ETV Bharat / bharat

'అసమ్మతి' వెల్లడికి ఈసీ నిరాకరణ

ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆదేశాల్లో అసమ్మతి, మైనార్టీ అభిప్రాయాలను వెల్లడించాలన్న ఎన్నికల కమిషనర్​ అశోక్​ లావాసా డిమాండ్​ను ఈసీ 2-1 మెజారిటీతో తిరస్కరించింది. ఈ అభిప్రాయాలు రికార్డుల్లో ఉంటాయి కానీ ఆదేశాల్లో ఉండవని ఎన్నికల సంఘం పేర్కొంది.

author img

By

Published : May 22, 2019, 5:03 AM IST

Updated : May 22, 2019, 7:23 AM IST

అసమ్మతి వెల్లడికి ఈసీ నిరాకరణ
అసమ్మతి వెల్లడికి ఈసీ నిరాకరణ

ఎన్నికల ప్రవర్తనా నియామావళి ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో అసమ్మతి, మైనార్టీ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. ముగ్గురు సభ్యుల ప్యానెల్​లో ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడా, సుశీల్​ చంద్రలతో పాటు మరో సభ్యుడైన లావాసా ప్రతిపాదనను 2-1 మెజార్టీతో తోసిపుచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో తలెత్తిన సమస్యలపై ఎన్నికల సంఘం మంగళవారం సమావేశమైంది. అసమ్మతి, మైనార్టీ భిన్నాభిప్రాయాలు పోల్​ ప్యానెల్​ రికార్డుల్లో ఉంటాయి కానీ ఆదేశాల్లో ఉండవని పేర్కొంది.

పారదర్శకతే ముఖ్యం: లావాసా

తన ప్రతిపాదన వీగిపోవడంపై ఎన్నికల కమిషనర్​ అశోక్​ లావాసా స్పందించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన సంబంధిత ఆదేశాల్లో ఇప్పటికీ పారతదర్శకతే ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి కేసులను సమయానుకూలంగా పరిష్కరించాలని కోరారు. ఈ విషయంలో తన అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయన్నాయన్నారు లావాసా.

కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు

పలు ఎన్నికల ప్రచార ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షాలకు ఎన్నికల సంఘం క్లీన్​చిట్​ ఇవ్వటంపై లావాసా అసమ్మతి వ్యక్తం చేశారు. ఈసీ ఆదేశాల్లో అసమ్మతి అభిప్రాయాన్నీ వెల్లడించాలని డిమాండ్​ చేశారు.

మోదీ, షాలకు ఈసీ క్లీన్​ చిట్ తర్వాతి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులపై సమావేశాలకు లావాసా దూరంగా ఉంటున్నారు. ఈ అంశంపై ఈ నెల 4న ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడాకు ఆయన లేఖ రాశారు. మైనార్టీ నిర్ణయాలను వెల్లడించేంత వరకూ కమిషన్​ సమావేశాలకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి: ఎన్నికల ప్రచారం తీర్థయాత్రలా అనిపించింది: మోదీ

అసమ్మతి వెల్లడికి ఈసీ నిరాకరణ

ఎన్నికల ప్రవర్తనా నియామావళి ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో అసమ్మతి, మైనార్టీ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. ముగ్గురు సభ్యుల ప్యానెల్​లో ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడా, సుశీల్​ చంద్రలతో పాటు మరో సభ్యుడైన లావాసా ప్రతిపాదనను 2-1 మెజార్టీతో తోసిపుచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో తలెత్తిన సమస్యలపై ఎన్నికల సంఘం మంగళవారం సమావేశమైంది. అసమ్మతి, మైనార్టీ భిన్నాభిప్రాయాలు పోల్​ ప్యానెల్​ రికార్డుల్లో ఉంటాయి కానీ ఆదేశాల్లో ఉండవని పేర్కొంది.

పారదర్శకతే ముఖ్యం: లావాసా

తన ప్రతిపాదన వీగిపోవడంపై ఎన్నికల కమిషనర్​ అశోక్​ లావాసా స్పందించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన సంబంధిత ఆదేశాల్లో ఇప్పటికీ పారతదర్శకతే ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి కేసులను సమయానుకూలంగా పరిష్కరించాలని కోరారు. ఈ విషయంలో తన అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయన్నాయన్నారు లావాసా.

కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు

పలు ఎన్నికల ప్రచార ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షాలకు ఎన్నికల సంఘం క్లీన్​చిట్​ ఇవ్వటంపై లావాసా అసమ్మతి వ్యక్తం చేశారు. ఈసీ ఆదేశాల్లో అసమ్మతి అభిప్రాయాన్నీ వెల్లడించాలని డిమాండ్​ చేశారు.

మోదీ, షాలకు ఈసీ క్లీన్​ చిట్ తర్వాతి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులపై సమావేశాలకు లావాసా దూరంగా ఉంటున్నారు. ఈ అంశంపై ఈ నెల 4న ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడాకు ఆయన లేఖ రాశారు. మైనార్టీ నిర్ణయాలను వెల్లడించేంత వరకూ కమిషన్​ సమావేశాలకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి: ఎన్నికల ప్రచారం తీర్థయాత్రలా అనిపించింది: మోదీ

Bhopal (Madhya Pradesh), May 22 (ANI): Amid the allegations of opposition on the movements of EVMs (Electronic Voting Machines), Congress leader Digvijaya Singh on Tuesday visited the District Jail in Bhopal where an EVM strong room has been established. The opposition has intensified its criticism of EVMs ever since the exit polls predicted the return of NDA government at the centre, and while pointing to possible inaccuracies in the exit polls, the opposition has accused the government of manipulating the voting machines in order to get a favourable result.
Last Updated : May 22, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.