దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, కర్ణాటకలో కేసుల పెరుగుదల తీవ్రంగా ఉంది. దేశంలో కరోనా వైరస్ ధాటికి మరో 482మంది బలయ్యారు. కొత్తగా 22,752 మందికి కరోనా నిర్ధరణ అయింది.
- మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,17,121కి చేరింది. 9250మంది వైరస్కు బలయ్యారు.
- తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1,18,594కు పెరిగింది. 1,636 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,02,831 గా ఉంది. మొత్తంగా 3,165మంది మృతి చెందారు.
- గుజరాత్లో మొత్తంగా 37,550 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 1,977 మంది కరోనా కారణంగా చనిపోయారు
- దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 4లక్షల 73వేలమందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఒక్క మంగళవారం రోజే 2,62,679 పరీక్షలు చేశారు.
ఇదీ చూడండి: అరుణాచల్ కేంద్రంగా డ్రాగన్ వ్యూహాలు!