ETV Bharat / bharat

బిహార్​ బరి: బడా నేతలు, భారీ ప్రచారాలు మిస్!

author img

By

Published : Oct 14, 2020, 7:46 AM IST

రసవత్తరంగా సాగే బిహార్​ ఎన్నికలు.. భారీ ప్రచారాలకు, బడా నేతల హవాకు వేదికగా నిలుస్తాయి. హోరాహోరీగా సాగే పోరాటంలో... పార్టీలు ప్రచార జోరుతో ఆకట్టుకుంటాయి. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో వేడి పుట్టిస్తారు నేతలు. కానీ ఇప్పుడవేవీ బిహార్​ ఎన్నికల్లో కానరావట్లేదు. కరోనా సంక్షోభంలో జరుగుతున్న ఎన్నికల్లో.. ప్రచారం పరిమితంగా సాగుతోంది. లాలూ, రాంవిలాస్​ పాసవాన్​ లాంటి నేతలను, పదునైన వాగ్బాణాలు ప్రజలు చూడలేకపోతున్నారు.

voters to miss Lalu, Ram Vilas
బిహార్​ బరి: బడా నేతలు, భారీ ప్రచారాలు మిస్​ అవుతున్న ఓటర్లు

ఎల్​జేపీ అధినేత రాంవిలాస్​ పాసవాన్​ మరణించటం, దాణా కుంభకోణంలో జైలుపాలైన ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్ ఎన్నికలకు అందుబాటులో లేకపోటం వల్ల.. బిహార్​ ఓటర్లకు ఎన్నికల సందడి కనిపించటం లేదు. గతంలో ఈ నేతల ప్రచారాలకు, ముఖ్యంగా లాలూ సభలకు జనాలు విరగబడి హాజరయ్యేవారు.

కరోనా విలయంలోనే జరుగుతున్న ఎన్నికలు కావటం వల్ల ప్రచారం, సభలు, సమావేశాలు, ఓటింగ్ విధానం​ అన్నీ మారిపోయాయి. వర్చువల్​ వేదికల ద్వారానే ప్రచారం నిర్వహిస్తున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలో ప్రచార హోరు, రోడ్​షోలు, బహిరంగ సభలు, ర్యాలీలు, నేతల వాగ్బాణాలు, ఓపెన్ ఛాలెంజ్​లు, ఛలోక్తులు, ఫీట్లు, పాట్లను.. బిహారీ ఓటర్లు మిస్​ అవుతున్నారు.

అస్తమించిన నేతలు

రాంవిలాస్​ పాసవాన్​ బిహార్​ రాజకీయాల్లో దిగ్గజంగా ఉన్నారు. దశాబ్దాలుగా ఆయన ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, అనారోగ్యంతో ఆయన అక్టోబర్​ 8న తుదిశ్వాస విడిచి.. పార్టీని శోకసంద్రంలో ముంచారు.

Bihar Assembly polls
రాంవిలాస్​ పాసవాన్​

ఆర్​జేడీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​ సింగ్​ సైతం ఎన్నికలకు ముందే మరణించారు. లాలూకు సన్నిహితుడిగా ఉన్న ఆయన అనారోగ్యంతో సెప్టెంబర్​ 13 దిల్లీలోని ఎయిమ్స్​లో కన్నుమూశారు.

Bihar Assembly polls
కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​ సింగ్​

కొవిడ్​ నిబంధనలు

కొవిడ్ నిబంధనల వలన పార్టీల ప్రచారాలు కూడా డీలాపడ్డాయి. అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు... ప్రచారంలో అంత దూకుడుగా వ్యవహరించటం లేదు. చిన్నపార్టీలు గల్లీలకే పరిమితమవుతున్నాయి.

లాలూ లేని లోటు

లాలూ ప్రసాద్​ ఆర్​జేడీకి స్టార్​ క్యాంపెయినర్​గా ఉండేవారు. ప్రతి ఎన్నికల్లో ప్రచార బాధ్యత తన భుజలపైనే మోసేవారు. ప్రజాకర్షక నేతగా.. బిహార్​లో ఆయనకున్న ఛరిష్మా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్​ మాజీ ముఖ్యమంత్రి.. అనారోగ్యంతో రాంచీలోని రాజేంద్ర ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. న్యాయస్థానం అనుమతి లేకుండా ఆయన ప్రచారం చేయలేని పరిస్థితి.

Bihar Assembly polls
లాలూ లేని లోటు

ఆర్​జేడీ అవస్థలు

లాలూ అందుబాటులో లేకపోవటం ఆర్​జేడీకి ఇబ్బందేననే మాట వినిపిస్తోంది. సొంత పార్టీలో సైతం లాలూ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.

లాలూ ప్రజాకర్షక నేత. ఆయన ప్రచారాల్లో జనాలు భారీగా పోగయ్యేవారు. ఆయన మాటలు ఆసక్తిగా వినేవారు. తమ నేతగా ఆదరించేవారు.

-మృత్యుంజయ్​ తివారి, ఆర్​జేడీ నేత

ఇదీ చూడండి:'బిహార్ బరిలో లాలూ లేకపోవడం లోటే'

2015 ఎన్నికల్లో ఆర్​జేడీ తరఫున లాలూ 170, రఘువంశ్​ ప్రసాద్​ 100 ర్యాలీలు, రోడ్​షోలలో పాల్గొన్నారు. 2020 శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు సీనియర్​ నేతల సేవలు కోల్పోవటం పార్టీపై ప్రభవం చూపనుంది.

మరికొంత మంది..

వీరితోపాటే మరికొంత మంది నేతలు.. ఈ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండనున్నారు.

  • కేంద్ర మాజీ మంత్రి, లోక్​తాంత్రిక్​ జనతా దళ్ నేత శరద్​ యాదవ్​ అనారోగ్య కారణాల వల్ల డిజిటల్​ ప్రచారానికే పరిమితమవ్వనున్నారు.
  • జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ సింగ్​ వర్చువల్​ ర్యాలీల్లో మాత్రమే కనిపించనున్నారు. దీంతో అధికార పార్టీ ప్రాచార బాధ్యత మొత్తం నితీశ్​ కుమార్​పైనే పడింది.

ఇదీ చూడండి: ఐశ్వర్యా రాయ్​ భయంతో సీటు మార్చిన లాలూ తనయుడు!

ఇదీ చూడండి: బిహార్​ బరి: కాంగ్రెస్​పై మైనార్టీల గుస్సా- ఎందుకు ?

ఎల్​జేపీ అధినేత రాంవిలాస్​ పాసవాన్​ మరణించటం, దాణా కుంభకోణంలో జైలుపాలైన ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్ ఎన్నికలకు అందుబాటులో లేకపోటం వల్ల.. బిహార్​ ఓటర్లకు ఎన్నికల సందడి కనిపించటం లేదు. గతంలో ఈ నేతల ప్రచారాలకు, ముఖ్యంగా లాలూ సభలకు జనాలు విరగబడి హాజరయ్యేవారు.

కరోనా విలయంలోనే జరుగుతున్న ఎన్నికలు కావటం వల్ల ప్రచారం, సభలు, సమావేశాలు, ఓటింగ్ విధానం​ అన్నీ మారిపోయాయి. వర్చువల్​ వేదికల ద్వారానే ప్రచారం నిర్వహిస్తున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలో ప్రచార హోరు, రోడ్​షోలు, బహిరంగ సభలు, ర్యాలీలు, నేతల వాగ్బాణాలు, ఓపెన్ ఛాలెంజ్​లు, ఛలోక్తులు, ఫీట్లు, పాట్లను.. బిహారీ ఓటర్లు మిస్​ అవుతున్నారు.

అస్తమించిన నేతలు

రాంవిలాస్​ పాసవాన్​ బిహార్​ రాజకీయాల్లో దిగ్గజంగా ఉన్నారు. దశాబ్దాలుగా ఆయన ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, అనారోగ్యంతో ఆయన అక్టోబర్​ 8న తుదిశ్వాస విడిచి.. పార్టీని శోకసంద్రంలో ముంచారు.

Bihar Assembly polls
రాంవిలాస్​ పాసవాన్​

ఆర్​జేడీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​ సింగ్​ సైతం ఎన్నికలకు ముందే మరణించారు. లాలూకు సన్నిహితుడిగా ఉన్న ఆయన అనారోగ్యంతో సెప్టెంబర్​ 13 దిల్లీలోని ఎయిమ్స్​లో కన్నుమూశారు.

Bihar Assembly polls
కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​ సింగ్​

కొవిడ్​ నిబంధనలు

కొవిడ్ నిబంధనల వలన పార్టీల ప్రచారాలు కూడా డీలాపడ్డాయి. అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు... ప్రచారంలో అంత దూకుడుగా వ్యవహరించటం లేదు. చిన్నపార్టీలు గల్లీలకే పరిమితమవుతున్నాయి.

లాలూ లేని లోటు

లాలూ ప్రసాద్​ ఆర్​జేడీకి స్టార్​ క్యాంపెయినర్​గా ఉండేవారు. ప్రతి ఎన్నికల్లో ప్రచార బాధ్యత తన భుజలపైనే మోసేవారు. ప్రజాకర్షక నేతగా.. బిహార్​లో ఆయనకున్న ఛరిష్మా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్​ మాజీ ముఖ్యమంత్రి.. అనారోగ్యంతో రాంచీలోని రాజేంద్ర ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. న్యాయస్థానం అనుమతి లేకుండా ఆయన ప్రచారం చేయలేని పరిస్థితి.

Bihar Assembly polls
లాలూ లేని లోటు

ఆర్​జేడీ అవస్థలు

లాలూ అందుబాటులో లేకపోవటం ఆర్​జేడీకి ఇబ్బందేననే మాట వినిపిస్తోంది. సొంత పార్టీలో సైతం లాలూ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.

లాలూ ప్రజాకర్షక నేత. ఆయన ప్రచారాల్లో జనాలు భారీగా పోగయ్యేవారు. ఆయన మాటలు ఆసక్తిగా వినేవారు. తమ నేతగా ఆదరించేవారు.

-మృత్యుంజయ్​ తివారి, ఆర్​జేడీ నేత

ఇదీ చూడండి:'బిహార్ బరిలో లాలూ లేకపోవడం లోటే'

2015 ఎన్నికల్లో ఆర్​జేడీ తరఫున లాలూ 170, రఘువంశ్​ ప్రసాద్​ 100 ర్యాలీలు, రోడ్​షోలలో పాల్గొన్నారు. 2020 శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు సీనియర్​ నేతల సేవలు కోల్పోవటం పార్టీపై ప్రభవం చూపనుంది.

మరికొంత మంది..

వీరితోపాటే మరికొంత మంది నేతలు.. ఈ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండనున్నారు.

  • కేంద్ర మాజీ మంత్రి, లోక్​తాంత్రిక్​ జనతా దళ్ నేత శరద్​ యాదవ్​ అనారోగ్య కారణాల వల్ల డిజిటల్​ ప్రచారానికే పరిమితమవ్వనున్నారు.
  • జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ సింగ్​ వర్చువల్​ ర్యాలీల్లో మాత్రమే కనిపించనున్నారు. దీంతో అధికార పార్టీ ప్రాచార బాధ్యత మొత్తం నితీశ్​ కుమార్​పైనే పడింది.

ఇదీ చూడండి: ఐశ్వర్యా రాయ్​ భయంతో సీటు మార్చిన లాలూ తనయుడు!

ఇదీ చూడండి: బిహార్​ బరి: కాంగ్రెస్​పై మైనార్టీల గుస్సా- ఎందుకు ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.