ETV Bharat / bharat

చైనా కుట్రలకు దీటుగా భారత్​ సరికొత్త వ్యూహాలు!

author img

By

Published : Sep 4, 2020, 7:07 AM IST

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లద్దాఖ్​ సరిహద్దులో భారత సైన్యం వ్యూహాత్మకంగా కదులుతోంది. పాంగాంగ్ దక్షిణ ప్రాంతాన్ని​ ఆక్రమణకు చైనా ప్రయత్నించటంతో ఇప్పటివరకు లద్దాఖ్​ ప్రాంతంలో సరిహద్దు నిర్వహణ చేపట్టే భారత సైన్యం.. సరిహద్దు రక్షణకు పూనుకుంది. కొన్నిచోట్ల బలగాల స్థానాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది. చైనా ఎలాంటి దుస్సాహసానికి దిగినా సరిహద్దును కాపాడుకునేలా పటిష్ఠంగా వ్యూహాన్ని సిద్ధం చేసింది.

India-China
భారత్‌, చైనా

తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనాల మధ్య తాజా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్‌ సరస్సు వద్ద సెగలు రగులుతూనే ఉన్నాయి. గత నెల 29 అర్ధరాత్రి ఈ సరస్సు దక్షిణ తీరాన్ని చేజిక్కించుకునేందుకు డ్రాగన్‌ విఫలయత్నం చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో మన సైన్యం తన వ్యూహాన్ని సమూలంగా మార్చేసింది.

లద్దాఖ్‌లోని 1597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ‘సరిహద్దు నిర్వహణ’ మాత్రమే చేపట్టే భారత్‌.. ఇప్పుడు ‘సరిహద్దు రక్షణ’కు పూనుకుంది. ఇందుకు అనుగుణంగా సైన్యంలోని వివిధ విభాగాలతో మిశ్రమ దళాలను అక్కడ మోహరించింది. కొన్నిచోట్ల బలగాల స్థానాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది. చైనా ఎలాంటి దుస్సాహసానికి దిగినా సరిహద్దును కాపాడుకునేలా పటిష్ఠంగా వ్యూహాన్ని సిద్ధం చేసింది. చైనా దూకుడు చర్యలను పరిగణనలోకి తీసుకొని, ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని ప్రదేశాలనూ కాపాడుకునేలా దీన్ని రూపొందించామని సైనికాధికారులు తెలిపారు.

డ్రాగన్​ కన్నా ఎత్తులో మన బలగాలు..

చైనా ఎత్తును చిత్తు చేసేందుకు పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవు భాగంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన స్వాధీనంలోకి తెచ్చుకున్న భారత్‌.. అదే పట్టును కొనసాగిస్తోంది. ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్‌-4 పర్వతాలు చైనా కబ్జాలో ఉన్నాయి. అయితే ఆ ఫింగర్‌ ప్రాంతంలోనూ ఇతర పర్వత శిఖరాలను ఆకస్మికంగా తన అధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డ్రాగన్‌పై భారత్‌ ఒత్తిడి పెంచింది. తద్వారా భవిష్యత్‌లో చర్చలు జరిపేటప్పుడు భారత్‌కు అనుకూల పరిస్థితి ఉంటుందని సైనిక వర్గాలు తెలిపాయి. ఫింగర్‌-4 ప్రాంతంలో తిష్టవేసిన డ్రాగన్‌ అక్కడి నుంచి వైదొలగడానికి నిరాకరిస్తోంది.

సరికొత్త వ్యూహం

తూర్పు లద్దాఖ్‌లోకి చైనా ఇబ్బడిముబ్బడిగా బలగాలను తరలిస్తున్న నేపథ్యంలో భారత్‌ దీటుగా స్పందిస్తోంది. 1962లో చైనాతో యుద్ధం తర్వాత ఆ దేశ జోరును కట్టడి చేయడానికి ప్రత్యేకంగా సిద్ధంచేసిన ‘స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌’ సహా అనేక విభాగాలను రంగంలోకి దించింది. దెప్సాంగ్‌ మైదాన ప్రాంతాల్లో చైనా యాంత్రిక పదాతిదళ బ్రిగేడ్‌ను మోహరించిన నేపథ్యంలో మన దేశం సాయుధ ట్యాంకు దళం, యాంత్రిక పదాతి దళాలతో కూడిన పటిష్ఠ పోరాట విభాగాన్ని రంగంలోకి దించింది.

చుమార్‌ ప్రాంతంలోనూ ఇలాంటి దళాన్ని భారత్‌ మోహరించింది. తద్వారా సరిహద్దులను పటిష్ఠంగా రక్షించుకునేందుకు సిద్ధమన్న సంకేతాన్ని డ్రాగన్‌కు ఇచ్చింది. ఇప్పుడు దెమ్‌చోక్‌, చుమార్‌ ప్రాంతంలో భారత్‌దే పైచేయిగా ఉంది. చైనాకు చెందిన లాసా-కష్గర్‌ హైవేపై ఆ దేశం సాగిస్తున్న సైనిక తరలింపులను ఎత్తయిన ప్రాంతాల నుంచి స్పష్టంగా మన సైనికులు చూడగలుగుతున్నారు.

సైన్యాధిపతి పర్యటన

తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె రెండు రోజుల పర్యటన కోసం లద్దాఖ్‌ చేరుకున్నారు. సరిహద్దు శిబిరాన్ని సందర్శించి బలగాలతో ముచ్చటించారు.

క్షేత్రస్థాయిలోని పరిస్థితులను సైనిక కమాండర్లు ఆయనకు వివరించారు. వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌.భదౌరియా తూర్పు విభాగంలోని పలు కీలక వైమానిక స్థావరాలను బుధవారం సందర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలలోని ఎల్‌ఏసీ వెంబడి వాయుసేన పోరాట సన్నద్ధతపై సమీక్ష జరిపారు. మన వాయు సేన ఇప్పటికే తనవద్ద ఉన్న సుఖోయ్‌-30 ఎంకేఐ, జాగ్వార్‌, మిరాజ్‌-2000 తదితర అగ్రశ్రేణి యుద్ధవిమానాలు, అపాచీ, చినూక్‌ వంటి హెలికాప్టర్లను మోహరించింది.

ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ అప్రమత్తం

భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీసు దళం, సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ)లను అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇప్పటికే ఎస్‌ఎస్‌బీ దళాలను అరుణాచల్‌ ప్రదేశ్‌, భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లోకి తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సిక్కింలో భారత్‌, చైనా, టిబెట్‌ సరిహద్దులు కలిసే ‘ట్రై జంక్షన్‌’ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు వివరించాయి.

యాప్‌లపై నిర్ణయాన్ని పునఃసమీక్షించండి: చైనా

తమ దేశానికి చెందిన 118 యాప్‌లను నిషేధించాలన్న భారత నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలను ఉల్లంఘిస్తోందని చైనా పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల అటు భారత వినియోగదారులకు కానీ ఇటు చైనా వ్యాపార సంస్థలకు కానీ ఉపయోగం లేదని తెలిపింది. డేటా గోప్యత, జాతీయ భద్రత కారణాలరీత్యా చైనా మూలాలున్న పబ్‌జీ సహా 118 యాప్‌లను భారత్‌ బుధవారం నిషేధించిందిం. దీనిపై చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్‌ గురువారం స్పందించారు.

‘జాతీయ భద్రత’ అంశాన్ని భారత్‌ దుర్వినియోగం చేస్తూ చైనా కంపెనీలపై వివక్షతో కూడిన నియంత్రణ చర్యలకు దిగుతోందని విమర్శించారు. తద్వారా డబ్ల్యూటీవో నిబంధనలను ఉల్లంఘిస్తోందన్నారు. ఈ ‘తప్పుడు విధానాల’ను సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌-చైనాల ఆర్థిక, వాణిజ్య సహకారం పరస్పర ప్రయోజనకరమని చెప్పారు. రెండు దేశాలు ఎంతో శ్రమకోర్చి సాధించిన సహకారాన్ని, అభివృద్ధి వాతావరణాన్ని ఉమ్మడిగా కొనసాగించాలని కోరారు.

ఐదో రోజూ చర్చలు..

సరిహద్దు వివాద పరిష్కారానికి ఐదో రోజైన గురువారమూ భారత్‌, చైనా సైనికాధికారుల మధ్య చుషుల్‌లో చర్చలు కొనసాగాయి. అయితే అసాధారణంగా ఈసారి చర్చలు ఆరుబయట జరగడం గమనార్హం.

మనకు ఆ సత్తా ఉంది: రావత్‌

చైనా దురుసు చర్యలకు దీటుగా స్పందించే సత్తా భారత సైనిక దళాలకు ఉందని త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టంచేశారు. భారత్‌ నేడు సంక్లిష్టమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. పూర్తిస్థాయి అణు యుద్ధం నుంచి సంప్రదాయేతర పోరు వరకూ అనేక సవాళ్లు పొంచి ఉన్నాయని తెలిపారు. వాటిని ఎదుర్కొనేందుకు భారత సైనికదళాలు సన్నద్ధంగా ఉన్నాయన్నారు.

చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని అవకాశంగా తీసుకొని ఏదైనా దుస్సాహసానికి పాకిస్థాన్‌ పాల్పడితే ‘భారీ నష్టాల’ను చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించేందుకు భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన ప్రతిపాదిత ‘చతుర్భుజ’ కూటమి ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: హైఅలర్ట్​: ఐటీబీపీకి హోంశాఖ కీలక ఆదేశాలు!

తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనాల మధ్య తాజా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్‌ సరస్సు వద్ద సెగలు రగులుతూనే ఉన్నాయి. గత నెల 29 అర్ధరాత్రి ఈ సరస్సు దక్షిణ తీరాన్ని చేజిక్కించుకునేందుకు డ్రాగన్‌ విఫలయత్నం చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో మన సైన్యం తన వ్యూహాన్ని సమూలంగా మార్చేసింది.

లద్దాఖ్‌లోని 1597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ‘సరిహద్దు నిర్వహణ’ మాత్రమే చేపట్టే భారత్‌.. ఇప్పుడు ‘సరిహద్దు రక్షణ’కు పూనుకుంది. ఇందుకు అనుగుణంగా సైన్యంలోని వివిధ విభాగాలతో మిశ్రమ దళాలను అక్కడ మోహరించింది. కొన్నిచోట్ల బలగాల స్థానాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది. చైనా ఎలాంటి దుస్సాహసానికి దిగినా సరిహద్దును కాపాడుకునేలా పటిష్ఠంగా వ్యూహాన్ని సిద్ధం చేసింది. చైనా దూకుడు చర్యలను పరిగణనలోకి తీసుకొని, ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని ప్రదేశాలనూ కాపాడుకునేలా దీన్ని రూపొందించామని సైనికాధికారులు తెలిపారు.

డ్రాగన్​ కన్నా ఎత్తులో మన బలగాలు..

చైనా ఎత్తును చిత్తు చేసేందుకు పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవు భాగంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన స్వాధీనంలోకి తెచ్చుకున్న భారత్‌.. అదే పట్టును కొనసాగిస్తోంది. ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్‌-4 పర్వతాలు చైనా కబ్జాలో ఉన్నాయి. అయితే ఆ ఫింగర్‌ ప్రాంతంలోనూ ఇతర పర్వత శిఖరాలను ఆకస్మికంగా తన అధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డ్రాగన్‌పై భారత్‌ ఒత్తిడి పెంచింది. తద్వారా భవిష్యత్‌లో చర్చలు జరిపేటప్పుడు భారత్‌కు అనుకూల పరిస్థితి ఉంటుందని సైనిక వర్గాలు తెలిపాయి. ఫింగర్‌-4 ప్రాంతంలో తిష్టవేసిన డ్రాగన్‌ అక్కడి నుంచి వైదొలగడానికి నిరాకరిస్తోంది.

సరికొత్త వ్యూహం

తూర్పు లద్దాఖ్‌లోకి చైనా ఇబ్బడిముబ్బడిగా బలగాలను తరలిస్తున్న నేపథ్యంలో భారత్‌ దీటుగా స్పందిస్తోంది. 1962లో చైనాతో యుద్ధం తర్వాత ఆ దేశ జోరును కట్టడి చేయడానికి ప్రత్యేకంగా సిద్ధంచేసిన ‘స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌’ సహా అనేక విభాగాలను రంగంలోకి దించింది. దెప్సాంగ్‌ మైదాన ప్రాంతాల్లో చైనా యాంత్రిక పదాతిదళ బ్రిగేడ్‌ను మోహరించిన నేపథ్యంలో మన దేశం సాయుధ ట్యాంకు దళం, యాంత్రిక పదాతి దళాలతో కూడిన పటిష్ఠ పోరాట విభాగాన్ని రంగంలోకి దించింది.

చుమార్‌ ప్రాంతంలోనూ ఇలాంటి దళాన్ని భారత్‌ మోహరించింది. తద్వారా సరిహద్దులను పటిష్ఠంగా రక్షించుకునేందుకు సిద్ధమన్న సంకేతాన్ని డ్రాగన్‌కు ఇచ్చింది. ఇప్పుడు దెమ్‌చోక్‌, చుమార్‌ ప్రాంతంలో భారత్‌దే పైచేయిగా ఉంది. చైనాకు చెందిన లాసా-కష్గర్‌ హైవేపై ఆ దేశం సాగిస్తున్న సైనిక తరలింపులను ఎత్తయిన ప్రాంతాల నుంచి స్పష్టంగా మన సైనికులు చూడగలుగుతున్నారు.

సైన్యాధిపతి పర్యటన

తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె రెండు రోజుల పర్యటన కోసం లద్దాఖ్‌ చేరుకున్నారు. సరిహద్దు శిబిరాన్ని సందర్శించి బలగాలతో ముచ్చటించారు.

క్షేత్రస్థాయిలోని పరిస్థితులను సైనిక కమాండర్లు ఆయనకు వివరించారు. వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌.భదౌరియా తూర్పు విభాగంలోని పలు కీలక వైమానిక స్థావరాలను బుధవారం సందర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలలోని ఎల్‌ఏసీ వెంబడి వాయుసేన పోరాట సన్నద్ధతపై సమీక్ష జరిపారు. మన వాయు సేన ఇప్పటికే తనవద్ద ఉన్న సుఖోయ్‌-30 ఎంకేఐ, జాగ్వార్‌, మిరాజ్‌-2000 తదితర అగ్రశ్రేణి యుద్ధవిమానాలు, అపాచీ, చినూక్‌ వంటి హెలికాప్టర్లను మోహరించింది.

ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ అప్రమత్తం

భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీసు దళం, సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ)లను అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇప్పటికే ఎస్‌ఎస్‌బీ దళాలను అరుణాచల్‌ ప్రదేశ్‌, భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లోకి తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సిక్కింలో భారత్‌, చైనా, టిబెట్‌ సరిహద్దులు కలిసే ‘ట్రై జంక్షన్‌’ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు వివరించాయి.

యాప్‌లపై నిర్ణయాన్ని పునఃసమీక్షించండి: చైనా

తమ దేశానికి చెందిన 118 యాప్‌లను నిషేధించాలన్న భారత నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలను ఉల్లంఘిస్తోందని చైనా పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల అటు భారత వినియోగదారులకు కానీ ఇటు చైనా వ్యాపార సంస్థలకు కానీ ఉపయోగం లేదని తెలిపింది. డేటా గోప్యత, జాతీయ భద్రత కారణాలరీత్యా చైనా మూలాలున్న పబ్‌జీ సహా 118 యాప్‌లను భారత్‌ బుధవారం నిషేధించిందిం. దీనిపై చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్‌ గురువారం స్పందించారు.

‘జాతీయ భద్రత’ అంశాన్ని భారత్‌ దుర్వినియోగం చేస్తూ చైనా కంపెనీలపై వివక్షతో కూడిన నియంత్రణ చర్యలకు దిగుతోందని విమర్శించారు. తద్వారా డబ్ల్యూటీవో నిబంధనలను ఉల్లంఘిస్తోందన్నారు. ఈ ‘తప్పుడు విధానాల’ను సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌-చైనాల ఆర్థిక, వాణిజ్య సహకారం పరస్పర ప్రయోజనకరమని చెప్పారు. రెండు దేశాలు ఎంతో శ్రమకోర్చి సాధించిన సహకారాన్ని, అభివృద్ధి వాతావరణాన్ని ఉమ్మడిగా కొనసాగించాలని కోరారు.

ఐదో రోజూ చర్చలు..

సరిహద్దు వివాద పరిష్కారానికి ఐదో రోజైన గురువారమూ భారత్‌, చైనా సైనికాధికారుల మధ్య చుషుల్‌లో చర్చలు కొనసాగాయి. అయితే అసాధారణంగా ఈసారి చర్చలు ఆరుబయట జరగడం గమనార్హం.

మనకు ఆ సత్తా ఉంది: రావత్‌

చైనా దురుసు చర్యలకు దీటుగా స్పందించే సత్తా భారత సైనిక దళాలకు ఉందని త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టంచేశారు. భారత్‌ నేడు సంక్లిష్టమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. పూర్తిస్థాయి అణు యుద్ధం నుంచి సంప్రదాయేతర పోరు వరకూ అనేక సవాళ్లు పొంచి ఉన్నాయని తెలిపారు. వాటిని ఎదుర్కొనేందుకు భారత సైనికదళాలు సన్నద్ధంగా ఉన్నాయన్నారు.

చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని అవకాశంగా తీసుకొని ఏదైనా దుస్సాహసానికి పాకిస్థాన్‌ పాల్పడితే ‘భారీ నష్టాల’ను చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించేందుకు భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన ప్రతిపాదిత ‘చతుర్భుజ’ కూటమి ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: హైఅలర్ట్​: ఐటీబీపీకి హోంశాఖ కీలక ఆదేశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.