ETV Bharat / bharat

ఎస్పీ ప్రచారకర్తల జాబితాలో ములాయం గల్లంతు!

2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది సమాజ్​వాదీ పార్టీ. ఇందుకోసం ప్రధాన ప్రచారకర్తల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ములాయాం సింగ్​ యాదవ్​ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.

author img

By

Published : Mar 24, 2019, 2:33 PM IST

Updated : Mar 24, 2019, 5:02 PM IST

ములాయంతో అఖిలేశ్
తండ్రిని పక్కన పెట్టిన తనయుడు
సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి సమాజ్​వాదీ పార్టీ సిద్ధమైంది. లోక్​సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 40 మంది ప్రధాన ప్రచారకర్తలను ఎంపిక చేసింది. కానీ ఈ జాబితాలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్​కు చోటు కల్పించకుండా పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

శనివారం ప్రచారకర్తల జాబితాను పార్టీ సీనియర్ నేత రామ్​గోపాల్ యాదవ్​ విడుదల చేశారు. ఇందులో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​, నాయకులు ఆజాం ఖాన్​, డింపుల్ యాదవ్, జయా బచ్చన్ తదితరులు ఉన్నారు.

ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ ఆజాంఘడ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఎస్పీకి కలిసొచ్చిన మెయిన్​పురి స్థానం నుంచి ములాయం బరిలో ఉన్నారు. ఇదే స్థానం నుంచి ఇప్పటికే నాలుగు సార్లు గెలిచారు ములాయం.

బీఎస్పీతో పొత్తుతో ఉత్తరప్రదేశ్​లో 80 స్థానాలకు 37 చోట్ల ఎస్పీ పోటీ చేయనుంది. రాష్ట్రంలో ఏప్రిల్​ 11న మొదలయ్యే ఎన్నికలు మే 19 వరకు కొనసాగుతాయి.

ఇదీ చూడండి:యూపీలో భాజపా 'రాజకీయ ఇంజినీరింగ్​'

తండ్రిని పక్కన పెట్టిన తనయుడు
సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి సమాజ్​వాదీ పార్టీ సిద్ధమైంది. లోక్​సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 40 మంది ప్రధాన ప్రచారకర్తలను ఎంపిక చేసింది. కానీ ఈ జాబితాలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్​కు చోటు కల్పించకుండా పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

శనివారం ప్రచారకర్తల జాబితాను పార్టీ సీనియర్ నేత రామ్​గోపాల్ యాదవ్​ విడుదల చేశారు. ఇందులో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​, నాయకులు ఆజాం ఖాన్​, డింపుల్ యాదవ్, జయా బచ్చన్ తదితరులు ఉన్నారు.

ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ ఆజాంఘడ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఎస్పీకి కలిసొచ్చిన మెయిన్​పురి స్థానం నుంచి ములాయం బరిలో ఉన్నారు. ఇదే స్థానం నుంచి ఇప్పటికే నాలుగు సార్లు గెలిచారు ములాయం.

బీఎస్పీతో పొత్తుతో ఉత్తరప్రదేశ్​లో 80 స్థానాలకు 37 చోట్ల ఎస్పీ పోటీ చేయనుంది. రాష్ట్రంలో ఏప్రిల్​ 11న మొదలయ్యే ఎన్నికలు మే 19 వరకు కొనసాగుతాయి.

ఇదీ చూడండి:యూపీలో భాజపా 'రాజకీయ ఇంజినీరింగ్​'

New Delhi, Mar 23 (ANI): While speaking to ANI, Communist Party of India (Marxist) CPI (M) General Secretary Sitaram Yechury said, "It's very unfortunate that the major left party has been left out of this arrangement, left has traditionally very important political presence in state. Now when the fight is such an important fight to exclude the left is very unfortunate we will therefore fight the seat declared earlier that we shall fight that is Ujiarpur and Samastipur. Kanhaiya Kumar should be fielded by CPI from Begusarai."
Last Updated : Mar 24, 2019, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.