చట్టసభల్లో అధికార విపక్షపార్టీ సభ్యుల వాదోపవాదనలు సహజమే. ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు, అభివృద్ధి కార్యక్రమాల్లోని లోటుపాట్లను ప్రతిపక్ష సభ్యులు ఎండగడుతుంటారు. అయితే రాజస్థాన్ విధానసభలో చోటు చేసుకున్న ఓ సంఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. అదేంటంటే.. బికనీర్ భాజపా ఎమ్మెల్యే బిహారీలాల్ ఓ బుట్ట నిండా మిడతలు తీసుకొని సభకు వచ్చారు. ఫలితంగా సభ మొత్తం ఒక్కసారిగా అతనివైపే తిరిగి చూసింది. మిడతల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని బిహారీలాల్ డిమాండ్ చేశారు.
" రాష్ట్రంలో మిడతల బెడద ఎక్కువగా ఉంది. వీటివల్ల రైతులు ఎంతగానో నష్టపోతున్నారని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఫలితం లేదు. అందుకే చేసేందుకే ఇలా చేశాను. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 జిల్లాల్లో రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తీవ్రమైన సమస్యపై దృష్టి సారించకుండా సీఏఏ చట్టం వ్యతిరేకించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది."
- బిహారీలాల్, బికనీర్ ఎమ్మెల్యే
ప్రస్తుత్తం రాజస్థాన్లో అశోక్ గెహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏని వ్యతిరేకిస్తూ.. గత కొంతకాలంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. బిహారీలాల్ లేవనెత్తిన సమస్యపై ఆ రాష్ట్ర అధికారులు స్పందించారు. ఇప్పటికే ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, దాదాపు 3.70 లక్షల హెక్టార్ల పరిధిలో నివారణ చర్యలు కొనసాగుతున్నాయని వివరణ ఇచ్చారు.
ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్: వైద్యుల పరిశీలనలో చైనా యాత్రికులు