ETV Bharat / bharat

డిగ్రీ పాసైతే రూ. 50 వేలు-సీఎం ఆఫర్​!

author img

By

Published : Oct 15, 2020, 6:21 AM IST

బిహార్​లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం నితీశ్ కుమార్​ ఆకర్షణీయమైన హామీలను ప్రకటించారు. ఇంటర్​ పాసైన బాలికలకు రూ.25 వేలు.. డిగ్రీ ఉత్తీర్ణులైన యువతులకు రూ.50 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Bihar polls
బిహార్​

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆకర్షణీయమైన హామీలను ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత, సంక్షేమంతో పాటు బిహార్​ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మహిళలను ఆకట్టుకునే హామీలను ప్రకటించారు.

జేడీయూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నితీశ్ కుమార్ మాట్లాడుతూ,. బాలికలు విద్యావంతులు కావాలని ఆకాక్షించారు. బాలికలను ప్రోత్సహించేందుకు ఓ పథకాన్ని అమలు చేస్తామని, ఇంటర్ ఉత్తీర్ణులైన బాలికలకు రూ.25 వేలు.. డిగ్రీ పాసైన వారికి రూ.50 వేలు చొప్పున అందజేస్తామని చెప్పారు.

పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో 50 శాతం పదవులను, 35 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను మహిళలకు కేటాయిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: భాజపా అభ్యర్థుల లెక్కలు తేలాయ్​..

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆకర్షణీయమైన హామీలను ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత, సంక్షేమంతో పాటు బిహార్​ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మహిళలను ఆకట్టుకునే హామీలను ప్రకటించారు.

జేడీయూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నితీశ్ కుమార్ మాట్లాడుతూ,. బాలికలు విద్యావంతులు కావాలని ఆకాక్షించారు. బాలికలను ప్రోత్సహించేందుకు ఓ పథకాన్ని అమలు చేస్తామని, ఇంటర్ ఉత్తీర్ణులైన బాలికలకు రూ.25 వేలు.. డిగ్రీ పాసైన వారికి రూ.50 వేలు చొప్పున అందజేస్తామని చెప్పారు.

పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో 50 శాతం పదవులను, 35 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను మహిళలకు కేటాయిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: భాజపా అభ్యర్థుల లెక్కలు తేలాయ్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.