ETV Bharat / bharat

'వలస కూలీల పట్ల కేంద్రం ఆదేశాలు పాటించాల్సిందే'

author img

By

Published : Apr 30, 2020, 9:00 PM IST

Updated : Apr 30, 2020, 9:37 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకునేందుకు జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు తప్పక పాటించాలని స్పష్టం చేసింది కేంద్రం. సరకులు రవాణా చేసే ట్రక్కులకు ఆయా రాష్ట్రాలో ప్రత్యేక అనుమతులు అవసరం లేదని ఎంహెచ్​ఏ ప్రకటన విడుదల చేసింది.

migrant workers
కేంద్రం మార్గదర్శకాలు

ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకునేందుకు జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు తప్పక పాటించాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కార్మికుల ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేకంగా నోడల్​ అధికారులను నియమించాలని రాష్ట్రాలకు సూచించింది. ఆకలితో అలమటిస్తున్న తమను సొంతూళ్లకు పంపాలని దేశవ్యాప్తంగా కార్మికులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

కేంద్రం మార్గదర్శకాలు..

  • కార్మికులు, విద్యార్థులు, పర్యటకులు, భక్తులు సొంత రాష్ట్రాలకు చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలి
  • బస్సుల ద్వారా మాత్రమే ప్రయాణం చేయాలి.
  • ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించి, ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు నిర్ధరించాకే అనుమతించాలి.
  • బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చూడాలి. వాటిని శానిటైజర్లతో శుభ్రం చేయాలి.
  • ప్రతిఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
  • సొంత రాష్ట్రాలకు చేరుకున్నాక అక్కడి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించాలి.
  • క్వారంటైన్​ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుంటే ఇళ్లకు పంపాలి. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండేలా చూడాలి.

గూడ్స్​ ట్రక్కులకు అనుమతి అవసరం లేదు

లాక్​డౌన్​ సమయంలో సరకులు రవాణా చేస్తున్న ట్రక్కులకు ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డ్రైవర్లకు లైసెన్స్ ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. సరకును లోడ్​ చేసుకోవడానికి వెళ్లినా, అన్​లోడ్ చేసి వస్తున్నా అధికారులకు ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

trucks
ఎంహెచ్​ఏ నోటీస్​

ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకునేందుకు జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు తప్పక పాటించాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కార్మికుల ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేకంగా నోడల్​ అధికారులను నియమించాలని రాష్ట్రాలకు సూచించింది. ఆకలితో అలమటిస్తున్న తమను సొంతూళ్లకు పంపాలని దేశవ్యాప్తంగా కార్మికులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

కేంద్రం మార్గదర్శకాలు..

  • కార్మికులు, విద్యార్థులు, పర్యటకులు, భక్తులు సొంత రాష్ట్రాలకు చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలి
  • బస్సుల ద్వారా మాత్రమే ప్రయాణం చేయాలి.
  • ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించి, ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు నిర్ధరించాకే అనుమతించాలి.
  • బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చూడాలి. వాటిని శానిటైజర్లతో శుభ్రం చేయాలి.
  • ప్రతిఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
  • సొంత రాష్ట్రాలకు చేరుకున్నాక అక్కడి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించాలి.
  • క్వారంటైన్​ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుంటే ఇళ్లకు పంపాలి. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండేలా చూడాలి.

గూడ్స్​ ట్రక్కులకు అనుమతి అవసరం లేదు

లాక్​డౌన్​ సమయంలో సరకులు రవాణా చేస్తున్న ట్రక్కులకు ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డ్రైవర్లకు లైసెన్స్ ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. సరకును లోడ్​ చేసుకోవడానికి వెళ్లినా, అన్​లోడ్ చేసి వస్తున్నా అధికారులకు ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

trucks
ఎంహెచ్​ఏ నోటీస్​
Last Updated : Apr 30, 2020, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.