జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భాజపా నాయకులే లక్ష్యంగా వరుస దాడులకు తెగబడుతున్నారు. బుద్గామ్ జిల్లా మోహియింద్పురలో అబ్దుల్ హమిద్ నజర్పై ఆదివారం ఉదయం కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన నజర్ను ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అబ్దుల్ హమిద్ నజర్ బుద్గామ్ భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆగస్టు 6న.. భాజపాకు చెందిన సర్పంచ్ సాజద్ అహ్మద్ ఖాండేను కాల్చిచంపారు ఉగ్రవాదులు. ఆగస్టు 4న కూడా ఓ భాజపా నేతపై దాడికి తెగబడ్డారు. అంతకుముందు జులైలోనూ ఓ భాజపా నాయకుడి తండ్రి, సోదరుడిని ఉగ్రవాదుల దాడి చేసి చంపేశారు.
ఇదీ చూడండి:ఎన్కౌంటర్: వాంటెడ్ గ్యాంగ్స్టర్ రాకేశ్ పాండే హతం