ETV Bharat / bharat

వెనక్కి తగ్గిన నేపాల్.. క్యాంప్, వాచ్​ టవర్ తొలగింపు

author img

By

Published : Jun 27, 2020, 5:40 PM IST

బిహార్​లోని పంతోక గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంప్​ సహా వాచ్​ టవర్​ను నేపాల్ తొలగించింది. భారత భూభాగంలోకి చొరబడిన నేపాలీ దళాలను ఉపసంహరించుకుంది. భారత సైన్యంతో జరిపిన చర్చల ఫలితంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Bihar: Nepal removes temporary camp, watch tower after military talks
వెనక్కి తగ్గిన నేపాల్: క్యాంప్, వాచ్​ టవర్ తొలగింపు

వరుసగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. సరిహద్దుకు సమీపంలో మిలిటరీ క్యాంప్ ఏర్పాటు చేసిన నేపాల్ తాజాగా వెనక్కి తగ్గింది. బిహార్​లోని పంతోక గ్రామంలో నిర్మించిన క్యాంప్ సహా వాచ్​ టవర్​ను తొలగించింది. నేపాల్ సైన్యంతో సశస్త్ర సీమా బల్(ఎస్​ఎస్​బీ) జరిపిన చర్చల ఫలితంగా పొరుగుదేశం ఈ మేరకు చర్యలు తీసుకుంది.

అంతకుముందు భారత భూభాగంలోకి చొరబడిన నేపాలీ దళాలు సైతం... సైనిక, దౌత్యపరమైన చర్యల తర్వాత వెనక్కి తగ్గాయి. సరిహద్దు వెంబడి శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా బలగాలను ఉపసంహరించుకుంది నేపాల్.

వెనక్కి తగ్గిన నేపాల్: క్యాంప్, వాచ్​ టవర్ తొలగింపు

వాచ్​ టవర్ వివాదం

సరిసవా నదికి అవతల భారత భూభాగంలో వాచ్​ టవర్ నిర్మించడం ఇరుదేశాల మధ్య వివాదానికి దారితీసింది. చైనా ఆదేశాలతోనే సరిహద్దులో పర్యవేక్షణ పెంచడానికి ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.

సరివాసా నదికి దగ్గర్లోని భారత్​కు చెందిన భూభాగంపై నేపాల్ తమదని వాదిస్తోందని అధికారులు పేర్కొన్నారు. నేపాల్​లో ప్రవహించే నది చివరకు సుగౌలి వద్ద బుధి గండక్ నదిలో కలుస్తుందని తెలిపారు. మరోవైపు... స్వీయ రక్షణ పెంపొందించుకోవడానికి పిథౌర్​గఢ్​​లోని దర్చులా నుంచి కాలాపానీ వరకు నేపాల్ అదనపు బలగాలను మోహరిస్తోందని అధికారులు తెలిపారు.

దుస్సాహసాలు

భారత్​లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను నేపాల్​లో అంతర్భాగంగా పేర్కొంటూ ఆ దేశం చేసిన వాదనతో ఇరుపక్షాల మధ్య వివాదం మొదలైంది. ఈ ప్రాంతాలను తమ భూభాగంలో చూపుతూ రాజకీయ మ్యాప్​ రూపొందించింది. దీంతో పాటు సరిహద్దులో అనవసర ఉద్రిక్తతలు రాజేస్తోంది. బిహార్ ప్రభుత్వం చేపట్టిన వరద నియంత్రణ కార్యక్రమాలకు అడ్డుతగులుతోంది.

ఇవీ చదవండి

వరుసగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. సరిహద్దుకు సమీపంలో మిలిటరీ క్యాంప్ ఏర్పాటు చేసిన నేపాల్ తాజాగా వెనక్కి తగ్గింది. బిహార్​లోని పంతోక గ్రామంలో నిర్మించిన క్యాంప్ సహా వాచ్​ టవర్​ను తొలగించింది. నేపాల్ సైన్యంతో సశస్త్ర సీమా బల్(ఎస్​ఎస్​బీ) జరిపిన చర్చల ఫలితంగా పొరుగుదేశం ఈ మేరకు చర్యలు తీసుకుంది.

అంతకుముందు భారత భూభాగంలోకి చొరబడిన నేపాలీ దళాలు సైతం... సైనిక, దౌత్యపరమైన చర్యల తర్వాత వెనక్కి తగ్గాయి. సరిహద్దు వెంబడి శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా బలగాలను ఉపసంహరించుకుంది నేపాల్.

వెనక్కి తగ్గిన నేపాల్: క్యాంప్, వాచ్​ టవర్ తొలగింపు

వాచ్​ టవర్ వివాదం

సరిసవా నదికి అవతల భారత భూభాగంలో వాచ్​ టవర్ నిర్మించడం ఇరుదేశాల మధ్య వివాదానికి దారితీసింది. చైనా ఆదేశాలతోనే సరిహద్దులో పర్యవేక్షణ పెంచడానికి ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.

సరివాసా నదికి దగ్గర్లోని భారత్​కు చెందిన భూభాగంపై నేపాల్ తమదని వాదిస్తోందని అధికారులు పేర్కొన్నారు. నేపాల్​లో ప్రవహించే నది చివరకు సుగౌలి వద్ద బుధి గండక్ నదిలో కలుస్తుందని తెలిపారు. మరోవైపు... స్వీయ రక్షణ పెంపొందించుకోవడానికి పిథౌర్​గఢ్​​లోని దర్చులా నుంచి కాలాపానీ వరకు నేపాల్ అదనపు బలగాలను మోహరిస్తోందని అధికారులు తెలిపారు.

దుస్సాహసాలు

భారత్​లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను నేపాల్​లో అంతర్భాగంగా పేర్కొంటూ ఆ దేశం చేసిన వాదనతో ఇరుపక్షాల మధ్య వివాదం మొదలైంది. ఈ ప్రాంతాలను తమ భూభాగంలో చూపుతూ రాజకీయ మ్యాప్​ రూపొందించింది. దీంతో పాటు సరిహద్దులో అనవసర ఉద్రిక్తతలు రాజేస్తోంది. బిహార్ ప్రభుత్వం చేపట్టిన వరద నియంత్రణ కార్యక్రమాలకు అడ్డుతగులుతోంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.