ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. సైనికాధికారి మృతి

జమ్ముకశ్మీర్​ అనంతనాగ్​లో భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఓ ఆర్మీ మేజర్​ ప్రాణాలు కోల్పాయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.

author img

By

Published : Jun 17, 2019, 5:12 PM IST

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. సైనికాధికారి మృతి
కశ్మీర్​లో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఆగడాలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా దక్షిణ కశ్మీర్​లోని అనంతనాగ్​లో సైనికాధికారులపై విరుచుకుపడ్డారు. అచ్చాబల్​ ప్రాంతంలో కాల్పులకు తెగించి ఓ ఆర్మీ మేజర్​ ప్రాణాలు బలిగొన్నారు. మరో మేజర్​తో పాటు ఇద్దరు జవాన్లు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారికి శ్రీనగర్​లోని 92బేస్​​ సైనిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అచ్చాబల్​​లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతాదళాలు ఉదయాన్నే తనిఖీలు చేపట్టాయి. ముష్కరులు ఒక్కసారిగా సైన్యంపై కాల్పులు జరిపినందున ఎన్​కౌంటర్​కు దారితీసింది.

కశ్మీర్​లో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఆగడాలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా దక్షిణ కశ్మీర్​లోని అనంతనాగ్​లో సైనికాధికారులపై విరుచుకుపడ్డారు. అచ్చాబల్​ ప్రాంతంలో కాల్పులకు తెగించి ఓ ఆర్మీ మేజర్​ ప్రాణాలు బలిగొన్నారు. మరో మేజర్​తో పాటు ఇద్దరు జవాన్లు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారికి శ్రీనగర్​లోని 92బేస్​​ సైనిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అచ్చాబల్​​లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతాదళాలు ఉదయాన్నే తనిఖీలు చేపట్టాయి. ముష్కరులు ఒక్కసారిగా సైన్యంపై కాల్పులు జరిపినందున ఎన్​కౌంటర్​కు దారితీసింది.

Intro:Body:

sdsd


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.