ETV Bharat / bharat

అన్నమలై గుహలో ఆ చైనీయుడు ఏం చేస్తున్నాడు?

author img

By

Published : Apr 18, 2020, 6:30 AM IST

Updated : Apr 21, 2020, 2:14 PM IST

యావత్​ ప్రపంచం చైనాను కరోనా జన్మస్థానంగా చూస్తున్న వేళ... అదే దేశానికి చెందిన ఓ వ్యక్తి తమిళనాడు గుహలో దొరికాడు. 10 రోజులుగా ఒంటరిగా నివసిస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొవిడ్​-19 పరీక్షలు నిర్వహించారు. ఇంతకీ ఆ చైనా వ్యక్తి భారతలోని గుహలో ఎందుకు దాక్కున్నాడు?

China man living alone in cave due to lockdown caught
అన్నమలై గుహలో ఆ చైనీయుడు ఏం చేస్తున్నాడు?

తమిళనాడులోని అన్నమలై​ కొండ మీద.. ఓ గుహలో ఒంటరిగా నివసిస్తున్న చైనీయుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

దర్శనానికి వచ్చి...

చైనాలోని బీజింగ్​కు చెందిన యౌరుయి యాంగ్​(35).. కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని తిరువన్నమలై ఆలయాన్ని దర్శించుకునేందుకు భారత్​కు వచ్చాడు. ఆలయ మహిమల గురించి తెలుసుకున్న యౌరుయి యాంగ్ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడట. అలా ఫిబ్రవరి 26న ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ.. ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు.

గుహ గూడాయే..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దెబ్బకి.. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని పట్టుబట్టాడు యాంగ్​ ఇంటి యజమాని. తప్పని పరిస్థితుల్లో అద్దె ఇంటిని వీడాడు. కానీ కరోనా అపోహలతో.. చైనాకు చెందిన అతడికి ఆశ్రయమిచ్చేందుకు హోటళ్లు, లాడ్జీలు ససేమీరా అన్నాయి.

ఎక్కడికి వెళ్లాలో తెలియక... ఓ పర్యటక గైడ్​ సలహా మేరకు అన్నమలై కొండపైనున్న విరూపాక్ష గుహకు చేరుకున్నాడు. గుహనే గూడుగా చేసుకుని 10 రోజులుగా అందులోనే నివాసముంటున్నాడు. కేవలం మంచి నీరు, బిస్కట్లతో కాలం వెళ్లదీస్తున్నాడు.

China man living alone in cave due to lockdown caught
అన్నమలై గుహలో ఆ చైనీయుడు ఏం చేస్తున్నాడు?

స్థానికుల సమాచారం మేరకు విరూపాక్ష గుహకు చేరుకున్న పోలీసులు.. యాంగ్​ను అదుపులోనికి తీసుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లి అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తు యాంగ్​ శరీరంలో కరోనా లేనట్లు వైద్యులు నిర్ధరించారు.

దిక్కుతోచని స్థితిలో ఉన్న యాంగ్​కు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ కందసామి. స్వదేశానికి చేరుకునే వరకు జాగ్రత్తగా చూసుకుంటామన్నారు. ప్రస్తుతం యాంగ్​.. రమణ మహర్షి రంగమ్మల్​ ఆసుపత్రిలో క్వారంటైన్​లో ఉన్నాడు. ​

ఇదీ చదవండి:ఆ ఇద్దరు అర్చకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్​!

తమిళనాడులోని అన్నమలై​ కొండ మీద.. ఓ గుహలో ఒంటరిగా నివసిస్తున్న చైనీయుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

దర్శనానికి వచ్చి...

చైనాలోని బీజింగ్​కు చెందిన యౌరుయి యాంగ్​(35).. కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని తిరువన్నమలై ఆలయాన్ని దర్శించుకునేందుకు భారత్​కు వచ్చాడు. ఆలయ మహిమల గురించి తెలుసుకున్న యౌరుయి యాంగ్ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడట. అలా ఫిబ్రవరి 26న ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ.. ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు.

గుహ గూడాయే..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దెబ్బకి.. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని పట్టుబట్టాడు యాంగ్​ ఇంటి యజమాని. తప్పని పరిస్థితుల్లో అద్దె ఇంటిని వీడాడు. కానీ కరోనా అపోహలతో.. చైనాకు చెందిన అతడికి ఆశ్రయమిచ్చేందుకు హోటళ్లు, లాడ్జీలు ససేమీరా అన్నాయి.

ఎక్కడికి వెళ్లాలో తెలియక... ఓ పర్యటక గైడ్​ సలహా మేరకు అన్నమలై కొండపైనున్న విరూపాక్ష గుహకు చేరుకున్నాడు. గుహనే గూడుగా చేసుకుని 10 రోజులుగా అందులోనే నివాసముంటున్నాడు. కేవలం మంచి నీరు, బిస్కట్లతో కాలం వెళ్లదీస్తున్నాడు.

China man living alone in cave due to lockdown caught
అన్నమలై గుహలో ఆ చైనీయుడు ఏం చేస్తున్నాడు?

స్థానికుల సమాచారం మేరకు విరూపాక్ష గుహకు చేరుకున్న పోలీసులు.. యాంగ్​ను అదుపులోనికి తీసుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లి అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తు యాంగ్​ శరీరంలో కరోనా లేనట్లు వైద్యులు నిర్ధరించారు.

దిక్కుతోచని స్థితిలో ఉన్న యాంగ్​కు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ కందసామి. స్వదేశానికి చేరుకునే వరకు జాగ్రత్తగా చూసుకుంటామన్నారు. ప్రస్తుతం యాంగ్​.. రమణ మహర్షి రంగమ్మల్​ ఆసుపత్రిలో క్వారంటైన్​లో ఉన్నాడు. ​

ఇదీ చదవండి:ఆ ఇద్దరు అర్చకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్​!

Last Updated : Apr 21, 2020, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.