కశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఓ జవానుకు గాయాలయ్యాయి. భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ముష్కరులు.
పుల్వామాలోని గాంగూ ప్రాంతంలో బలగాల తరలింపు జరుగుతుండగా పేలుడుకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. బాంబు బ్లాస్ట్ తర్వాతా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ముష్కరుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు భద్రతా సిబ్బంది.