దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. సోమవారం ఒక్కరోజు 55,079 మందికి వైరస్ సోకింది. మరో 876 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 27లక్షలను అధిగమించింది.
![Coronavirus news cases and deaths reported in India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8459148_covid-19.png)
మహమ్మారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. కొవిడ్ మరణాల రేటు కూడా క్రమంగా క్షీణిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది.