ETV Bharat / bharat

'పార్లమెంట్ సమావేశాలపై త్వరలో నిర్ణయం'

author img

By

Published : Jul 12, 2020, 1:12 PM IST

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కచ్చితంగా జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. వీటిని ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

Decision on monsoon session of Parliament soon: Joshi
త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై నిర్ణయం: జోషి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

"కచ్చితంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. అయితే ఎప్పుడు అనేది త్వరలో నిర్ణయిస్తాం."

- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

కరోనా కారణంగా పార్లమెంట్ ఉభయ సభలను మార్చి 23 నుంచి నిరవధికంగా వాయిదా వేశారు. బడ్జెట్ సెషన్​ను కూడా కుదించారు.

సమయం ఉంది..

పార్లమెంట్ ఉభయ సభల నిర్వహణకు సెప్టెంబర్ వరకు సమయం ఉందని జోషి తెలిపారు. చాలా సార్లు ఆగస్టు చివరినాటికి లోక్​సభ, రాజ్యసభ సమావేశాలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

నిబంధనల ప్రకారం రెండు పార్లమెంట్ సమావేశాల మధ్య వ్యవధి 6 నెలలకు మించి ఉండకూడదు.

ఇదీ చూడండి: వర్చువల్​ కాదు.. భౌతికంగానే పార్లమెంట్​ సమావేశాలు!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

"కచ్చితంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. అయితే ఎప్పుడు అనేది త్వరలో నిర్ణయిస్తాం."

- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

కరోనా కారణంగా పార్లమెంట్ ఉభయ సభలను మార్చి 23 నుంచి నిరవధికంగా వాయిదా వేశారు. బడ్జెట్ సెషన్​ను కూడా కుదించారు.

సమయం ఉంది..

పార్లమెంట్ ఉభయ సభల నిర్వహణకు సెప్టెంబర్ వరకు సమయం ఉందని జోషి తెలిపారు. చాలా సార్లు ఆగస్టు చివరినాటికి లోక్​సభ, రాజ్యసభ సమావేశాలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

నిబంధనల ప్రకారం రెండు పార్లమెంట్ సమావేశాల మధ్య వ్యవధి 6 నెలలకు మించి ఉండకూడదు.

ఇదీ చూడండి: వర్చువల్​ కాదు.. భౌతికంగానే పార్లమెంట్​ సమావేశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.