రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై భాజపా ఎమ్మెల్యే లాలన్ కుమార్ పాసవాన్ కేసు నమోదు పెట్టారు. బిహార్ అసెంబ్లీ స్పీకరు ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుగా ఓటు వేయకూదని లాలూ కోరినట్లు ఆరోపించారు పాసవాన్. అలా చేస్తే మంత్రి పదవి ఇస్తానని లాలూ అన్నట్లు తెలిపారు పాసవాన్.
ఇందుకు సంబంధించిన ఓ ఆడియో టేప్ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు భాజపా నేత సుశీల్ మోదీ. ఈ టేప్ ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద నిగ్రాని పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు పాసవాన్.
ఫోన్ వాడారన్న ఆరోపణల నేపథ్యంలో ఝార్ఖండ్ రాంచీ రిమ్స్ డైరెక్టర్ బంగ్లా నుంచి లాలూను ఆసుపత్రిలోని పేయింగ్ వార్డుకు తరలించారు అధికారులు.
ఇదీ చూడండి: బిహార్లో లాలూ ఆడియో టేపుల కలకలం