ETV Bharat / bharat

కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం!

author img

By

Published : Apr 12, 2020, 12:31 PM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో కొడుకు అంత్యక్రియల కోసం 2,000 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణం చేశారు ఓ సైనికాధికారి తల్లిదండ్రులు. గత కొంతకాలంగా క్యాన్సర్​తో పోరాడుతున్న కల్నల్​ నవ్​జోత్ సింగ్ బల్​.. బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు​.

parents undertake over 2,000 km journey
సైనికాధికారి అంత్యక్రియల కోసం తల్లిదండ్రుల 2,000కి.మీ ప్రయాణం

భారత సైన్యాధికారి నవజోత్​ సింగ్​ బల్​ క్యాన్సర్ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియల కోసం దిల్లీ నుంచి దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరుకు రోడ్డు ప్రయాణం ద్వార చేరుకున్నారు కుటుంబ సభ్యులు. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమలులో ఉన్నా పోలీసులు, సైన్యాధికారులు తమకు గొప్ప సహకారం అందించారని నవజోత్ సోదరుడు నవతేజ్​ సింగ్​ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రయాణం సాగుతున్న తీరును పలు సార్లు పోస్ట్​ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు గొప్పగా కృషి చేస్తున్నారని తెలిపారు.

పలువురి సంతాపం...

సైన్యంలో తన సేవలకు గాను శౌర్యచక్ర పురస్కారంతో పాటు, గాలెంట్రీ అవార్డును పొందిన కల్నల్ నవ్​జోత్ సింగ్​​​​ బల్​ మృతికి పౌరులు, సైనికులు సామాజిక మాధ్యమాల ద్వారా నివాళులు అర్పించారు. కన్నకొడుకు అంత్యక్రియల కోసం తల్లిదండ్రులు ఇన్ని కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయటం పట్ల మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్ విచారం వ్యక్తం చేశారు.

"కల్నల్​ నవ్​జోత్​​ మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతి. ఆయన తల్లిదండ్రులు సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోవటం విచారకరం. లాక్​డౌన్​ ఉన్నా... ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనలు మార్చుకోవచ్చు."

- మాజీ సైన్యాధిపతి వీ. పీ మాలిక్​ ట్వీట్.

సైన్యం సహాయం తిరస్కరణ..

నవ్​జోత్ సింగ్​ పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి దిల్లీకి ప్రత్యేక విమానంలో తరలిస్తామని సైనికాధికారులు తల్లిదండ్రులను కోరగా, వారు తిరస్కరించారు. బెంగళూరులోనే అంతిమ సంస్కరాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ పాస్​ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత

భారత సైన్యాధికారి నవజోత్​ సింగ్​ బల్​ క్యాన్సర్ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియల కోసం దిల్లీ నుంచి దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరుకు రోడ్డు ప్రయాణం ద్వార చేరుకున్నారు కుటుంబ సభ్యులు. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమలులో ఉన్నా పోలీసులు, సైన్యాధికారులు తమకు గొప్ప సహకారం అందించారని నవజోత్ సోదరుడు నవతేజ్​ సింగ్​ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రయాణం సాగుతున్న తీరును పలు సార్లు పోస్ట్​ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు గొప్పగా కృషి చేస్తున్నారని తెలిపారు.

పలువురి సంతాపం...

సైన్యంలో తన సేవలకు గాను శౌర్యచక్ర పురస్కారంతో పాటు, గాలెంట్రీ అవార్డును పొందిన కల్నల్ నవ్​జోత్ సింగ్​​​​ బల్​ మృతికి పౌరులు, సైనికులు సామాజిక మాధ్యమాల ద్వారా నివాళులు అర్పించారు. కన్నకొడుకు అంత్యక్రియల కోసం తల్లిదండ్రులు ఇన్ని కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయటం పట్ల మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్ విచారం వ్యక్తం చేశారు.

"కల్నల్​ నవ్​జోత్​​ మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతి. ఆయన తల్లిదండ్రులు సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోవటం విచారకరం. లాక్​డౌన్​ ఉన్నా... ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనలు మార్చుకోవచ్చు."

- మాజీ సైన్యాధిపతి వీ. పీ మాలిక్​ ట్వీట్.

సైన్యం సహాయం తిరస్కరణ..

నవ్​జోత్ సింగ్​ పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి దిల్లీకి ప్రత్యేక విమానంలో తరలిస్తామని సైనికాధికారులు తల్లిదండ్రులను కోరగా, వారు తిరస్కరించారు. బెంగళూరులోనే అంతిమ సంస్కరాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ పాస్​ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.