ETV Bharat / bharat

విమాన ప్రయాణాల్లో కరోనాపై కొత్త నిబంధన

author img

By

Published : Jul 13, 2020, 7:26 AM IST

విమాన ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ పలు వెసులుబాట్లు కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంది. ప్రయాణ తేదీకి మూడు వారాల వ్యవధిలో తమకు వైరస్ పాజిటివ్​ రాలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేస్తే విమానంలోకి ప్రవేశించేందుకు వీలు కల్పించనుంది. కరోనా నుంచి కోలుకున్న వారికి ఈ అవకాశం కల్పించనుంది.

aero
విమాన ప్రయాణాల్లో కరోనాపై కొత్త నిబంధన

విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కాస్త వెసులుబాటు కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రయాణ తేదీకి ముందు మూడు వారాల వ్యవధిలో తమకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రాలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేస్తే చాలు.. వారిని విమానం ఎక్కడానికి అనుమతిస్తారు.

కరోనా బారినపడి కోలుకున్నవారికీ ఈ వెసులుబాటు ఉంటుంది. వారు కొవిడ్‌కు చికిత్స తీసుకున్నట్లు ఆసుపత్రి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. ఈమేరకు విమాన సంస్థలకు మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో ప్రయాణ తేదీకి ముందు రెండు నెలల వ్యవధిలో కరోనా పాజిటివ్‌ రాలేదని ప్రయాణికులు స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉండేది.

విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కాస్త వెసులుబాటు కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రయాణ తేదీకి ముందు మూడు వారాల వ్యవధిలో తమకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రాలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేస్తే చాలు.. వారిని విమానం ఎక్కడానికి అనుమతిస్తారు.

కరోనా బారినపడి కోలుకున్నవారికీ ఈ వెసులుబాటు ఉంటుంది. వారు కొవిడ్‌కు చికిత్స తీసుకున్నట్లు ఆసుపత్రి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. ఈమేరకు విమాన సంస్థలకు మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో ప్రయాణ తేదీకి ముందు రెండు నెలల వ్యవధిలో కరోనా పాజిటివ్‌ రాలేదని ప్రయాణికులు స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉండేది.

ఇదీ చూడండి: భారత సైన్యానికి 72 వేల అత్యాధునిక తుపాకులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.