ETV Bharat / bharat

ఆ పని చేసినందుకు 'అర్ణబ్'​ జైలు షిఫ్ట్​! - తలోజా జైలుకు 'అర్ణబ్'​ తరలింపు

ఓ ఇంటీరియర్​ డిజైనర్​ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే కారణంగా రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. ఆదివారం ఆయన్ను తలోజా కారాగారానికి తరలించారు. జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్న అర్ణబ్​.. మొబైల్​ ఫోన్​ వాడుతూ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా కనిపించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.

Arnab shifted to Taloja jail for using mobile phone in custody
తలోజా కారాగారానికి 'అర్ణబ్'​ తరలింపు.. కారణమదే?
author img

By

Published : Nov 8, 2020, 6:29 PM IST

Updated : Nov 8, 2020, 6:50 PM IST

రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామిని ఆదివారం మహారాష్ట్రలోని తలోజా జైలుకు తరలించారు పోలీసులు. ఓ ఇంటీరియర్​ డిజైనర్​ ఆత్మహత్య కేసులో నవంబర్​ 4న అర్ణబ్​ను అరెస్ట్​ చేసి.. రాయ్​గఢ్​లోని అలీబాగ్​ కరోనా క్వారంటైన్​ కేంద్రంలో ఉంచారు. జ్యుడిషీయల్​ కస్టడీలో ఉన్న అర్ణబ్.. అలీబాగ్​ జైల్లో మొబైల్​ ఫోన్​ వాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగానే తలోజా జైలుకు మార్చినట్టు అధికారులు వెల్లడించారు.

అర్ణబ్​ను అరెస్ట్​ చేసే సమయంలో ఆయన వ్యక్తిగత ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయినప్పటికీ జైల్లో ఉన్న ఇతరుల మొబైల్​ ఫోన్​ను వాడుతూ.. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉన్నట్టు గుర్తించారు.

ఇదీ చదవండి: అర్ణబ్ కోసం పాఠశాలను జైలుగా మార్పు!

వ్యాన్​ నుంచే కేకలు..

తలోజా జైలుకు తీసుకెళ్లే క్రమంలో వ్యాన్​ నుంచి గట్టిగట్టిగా అరిచారు అర్ణబ్​. అలీబాగ్​ జైలర్​.. శనివారం సాయంత్రం తనపై దాడి చేశారని ఆరోపించారు. తన జీవితం ప్రమాదంలో పడిందని, కనీసం లాయర్​తోనూ మాట్లాడటానికి అనుమతించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు అర్ణబ్​ దరఖాస్తు చేసుకున్న మధ్యంతర బెయిల్​పై.. ముంబయి హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది.

ఇవీ చదవండి:

భాజపాకు శివసేన 'ట్రంప్​' పంచ్​

అర్నబ్​ గోస్వామి అరెస్టుకు నిరసనగా భాజపా నాయకుల ఆందోళన

రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామిని ఆదివారం మహారాష్ట్రలోని తలోజా జైలుకు తరలించారు పోలీసులు. ఓ ఇంటీరియర్​ డిజైనర్​ ఆత్మహత్య కేసులో నవంబర్​ 4న అర్ణబ్​ను అరెస్ట్​ చేసి.. రాయ్​గఢ్​లోని అలీబాగ్​ కరోనా క్వారంటైన్​ కేంద్రంలో ఉంచారు. జ్యుడిషీయల్​ కస్టడీలో ఉన్న అర్ణబ్.. అలీబాగ్​ జైల్లో మొబైల్​ ఫోన్​ వాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగానే తలోజా జైలుకు మార్చినట్టు అధికారులు వెల్లడించారు.

అర్ణబ్​ను అరెస్ట్​ చేసే సమయంలో ఆయన వ్యక్తిగత ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయినప్పటికీ జైల్లో ఉన్న ఇతరుల మొబైల్​ ఫోన్​ను వాడుతూ.. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉన్నట్టు గుర్తించారు.

ఇదీ చదవండి: అర్ణబ్ కోసం పాఠశాలను జైలుగా మార్పు!

వ్యాన్​ నుంచే కేకలు..

తలోజా జైలుకు తీసుకెళ్లే క్రమంలో వ్యాన్​ నుంచి గట్టిగట్టిగా అరిచారు అర్ణబ్​. అలీబాగ్​ జైలర్​.. శనివారం సాయంత్రం తనపై దాడి చేశారని ఆరోపించారు. తన జీవితం ప్రమాదంలో పడిందని, కనీసం లాయర్​తోనూ మాట్లాడటానికి అనుమతించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు అర్ణబ్​ దరఖాస్తు చేసుకున్న మధ్యంతర బెయిల్​పై.. ముంబయి హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది.

ఇవీ చదవండి:

భాజపాకు శివసేన 'ట్రంప్​' పంచ్​

అర్నబ్​ గోస్వామి అరెస్టుకు నిరసనగా భాజపా నాయకుల ఆందోళన

Last Updated : Nov 8, 2020, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.