దేశ రాజధాని దిల్లీలో వాయునాణ్యత మళ్లీ క్షీణించింది. ఫిబ్రవరి తర్వాత తొలిసారి వాయునాణ్యత సూచీ 304గా నమోదైంది. పంజాబ్, హరియాణాతో పాటు పొరుగు దేశం పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడమే దీనికి ప్రధాన కారణమని కేంద్ర భూ విజ్ఞాన శాఖ తెలిపింది.
గాలులు ప్రశాంతంగా వీయడం, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల కాలుష్య కారకాలు పెరిగినట్లు దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీలోని సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు.