఎద్దేవా చేశారు. కరోనా కట్టడిలో భారత్​ కన్నా పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ ముందున్నాయని పేర్కొంటూ ట్వీట్​ చేశారు.

2020-21 ఏడాదిలో బంగ్లాదేశ్​, మయన్మార్​, నేపాల్​, చైనా, భూటాన్​, పాకిస్థాన్​, శ్రీలంక, అఫ్గానిస్థాన్​, భారత్​ల వృద్ధి అంచనాల ఛార్ట్​ను తన ట్వీట్​కు ట్యాగ్​ చేశారు రాహుల్​.

" భాజపా ప్రభుత్వం సాధించిన మరో అతిపెద్ద ఘనత ఇది. కరోనా మహమ్మారిని భారత్​ కన్నా పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​లే బాగా కట్టడి చేయగలిగాయి. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్ర నేత

భారత వృద్ధిపై ఐఎంఎఫ్​ విడుదల చేసిన అంచనాలను సూచిస్తూ.. గత బుధవారం కూడా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్​. జీడీపీ తలసరి ఆదాయంలో భారత్​కు పొరుగుదేశం బంగ్లాదేశ్​ చేరువైందని ఎద్దేవా చేశారు. ఇది 6 సంవత్సరాల భాజపా విద్వేషపూరిత జాతీయవాద రాజకీయాల ఫలితమే అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఆ ఘనత భాజపా విద్వేష రాజకీయాలకు నిదర్శనం'

కేంద్ర ప్రభుత్వంపై మారోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది సుమారు 10.3 శాతం మేర క్షీణిస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్​) అంచనాలను పేర్కొంటూ.. ఇది ప్రభుత్వ అతిపెద్ద ఘనత అంటూ ఎద్దేవా చేశారు. కరోనా కట్టడిలో భారత్​ కన్నా పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ ముందున్నాయని పేర్కొంటూ ట్వీట్​ చేశారు.

2020-21 ఏడాదిలో బంగ్లాదేశ్​, మయన్మార్​, నేపాల్​, చైనా, భూటాన్​, పాకిస్థాన్​, శ్రీలంక, అఫ్గానిస్థాన్​, భారత్​ల వృద్ధి అంచనాల ఛార్ట్​ను తన ట్వీట్​కు ట్యాగ్​ చేశారు రాహుల్​.

" భాజపా ప్రభుత్వం సాధించిన మరో అతిపెద్ద ఘనత ఇది. కరోనా మహమ్మారిని భారత్​ కన్నా పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​లే బాగా కట్టడి చేయగలిగాయి. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్ర నేత

భారత వృద్ధిపై ఐఎంఎఫ్​ విడుదల చేసిన అంచనాలను సూచిస్తూ.. గత బుధవారం కూడా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్​. జీడీపీ తలసరి ఆదాయంలో భారత్​కు పొరుగుదేశం బంగ్లాదేశ్​ చేరువైందని ఎద్దేవా చేశారు. ఇది 6 సంవత్సరాల భాజపా విద్వేషపూరిత జాతీయవాద రాజకీయాల ఫలితమే అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఆ ఘనత భాజపా విద్వేష రాజకీయాలకు నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.