ETV Bharat / bharat

'మహా' పోరు: భాజపా 4వ జాబితాలో సీనియర్లకు నిరాశ

author img

By

Published : Oct 4, 2019, 12:57 PM IST

Updated : Oct 4, 2019, 3:05 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజైన నేడు... ఏడుగురు అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితా విడుదల చేసింది భాజపా. ఇందులో మంత్రులు వినోద్​ తావడే, చంద్రశేఖర్​ సహా సీనియర్లు ఏక్​నాథ్​ ఖడ్సే, ప్రకాశ్​ మెహ్తా, రాజ్​ పురోహిత్​కు చోటు దక్కలేదు. చాలా చోట్ల కొత్త వాళ్లకు అవకాశం కల్పించింది. అక్టోబర్​ 21న హరియాణాతో పాటు మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

'మహా' పోరు: భాజపా 4వ జాబితాలో సీనియర్లకు నిరాశ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సీనియర్లకు దక్కని టిక్కెట్లు

మహారాష్ట్రలో రసవత్తర రాజకీయ పోరుకు పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. నామినేషన్లకు చివరిరోజైన ఇవాళ.. అధికార భాజపా ఏడుగురు అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను విడుదల చేసింది. పార్టీ సీనియర్​ నేత ఏక్​నాథ్​ ఖడ్సే, కేబినెట్​ మంత్రి వినోద్​ తావడేలకు నిరాశే ఎదురైంది.

ఏక్​నాథ్​ ఖాడ్సే బదులుగా ఆయన కుమార్తె రోహిణీకి ఉత్తర మహారాష్ట్రలోని ముక్తాయీ​నగర్​ టికెట్​ ఇచ్చింది కమలదళం. 1991 నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏక్​నాథ్.

విద్యుత్​శాఖ మంత్రి చంద్రశేఖర్​ బావన్​కులే సహా ఇతర సీనియర్​ నేతలు ప్రకాశ్​ మెహ్తా, రాజ్​ పురోహిత్​కూ ఈ జాబితాలో చోటు దక్కలేదు. విద్యాశాఖ మంత్రి తావడే బదులుగా బోరివలీ స్థానంలో ఈసారి సునీల్​ రాణేను బరిలోకి దింపింది.

దక్షిణ ముంబయిలోని కోలాబా సిట్టింగ్​ ఎమ్మెల్యే పురోహిత్​ కంటే.. మహారాష్ట్ర శాసన మండలి​ ఛైర్మన్​ రామ్రాజే నింబాల్కర్​ అల్లుడు రాహుల్​ నవ్రేకర్​వైపే మొగ్గుచూపింది అధిష్ఠానం. మాజీ ఎన్సీపీ ఎమ్మెల్సీ నవ్రేకర్​ ఇటీవలే భాజపాలో చేరి తాజాగా టికెట్​ దక్కించుకోవడం విశేషం.

అవినీతి ఆరోపణలే కారణం...

మహారాష్ట్ర భాజపాలోని సీనియర్​ నాయకులలో అత్యంత రాజకీయ అనుభవమున్న ఖడ్సేపై అవినీతి ఆరోపణలతో ఆయనను పక్కనబెట్టింది పార్టీ. 2016లో మంత్రి పదవి నుంచి తప్పించింది. మరోసారి టికెట్​ ఇవ్వమని పార్టీ ఇదివరకే స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ఈ వారమే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్​ దాఖలు చేశారు.

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఇప్పటివరకు భాజపా 150 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. శివసేన 100 మందికిపైగా ఏబీ నామినేషన్​ ఫారాలు అందించింది.
అయితే... నేడు నామినేషన్​ చివరిరోజుకాగా ఈ కూటమి సీట్ల పంపకంపై ఇంకా స్పష్టత లేదు. అక్టోబర్​ 5న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్​ 7న చివరితేదీ. అక్టోబర్​ 21న ఎన్నికలు నిర్వహించి, 24న ఫలితాలు ప్రకటించనున్నారు.

ఇదీ చూడండి: 'మహా'సంగ్రామం: భాజపా జైత్రయాత్ర కొనసాగేనా..?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సీనియర్లకు దక్కని టిక్కెట్లు

మహారాష్ట్రలో రసవత్తర రాజకీయ పోరుకు పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. నామినేషన్లకు చివరిరోజైన ఇవాళ.. అధికార భాజపా ఏడుగురు అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను విడుదల చేసింది. పార్టీ సీనియర్​ నేత ఏక్​నాథ్​ ఖడ్సే, కేబినెట్​ మంత్రి వినోద్​ తావడేలకు నిరాశే ఎదురైంది.

ఏక్​నాథ్​ ఖాడ్సే బదులుగా ఆయన కుమార్తె రోహిణీకి ఉత్తర మహారాష్ట్రలోని ముక్తాయీ​నగర్​ టికెట్​ ఇచ్చింది కమలదళం. 1991 నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏక్​నాథ్.

విద్యుత్​శాఖ మంత్రి చంద్రశేఖర్​ బావన్​కులే సహా ఇతర సీనియర్​ నేతలు ప్రకాశ్​ మెహ్తా, రాజ్​ పురోహిత్​కూ ఈ జాబితాలో చోటు దక్కలేదు. విద్యాశాఖ మంత్రి తావడే బదులుగా బోరివలీ స్థానంలో ఈసారి సునీల్​ రాణేను బరిలోకి దింపింది.

దక్షిణ ముంబయిలోని కోలాబా సిట్టింగ్​ ఎమ్మెల్యే పురోహిత్​ కంటే.. మహారాష్ట్ర శాసన మండలి​ ఛైర్మన్​ రామ్రాజే నింబాల్కర్​ అల్లుడు రాహుల్​ నవ్రేకర్​వైపే మొగ్గుచూపింది అధిష్ఠానం. మాజీ ఎన్సీపీ ఎమ్మెల్సీ నవ్రేకర్​ ఇటీవలే భాజపాలో చేరి తాజాగా టికెట్​ దక్కించుకోవడం విశేషం.

అవినీతి ఆరోపణలే కారణం...

మహారాష్ట్ర భాజపాలోని సీనియర్​ నాయకులలో అత్యంత రాజకీయ అనుభవమున్న ఖడ్సేపై అవినీతి ఆరోపణలతో ఆయనను పక్కనబెట్టింది పార్టీ. 2016లో మంత్రి పదవి నుంచి తప్పించింది. మరోసారి టికెట్​ ఇవ్వమని పార్టీ ఇదివరకే స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ఈ వారమే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్​ దాఖలు చేశారు.

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఇప్పటివరకు భాజపా 150 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. శివసేన 100 మందికిపైగా ఏబీ నామినేషన్​ ఫారాలు అందించింది.
అయితే... నేడు నామినేషన్​ చివరిరోజుకాగా ఈ కూటమి సీట్ల పంపకంపై ఇంకా స్పష్టత లేదు. అక్టోబర్​ 5న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్​ 7న చివరితేదీ. అక్టోబర్​ 21న ఎన్నికలు నిర్వహించి, 24న ఫలితాలు ప్రకటించనున్నారు.

ఇదీ చూడండి: 'మహా'సంగ్రామం: భాజపా జైత్రయాత్ర కొనసాగేనా..?

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 4 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0558: US CA Vegas Shooting Reax AP Clients Only 4233131
MGM Resorts to pay $800M to Vegas shooting victims
AP-APTN-0555: Hong Kong Masks Protest AP Clients Only 4233139
HKG protesters rally against possible mask ban
AP-APTN-0529: Portugal Election Preview AP Clients Only 4233133
Elections mark Portugal as political curiosity
AP-APTN-0517: Peru Fujimorismo AP Clients Only 4233132
Peru’s political dynasty struggles as congress shut
AP-APTN-0435: Australia Whale No access Australia 4233130
Rescuers free whale tangled in shark nets
AP-APTN-0430: Peru Demo AP Clients Only 4233129
Thousands of Vizcarra supporters protest in Lima
AP-APTN-0418: US OR Tracking Priests PART: Credit Deschutes County District Attorney / PART: Credit Redmond Police / PART: Credit Oregon State Penitentiary 4233128
ONLY ON AP No oversight on 100s of accused priests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 4, 2019, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.