ETV Bharat / bharat

'చైనా దృష్టిలో భారత్ ప్రత్యర్థి కాదు... శత్రువు'

author img

By

Published : Jun 20, 2020, 2:14 PM IST

చైనా సైనిక చర్యలను గమనిస్తే దక్షిణాసియా పట్ల తన దృష్టిని మార్చుకున్నట్లు స్పష్టమవుతోందని రక్షణ రంగ నిపుణులు విక్రమ్​ జిత్​ సింగ్​ విశ్లేషించారు. డ్రాగన్ దేశం భారత్​ను శత్రువుగా భావిస్తోందని ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖిలో చెప్పారు. సరిహద్దులో వివాదం కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కోవటం మోదీ ప్రభుత్వానికి కష్టతరమన్నారు.

'China elevated India from rival to enemy'
'భారత్​ను చైనా శత్రువుగా భావిస్తోంది'

చైనా పక్కా ప్రణాళికతోనే లద్దాఖ్​ సరిహద్దులో దుస్సాహసానికి పాాల్పడిందని అభిప్రాయపడ్డారు​ రక్షణ రంగ నిపుణులు విక్రమ్​ జిత్​ సింగ్​. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈటీవీ భారత్​తో ఈ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడారు. దక్షిణాసియా పట్ల చైనా దృష్టి మారిందని, ప్రత్యర్థిలా కాకుండా భారత్​ను శత్రువులా చూస్తోందన్నారు.

భౌగోళిక వ్యూహాత్మక దృష్టిని చైనా మార్చుకుంటోందని, అందుకే ముందస్తు వ్యూహ రచనతోనే తూర్పు లద్ధాఖ్​లో దురాగతాలకు పాల్పడుతోందని సింగ్​ వివరించారు. భారత సైనికులతో ఘర్షణకు దిగడానికి ముందు తమ దేశ ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడకుండా చైనా తెలివిగా వ్యవహరించిందని పేర్కొన్నారు. చైనా ఉద్దేశాన్ని భారత్​ వ్యూహాత్మకంగా సరిగ్గా అంచనా వేయలేకపోయిందని, సైనిక-రాజకీయ నాయకత్వం అర్థం చేసుకోలేకపోయిందని సింగ్​ విశ్లేషించారు.

భారత భౌగోళిక-వ్యూహాత్మక, రాజకీయ-వ్యూహాత్మక మార్పులే చైనా భౌగోళిక-వ్యూహాత్మక దృష్టిని మార్చుకునేలా చేశాయని సింగ్​ తెలిపారు. సరిహద్దు వివాదంపై చైనా ఆలోచన పూర్తిగా మారిందని.. చర్చలు జరిపేందుకు, బలగాలను ఉపసంహరించుకునే విషయంలో వారు వెనక్కి తగ్గే అవకాశాలే కన్పించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో చొరబాట్లు జరిగినప్పుడు చర్చల అనంతరం కార్యకలాపాలను చైనా ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని, భారీగా బలగాలను మోహరించిందని సింగ్​ స్పష్టం చేశారు.

ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి

"భారత్​, చైనా సైనిక శక్తిలో చాలా వ్యత్యాసం ఉంది. సంప్రదాయేతర క్రూజ్, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యంలో వారు ముందున్నారు. నింగి, నేల, సముద్రం సహా ఆరు క్షేత్రాల్లో వారు యుద్ధం చేయగలరు. భారత సైన్యం ఇప్పుడు ఒత్తిడిలో ఉంది. లద్దాఖ్​ సహా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో భారీగా బలగాలను మోహరించాల్సిన అవసరం ఉంది. ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాల మధ్య వివాదం తలెత్తింది. లాద్దాఖ్​లో చైనాకే కాస్త పట్టు పెరిగింది. 2017 డోక్లాం ఘటన తర్వాత 2లక్షల మంది బలగాలతో టిబెటన్ ప్రాంతాల్లో అభ్యాసాలు నిర్వహిస్తోంది. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన తర్వాతే చైనా వైఖరిలో మార్పు వచ్చింది. బాలాకోట్​లో భారత వాయుసేన దాడుల అనంతరం చైనా చేసిన ప్రకటనల్లో ఆంతర్యాన్ని మనం గ్రహించలేకపోయాం. వారు అప్పటి నుంచే స్పష్టతతో ఉన్నారు. సరిహద్ధులో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితును ఎదుర్కోవడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమే "

-విక్రమ్​ జిత్​ సింగ్​, రక్షణ రంగ నిపుణులు.

ఇదీ చూడండి: 'సమయాన్ని వృథా చేశారు- ఫలితమే 20 మంది మృతి'

చైనా పక్కా ప్రణాళికతోనే లద్దాఖ్​ సరిహద్దులో దుస్సాహసానికి పాాల్పడిందని అభిప్రాయపడ్డారు​ రక్షణ రంగ నిపుణులు విక్రమ్​ జిత్​ సింగ్​. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈటీవీ భారత్​తో ఈ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడారు. దక్షిణాసియా పట్ల చైనా దృష్టి మారిందని, ప్రత్యర్థిలా కాకుండా భారత్​ను శత్రువులా చూస్తోందన్నారు.

భౌగోళిక వ్యూహాత్మక దృష్టిని చైనా మార్చుకుంటోందని, అందుకే ముందస్తు వ్యూహ రచనతోనే తూర్పు లద్ధాఖ్​లో దురాగతాలకు పాల్పడుతోందని సింగ్​ వివరించారు. భారత సైనికులతో ఘర్షణకు దిగడానికి ముందు తమ దేశ ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడకుండా చైనా తెలివిగా వ్యవహరించిందని పేర్కొన్నారు. చైనా ఉద్దేశాన్ని భారత్​ వ్యూహాత్మకంగా సరిగ్గా అంచనా వేయలేకపోయిందని, సైనిక-రాజకీయ నాయకత్వం అర్థం చేసుకోలేకపోయిందని సింగ్​ విశ్లేషించారు.

భారత భౌగోళిక-వ్యూహాత్మక, రాజకీయ-వ్యూహాత్మక మార్పులే చైనా భౌగోళిక-వ్యూహాత్మక దృష్టిని మార్చుకునేలా చేశాయని సింగ్​ తెలిపారు. సరిహద్దు వివాదంపై చైనా ఆలోచన పూర్తిగా మారిందని.. చర్చలు జరిపేందుకు, బలగాలను ఉపసంహరించుకునే విషయంలో వారు వెనక్కి తగ్గే అవకాశాలే కన్పించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో చొరబాట్లు జరిగినప్పుడు చర్చల అనంతరం కార్యకలాపాలను చైనా ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని, భారీగా బలగాలను మోహరించిందని సింగ్​ స్పష్టం చేశారు.

ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి

"భారత్​, చైనా సైనిక శక్తిలో చాలా వ్యత్యాసం ఉంది. సంప్రదాయేతర క్రూజ్, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యంలో వారు ముందున్నారు. నింగి, నేల, సముద్రం సహా ఆరు క్షేత్రాల్లో వారు యుద్ధం చేయగలరు. భారత సైన్యం ఇప్పుడు ఒత్తిడిలో ఉంది. లద్దాఖ్​ సహా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో భారీగా బలగాలను మోహరించాల్సిన అవసరం ఉంది. ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాల మధ్య వివాదం తలెత్తింది. లాద్దాఖ్​లో చైనాకే కాస్త పట్టు పెరిగింది. 2017 డోక్లాం ఘటన తర్వాత 2లక్షల మంది బలగాలతో టిబెటన్ ప్రాంతాల్లో అభ్యాసాలు నిర్వహిస్తోంది. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన తర్వాతే చైనా వైఖరిలో మార్పు వచ్చింది. బాలాకోట్​లో భారత వాయుసేన దాడుల అనంతరం చైనా చేసిన ప్రకటనల్లో ఆంతర్యాన్ని మనం గ్రహించలేకపోయాం. వారు అప్పటి నుంచే స్పష్టతతో ఉన్నారు. సరిహద్ధులో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితును ఎదుర్కోవడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమే "

-విక్రమ్​ జిత్​ సింగ్​, రక్షణ రంగ నిపుణులు.

ఇదీ చూడండి: 'సమయాన్ని వృథా చేశారు- ఫలితమే 20 మంది మృతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.