ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్పై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
వీడియోనే మూలం...
2016లో ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన ఉన్నప్పటి ఓ వీడియో ఈ కేసుకు మూలమైంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావటానికి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై రావత్ చర్చించినట్లు ఆ వీడియోలో ఉంది.
వీడియో ఆధారంగా ప్రాథమిక విచారణ పూర్తి చేసిన సీబీఐ... ఇటీవలే ఉత్తరాఖండ్ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... రావత్పై కేసు నమోదు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది.