దేశంలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. కొత్తగా 78,761 కరోనా కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి ధాటికి మరో 948 మంది బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 35 లక్షల మార్కు దాటింది.
![Corona cases tally crosses 35 lakh mark with a spike of 78,761 new cases and 948 deaths in the last 24 hours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8611362_coronacasesinindia.jpg)
మెరుగవుతున్న రికవరీ రేటు
పెరుగుతున్న పాజిటివ్ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.61 శాతానికి పెరిగింది. మరణాల రేటు కూడా మరింత ఊరటనిస్తూ 1.79 శాతానికి పడిపోయింది.
ఇదీ చదవండి: ఏడు రాష్ట్రాల్లోనే 81 శాతం కరోనా మరణాలు