ETV Bharat / bharat

భారత్-చైనా చర్చల పురోగతికి అడ్డుగా పాంగాంగ్!

భారత్​- చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నా పాంగాంగ్​ సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉంది. పాంగాంగ్​ సరస్సు ఉత్తర ప్రాంతం ప్రధాన అడ్డంకిగా ఉంది. ఫింగర్ 5 ప్రాంతం నుంచి చైనా మరింత వెనక్కి వెళ్లే అవకాశమున్నా... ఫింగర్ 4 లో స్థావరాన్ని ఖాళీ చేయడానికి చైనా నిరాకరిస్తోంది.

author img

By

Published : Aug 5, 2020, 11:21 AM IST

Pangong
పాంగాంగ్

భారత్​- చైనా మధ్య చర్చల పురోగతికి పాంగాంగ్ సరస్సు సమస్య తీవ్ర అడ్డంకిగా మారింది. భారత్​- చైనా మధ్య ఆదివారం జరిగిన కమాండర్ స్థాయి చర్చల్లోనూ పాంగాంగ్​ విషయమే సమస్యగా మారిందని ఈటీవీ భారత్​తో ఓ సైనికాధికారి వెల్లడించారు.

"రెండు దేశాల మధ్య ఇంకా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సి ఉంది. పాంగాంగ్​ ఉత్తర ప్రాంతం ముఖ్యమైనది. ఫింగర్​ 5 నుంచి చైనా వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. కానీ, ఫింగర్​ 4 వద్ద తన స్థావరాన్ని ఖాళీ చేసేందుకు అంగీకరించటం లేదు."

- సైనికాధికారి

సరిహద్దుల్లోని చుశుల్​-మోల్డో ప్రాంతంలో ఆదివారం భారత్, చైనా మధ్య ఐదో దఫా కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు దేశాలు వారి అజెండాలపై దృఢంగా నిలవటం వల్ల పరిష్కారానికి సవాలుగా మారుతోంది. ఈ సమావేశ వివరాలను పొందిన తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ నేతృత్వంలోని చైనా స్టడీ గ్రూప్​ చర్చించింది.

ఫింగర్​ 4 నుంచి..

గల్వాన్ లోయ (పీపీ 14), హాట్ స్ప్రింగ్స్​ (పీపీ 15), గోగ్రా (పీపీ 17) ప్రాంతాల నుంచి ఇరు దేశాలు బలగాలను వెనక్కు పిలిచాయి. పాంగాంగ్ వద్ద మాత్రం పాక్షికంగా ఉపసంహరణ జరిగింది. ఫింగర్​ 4 వద్ద ఇప్పటికీ ఒక స్థావరాన్ని చైనా నిర్వహిస్తోంది.

ఫింగర్​ 8 వద్ద వాస్తవాధీన రేఖ ఉందని భారత్ వాదిస్తోంది. చైనా మాత్రం ఫింగర్​ 3 వరకు తమ భూభాగమేనని చెబుతోంది. గతంలో ఫింగర్ 8 నుంచి ఫింగర్​ 4 వరకు చైనా. ​ఫింగర్ 1 నుంచి 4 వరకు భారత్ గస్తీ నిర్వహించేవి.

(రచయిత- సంజీవ్ బారువా)

భారత్​- చైనా మధ్య చర్చల పురోగతికి పాంగాంగ్ సరస్సు సమస్య తీవ్ర అడ్డంకిగా మారింది. భారత్​- చైనా మధ్య ఆదివారం జరిగిన కమాండర్ స్థాయి చర్చల్లోనూ పాంగాంగ్​ విషయమే సమస్యగా మారిందని ఈటీవీ భారత్​తో ఓ సైనికాధికారి వెల్లడించారు.

"రెండు దేశాల మధ్య ఇంకా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సి ఉంది. పాంగాంగ్​ ఉత్తర ప్రాంతం ముఖ్యమైనది. ఫింగర్​ 5 నుంచి చైనా వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. కానీ, ఫింగర్​ 4 వద్ద తన స్థావరాన్ని ఖాళీ చేసేందుకు అంగీకరించటం లేదు."

- సైనికాధికారి

సరిహద్దుల్లోని చుశుల్​-మోల్డో ప్రాంతంలో ఆదివారం భారత్, చైనా మధ్య ఐదో దఫా కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు దేశాలు వారి అజెండాలపై దృఢంగా నిలవటం వల్ల పరిష్కారానికి సవాలుగా మారుతోంది. ఈ సమావేశ వివరాలను పొందిన తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ నేతృత్వంలోని చైనా స్టడీ గ్రూప్​ చర్చించింది.

ఫింగర్​ 4 నుంచి..

గల్వాన్ లోయ (పీపీ 14), హాట్ స్ప్రింగ్స్​ (పీపీ 15), గోగ్రా (పీపీ 17) ప్రాంతాల నుంచి ఇరు దేశాలు బలగాలను వెనక్కు పిలిచాయి. పాంగాంగ్ వద్ద మాత్రం పాక్షికంగా ఉపసంహరణ జరిగింది. ఫింగర్​ 4 వద్ద ఇప్పటికీ ఒక స్థావరాన్ని చైనా నిర్వహిస్తోంది.

ఫింగర్​ 8 వద్ద వాస్తవాధీన రేఖ ఉందని భారత్ వాదిస్తోంది. చైనా మాత్రం ఫింగర్​ 3 వరకు తమ భూభాగమేనని చెబుతోంది. గతంలో ఫింగర్ 8 నుంచి ఫింగర్​ 4 వరకు చైనా. ​ఫింగర్ 1 నుంచి 4 వరకు భారత్ గస్తీ నిర్వహించేవి.

(రచయిత- సంజీవ్ బారువా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.