కరోనాపై ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ 'కొవిడ్ ఇండియా సేవా' అనే వినూత్న ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు సాయమందించడం, వైరస్పై తలెత్తే ప్రశ్నలకు వేగంగా సమాధానం ఇవ్వడం.. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. శిక్షణ పొందిన నిపుణులు ప్రజల ఆరోగ్య సమస్యలపై స్పందిస్తారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
![COVID India Seva launched by health minister harshavarshan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885670_fsds.jpg)
వైరస్ నియంత్రణ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల అభిప్రాయాల్ని సేకరించడం, కొవిడ్ లక్షణాలున్నవారు ఎక్కడికి వెళ్లాలో తెలియకపోతే.. మార్గదర్శకాలు చేయడం ఈ ప్లాట్ఫాం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. సమాచారాన్ని పంచుకునే సమయంలో వ్యక్తిగత వివరాలు తెలపాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
![COVID India Seva launched by health minister harshavarshan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885670_feds.jpg)