ETV Bharat / bharat

జీఎస్​టీ, స్వచ్ఛభారత్​.. పథకాలే కాదు ఆవుల పేర్లు కూడా! - gst, swach bharat cows in samasthipur

ప్రేమగా పెంచుకునే ఆవులకు పేర్లు పెట్టి ఆప్యాయత చాటడం అనాదిగా వస్తున్న అలవాటే. బిహార్​లోని ఓ పాడిరైతు కూడా తన ఆవులకు పేర్లు పెట్టుకున్నాడు. అయితే, వాటికి పెట్టిన పేర్లు మాత్రం వినూత్నంగా ఉన్నాయి. మోదీ పథకాలు నచ్చి తన ఆవులకు కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లే పెట్టేశాడు ఆ రైతు. ఎందుకో మీరూ చూడండి..

Cows named after Central Government Schemes
జీఎస్​టీ, స్వచ్ఛభారత్​.. పథకాలే కాదు ఆవుల పేర్లు కూడా!
author img

By

Published : Feb 26, 2020, 11:47 AM IST

Updated : Mar 2, 2020, 3:05 PM IST

జీఎస్​టీ, స్వచ్ఛభారత్​.. పథకాలే కాదు ఆవుల పేర్లు కూడా!

పెద్దనోట్ల రద్దు, జీఎస్​టీ, ఆయుష్మాన్​ భారత్​, స్వచ్ఛభారత్​.. ఈ పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాలు, పథకాల పేర్లు గోవులకు పెడితే ఎలా ఉంటుంది? మీరు విన్నది నిజమే.. సరిగ్గా ఇలానే ఆలోచించాడు బిహార్ సమస్తిపుర్​కు చెందిన అజిత్​కుమార్​ ఝా అనే వ్యక్తి. అందుకే తన గోశాలలోని గోవులకు ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన ఈ పథకాల పేర్లే పెట్టుకున్నాడు.

సమస్తిపుర్​లోని సరైరంజన్​కు చెందిన అజిత్ కుమార్​ ఝా.. కొన్నేళ్ల క్రితం 3 ఆవులతో శివ గోశాలను ప్రారంభించాడు. అవే ఇప్పుడు 17 ఆవులుగా అభివృద్ధి చెందాయి. అయితే, ఈ ఆరేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఫిదా అయిపోయాడు అజిత్​. వాటిని గౌరవిస్తూ.. తనకెంతో ఇష్టమైన గోమాతలకు ఆ పథకాల పేర్లను పెట్టుకుని.. ముద్దుగా పిలుచుకుంటున్నాడు.

అజిత్​ మాత్రమే కాదు, ఈ పథకాల గోవులను చూసేందుకు గోశాలకు వచ్చే జనం.. అక్కడి పాలేర్లు అందరూ.. వాటిని ఇలాగే పిలుస్తారు. ఆవులు కూడా ఈ పేర్లకు అలవాటుపడిపోయాయి. జీఎస్​టీ, ఆయుష్మాన్​ అని పిలవగానే.. టక్కున స్పందిస్తున్నాయి.

ఇదీ చదవండి:వింత ఆచారం... పసి పిల్లలకు శునకాలతో వివాహం

జీఎస్​టీ, స్వచ్ఛభారత్​.. పథకాలే కాదు ఆవుల పేర్లు కూడా!

పెద్దనోట్ల రద్దు, జీఎస్​టీ, ఆయుష్మాన్​ భారత్​, స్వచ్ఛభారత్​.. ఈ పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాలు, పథకాల పేర్లు గోవులకు పెడితే ఎలా ఉంటుంది? మీరు విన్నది నిజమే.. సరిగ్గా ఇలానే ఆలోచించాడు బిహార్ సమస్తిపుర్​కు చెందిన అజిత్​కుమార్​ ఝా అనే వ్యక్తి. అందుకే తన గోశాలలోని గోవులకు ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన ఈ పథకాల పేర్లే పెట్టుకున్నాడు.

సమస్తిపుర్​లోని సరైరంజన్​కు చెందిన అజిత్ కుమార్​ ఝా.. కొన్నేళ్ల క్రితం 3 ఆవులతో శివ గోశాలను ప్రారంభించాడు. అవే ఇప్పుడు 17 ఆవులుగా అభివృద్ధి చెందాయి. అయితే, ఈ ఆరేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఫిదా అయిపోయాడు అజిత్​. వాటిని గౌరవిస్తూ.. తనకెంతో ఇష్టమైన గోమాతలకు ఆ పథకాల పేర్లను పెట్టుకుని.. ముద్దుగా పిలుచుకుంటున్నాడు.

అజిత్​ మాత్రమే కాదు, ఈ పథకాల గోవులను చూసేందుకు గోశాలకు వచ్చే జనం.. అక్కడి పాలేర్లు అందరూ.. వాటిని ఇలాగే పిలుస్తారు. ఆవులు కూడా ఈ పేర్లకు అలవాటుపడిపోయాయి. జీఎస్​టీ, ఆయుష్మాన్​ అని పిలవగానే.. టక్కున స్పందిస్తున్నాయి.

ఇదీ చదవండి:వింత ఆచారం... పసి పిల్లలకు శునకాలతో వివాహం

Last Updated : Mar 2, 2020, 3:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.