ETV Bharat / bharat

గుండె ఆగకముందే దానం చేసిన దేవుడు - Brain dead man's organs to save five lives odisha

గుజరాత్​ సూరత్​లో అవయదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాడు ఒడిశాకు చెందిన ఆ దయాశీలి. ఇంటిపెద్దకు బ్రెయిన్​డెడ్​ అయితే..​ అతడి గుండె, కిడ్నీ, లివర్​, రెండు కళ్లను దానం చేసేందుకు అంగీకరించిన ఆ కుటుంబం త్యాగం వర్ణనాతీతం.

brain dead man of odish gave new life to 5 people by donating heart and other organs in surat kiran hospital
గుండె ఆగకముందే దానం చేసిన దేవుడు
author img

By

Published : Mar 16, 2020, 10:46 AM IST

Updated : Mar 16, 2020, 12:42 PM IST

గుండె ఆగకముందే దానం చేసిన దేవుడు

ఓ మనిషి చనిపోయాక అవయవదానం చేయడమే గొప్ప విషయం. మరి ప్రాణాలతో ఉండగానే, జీవం ఉన్న గుండెను మరొకరికి దానం చేయడమంటే? అంతకన్నా మహోన్నతమైనది ఏదైనా ఉంటుందా? ఒడిశాకు చెందిన బిపిన్​ రఘు ప్రాణమున్న గుండె మాత్రమే కాదు, రెండు కళ్లు, లివర్​, కిడ్నీలనూ తృణప్రాయంగా దానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటాడు.

ఒడిశాకు చెందిన బిపిన్ పొట్టకూటి కోసం కుటుంబంతోపాటు గుజరాత్​ సూరత్​కు వచ్చి భేస్తాన్​ విస్తార్​లో​ స్థిరపడ్డాడు. 49 ఏళ్ల బిపిన్​ ఈ నెల​ 9వ తేదీన ​ ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళితే.. సీటీ స్కాన్​ చేసి మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. ఇలా బ్రెయిన్​డెడ్​ అయినవారు తిరిగి కోలుకునే అవకాశం దాదాపు ఉండదని చెప్పేశారు.

వెలకట్టలేని త్యాగం...

ముందు గుండెలు పగిలేలా రోధించిన బిపిన్​ భార్య, కుమార్తె, కుమారులు.. వైద్యుల సూచన మేరకు మరో ఐదుగురికి ప్రాణం పోసేందుకు సిద్ధపడ్డారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి బిపిన్​ అవయవాలను దానం చేసేందుకు మనఃస్ఫూర్తిగా అంగీకరించారు. బిపిన్​, కుటుంబసభ్యుల త్యాగానికి ఆసుపత్రిలోని వైద్యులు సైతం సలాం చేశారు.

డొనేట్​ లైఫ్​ సంస్థ ఆధ్వర్యంలో విజయవంతంగా బిపిన్​ గుండెను శరీరం నుంచి వేరు చేశారు కిరన్​ ఆసుపత్రి వైద్యులు. గ్రీన్​ కారిడార్​ సాయంతో గుండెను అహ్మదాబాద్​కు తరలించారు.

ఇదీ చదవండి:'జాతకం చూసి మేము 350 సీట్లు గెలుస్తామని చెప్పాడు'

గుండె ఆగకముందే దానం చేసిన దేవుడు

ఓ మనిషి చనిపోయాక అవయవదానం చేయడమే గొప్ప విషయం. మరి ప్రాణాలతో ఉండగానే, జీవం ఉన్న గుండెను మరొకరికి దానం చేయడమంటే? అంతకన్నా మహోన్నతమైనది ఏదైనా ఉంటుందా? ఒడిశాకు చెందిన బిపిన్​ రఘు ప్రాణమున్న గుండె మాత్రమే కాదు, రెండు కళ్లు, లివర్​, కిడ్నీలనూ తృణప్రాయంగా దానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటాడు.

ఒడిశాకు చెందిన బిపిన్ పొట్టకూటి కోసం కుటుంబంతోపాటు గుజరాత్​ సూరత్​కు వచ్చి భేస్తాన్​ విస్తార్​లో​ స్థిరపడ్డాడు. 49 ఏళ్ల బిపిన్​ ఈ నెల​ 9వ తేదీన ​ ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళితే.. సీటీ స్కాన్​ చేసి మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. ఇలా బ్రెయిన్​డెడ్​ అయినవారు తిరిగి కోలుకునే అవకాశం దాదాపు ఉండదని చెప్పేశారు.

వెలకట్టలేని త్యాగం...

ముందు గుండెలు పగిలేలా రోధించిన బిపిన్​ భార్య, కుమార్తె, కుమారులు.. వైద్యుల సూచన మేరకు మరో ఐదుగురికి ప్రాణం పోసేందుకు సిద్ధపడ్డారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి బిపిన్​ అవయవాలను దానం చేసేందుకు మనఃస్ఫూర్తిగా అంగీకరించారు. బిపిన్​, కుటుంబసభ్యుల త్యాగానికి ఆసుపత్రిలోని వైద్యులు సైతం సలాం చేశారు.

డొనేట్​ లైఫ్​ సంస్థ ఆధ్వర్యంలో విజయవంతంగా బిపిన్​ గుండెను శరీరం నుంచి వేరు చేశారు కిరన్​ ఆసుపత్రి వైద్యులు. గ్రీన్​ కారిడార్​ సాయంతో గుండెను అహ్మదాబాద్​కు తరలించారు.

ఇదీ చదవండి:'జాతకం చూసి మేము 350 సీట్లు గెలుస్తామని చెప్పాడు'

Last Updated : Mar 16, 2020, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.