ETV Bharat / bharat

'చైనాతో సరిహద్దు అంశంపై మోదీ ప్రత్యక్ష పర్యవేక్షణ'

author img

By

Published : Jun 10, 2020, 5:27 AM IST

భారత్​- చైనా సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలపై కీలక సమాచారం బయటకు వచ్చింది. సరిహద్దుల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ, ప్రభుత్వానికి సమాచారమిచ్చామని భారత ఆర్మీ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. ప్రధాని, మంత్రుల బృందం సూచనల మేరకే చైనా సైన్యాధికారులతో చర్చల్లో భారత వాదనను వినిపించినట్లు చెప్పాయి.

indian army
'చైనాతో సరిహద్దు అంశంపై మోదీ ప్రత్యక్ష పర్యవేక్షణ'

భారత్​-చైనా సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ వ్యవహరించిన విధానంపై కీలక సమాచారం బయటకు వచ్చింది. సరిహద్దుల్లో పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సైన్యం ఎప్పటికప్పుడు సమాచారం అందించిందని తెలుస్తోంది. లద్దాక్​ వద్ద.. చైనా బలగాలను ​మోహరించిన అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారని భారత ఆర్మీ అధికారులు అనధికారికంగా వెల్లడించారు.

కేబినెట్ సహచరులతో చర్చలు..

మే 4న సరిహద్దు వెంట తమ బలగాలను చైనా మోహరించిన అనంతరం.. రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్, ఇతర సీనియర్ మంత్రులు, ఆర్మీ అధికారులతో ప్రధాని చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 'సరిహద్దు వద్ద పొరుగుదేశం జోక్యం ఎక్కువైంద'నే అంశమై మేథోమదనం జరిగిందని పేర్కొన్నాయి.

మెక్​మోహన్ రేఖ వెంట గల్వాన్ లోయవద్ద 14వ పాట్రోలింగ్ పాయింట్ సహా ఇతర ప్రాంతాలకు సమీపంలో చైనా బలగాల కార్యకలాపాల గురించి ప్రధానికి నివేదించినట్లు ఆర్మీ అధికారులు అనధికారికంగా వెల్లడించారు. 14 కోర్ ప్రధాన కేంద్రం నుంచి భారత సైన్యం.. చైనా కార్యకలాపాలను పర్యవేక్షించిందని.. నాటి నుంచే వారికి బదులు చెప్పేందుకు సిద్ధమయినట్లు తెలిపారు.

పూర్తి సన్నద్ధతతోనే..

లద్దాక్​లో సరిహద్దు వెంట సైన్యం సన్నద్ధంగా లేదని.. అందువల్లే చైనా బలగాలు మోహరించేందుకు అవకాశం ఏర్పడిందన్న వ్యాఖ్యలను తోసిపుచ్చారు ఆర్మీ అధికారులు. భారత సైన్యం లద్దాక్​ సరిహద్దు వెంట పూర్తి సన్నద్ధంగా ఉందని.. లేనట్లయితే ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు చైనాకు అవకాశం ఏర్పడి ఉండేదని చెప్పుకొచ్చారు.

సైన్యాధికారుల భేటీ అనంతరం వెనక్కి..

గల్వాన్ లోయలోని పాట్రోలింగ్ పాయింట్ 14, 114 బ్రిగేడ్​, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి.. జూన్ 6న జరిగిన లెఫ్టినెంట్ జనరల్​ స్థాయి అధికారుల సమావేశం అనంతరం ఇరుదేశాల బలగాలు వెనక్కి మళ్లాయని చెప్పారు. ఇరుదేశాల మేజర్ జనరల్​ల స్థాయిలో బుధవారం సంప్రదింపులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు సైనికాధికారులు.

ఇదీ చూడండి: వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు!

భారత్​-చైనా సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ వ్యవహరించిన విధానంపై కీలక సమాచారం బయటకు వచ్చింది. సరిహద్దుల్లో పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సైన్యం ఎప్పటికప్పుడు సమాచారం అందించిందని తెలుస్తోంది. లద్దాక్​ వద్ద.. చైనా బలగాలను ​మోహరించిన అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారని భారత ఆర్మీ అధికారులు అనధికారికంగా వెల్లడించారు.

కేబినెట్ సహచరులతో చర్చలు..

మే 4న సరిహద్దు వెంట తమ బలగాలను చైనా మోహరించిన అనంతరం.. రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్, ఇతర సీనియర్ మంత్రులు, ఆర్మీ అధికారులతో ప్రధాని చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 'సరిహద్దు వద్ద పొరుగుదేశం జోక్యం ఎక్కువైంద'నే అంశమై మేథోమదనం జరిగిందని పేర్కొన్నాయి.

మెక్​మోహన్ రేఖ వెంట గల్వాన్ లోయవద్ద 14వ పాట్రోలింగ్ పాయింట్ సహా ఇతర ప్రాంతాలకు సమీపంలో చైనా బలగాల కార్యకలాపాల గురించి ప్రధానికి నివేదించినట్లు ఆర్మీ అధికారులు అనధికారికంగా వెల్లడించారు. 14 కోర్ ప్రధాన కేంద్రం నుంచి భారత సైన్యం.. చైనా కార్యకలాపాలను పర్యవేక్షించిందని.. నాటి నుంచే వారికి బదులు చెప్పేందుకు సిద్ధమయినట్లు తెలిపారు.

పూర్తి సన్నద్ధతతోనే..

లద్దాక్​లో సరిహద్దు వెంట సైన్యం సన్నద్ధంగా లేదని.. అందువల్లే చైనా బలగాలు మోహరించేందుకు అవకాశం ఏర్పడిందన్న వ్యాఖ్యలను తోసిపుచ్చారు ఆర్మీ అధికారులు. భారత సైన్యం లద్దాక్​ సరిహద్దు వెంట పూర్తి సన్నద్ధంగా ఉందని.. లేనట్లయితే ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు చైనాకు అవకాశం ఏర్పడి ఉండేదని చెప్పుకొచ్చారు.

సైన్యాధికారుల భేటీ అనంతరం వెనక్కి..

గల్వాన్ లోయలోని పాట్రోలింగ్ పాయింట్ 14, 114 బ్రిగేడ్​, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి.. జూన్ 6న జరిగిన లెఫ్టినెంట్ జనరల్​ స్థాయి అధికారుల సమావేశం అనంతరం ఇరుదేశాల బలగాలు వెనక్కి మళ్లాయని చెప్పారు. ఇరుదేశాల మేజర్ జనరల్​ల స్థాయిలో బుధవారం సంప్రదింపులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు సైనికాధికారులు.

ఇదీ చూడండి: వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.