దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 70 స్థానాలకు జరిగిన పోలింగ్లో 672 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. 2015లో 67 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈసారి 6 గంటల వరకు 57.06 శాతానికే పరిమితమైంది. ఓటింగ్ శాతం తగ్గడంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా అనేక మంది ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, విదేశీ వ్యహరాల మంత్రి ఎస్ జైశంకర్, ఎన్నికల ప్రధాన అధికారు సునీల్ అరోడా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తమ ఓటును వినియోగించుకున్నారు.