ETV Bharat / bharat

మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రశాంత్​ భూషణ్​

author img

By

Published : Sep 12, 2020, 10:57 PM IST

న్యాయవ్యవస్థకు ప్రతికూలంగా ట్వీట్​ చేసిన కేసులో శిక్షపడిన న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటికే ఆయనకు ఒక్క రూపాయి జరిమానాను విధించిన సుప్రీం ధర్మాసనం.. ఆ సొమ్మును ఈ నెల 15లోగా రిజిస్ట్రీలో జమచేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్​.. సుప్రీంను ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advocate Prashant Bhushan again approached Supreme Court who was convicted in contempt court case
మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రశాంత్​ భూషణ్​

న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్​ చేసిన కేసులో శిక్షపడిన సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ కేసు తీర్పును సవాల్​ చేస్తూ దాఖలుచేసే అప్పీల్​ను మరో బెంచ్​ లేదా విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టేందుకు అనుమతించాలని కోరారు.

ఈ కేసులో విధించిన రూపాయి జరిమానాను ఈనెల 15లోపు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని అత్యున్నత న్యాయస్థానం గత నెల 31న ఆదేశించింది. లేదంటే 3 నెలల జైలుశిక్ష, మూడేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్​పై నిషేధం విధించనున్నట్టు పేర్కొంది. కామినీ జైస్వాల్ ద్వారా కొత్త పిటిషన్​ దాఖలు చేసిన ప్రశాంత్​ భూషణ్.. నేరపూరిత ధిక్కారానికి పాల్పడిన వ్యక్తి అదే కోర్టులో చేసుకునే అప్పీల్​ను విస్తృత, మరో బెంచ్ ద్వారా విచారించటానికి అనుమతించాలన్నారు.

అప్పీల్​ చేసుకునే ప్రాథమిక హక్కు రాజ్యాంగం, అంతర్జాతీయ చట్టం కల్పించాయన్న పిటిషనర్.. తప్పుడు తీర్పుల నుంచి రక్షణ, సత్యానికి రక్షణగా నిలుస్తుందన్నారు. పిటిషన్​లో న్యాయ మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్​ను ప్రతివాదులుగా పేర్కొన్న పిటిషనర్.. నేరపూరిత ధిక్కరణ కేసులకు సంబంధించి అదే కోర్టుల్లో అప్పీల్​ చేసుకోవటానికి నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నేరపూరిత ధిక్కరణ కేసులో దోషిగా ఖరారైన వ్యక్తి కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ వేసే రివ్యూ పిటిషన్అర్హతను పిటిషనర్​ను సంప్రదించకుండా బెంచ్​ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఇదీ చదవండి: అసలెవరీ ప్రశాంత్‌ భూషణ్​? ఆయన ఏమన్నారు?

న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్​ చేసిన కేసులో శిక్షపడిన సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ కేసు తీర్పును సవాల్​ చేస్తూ దాఖలుచేసే అప్పీల్​ను మరో బెంచ్​ లేదా విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టేందుకు అనుమతించాలని కోరారు.

ఈ కేసులో విధించిన రూపాయి జరిమానాను ఈనెల 15లోపు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని అత్యున్నత న్యాయస్థానం గత నెల 31న ఆదేశించింది. లేదంటే 3 నెలల జైలుశిక్ష, మూడేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్​పై నిషేధం విధించనున్నట్టు పేర్కొంది. కామినీ జైస్వాల్ ద్వారా కొత్త పిటిషన్​ దాఖలు చేసిన ప్రశాంత్​ భూషణ్.. నేరపూరిత ధిక్కారానికి పాల్పడిన వ్యక్తి అదే కోర్టులో చేసుకునే అప్పీల్​ను విస్తృత, మరో బెంచ్ ద్వారా విచారించటానికి అనుమతించాలన్నారు.

అప్పీల్​ చేసుకునే ప్రాథమిక హక్కు రాజ్యాంగం, అంతర్జాతీయ చట్టం కల్పించాయన్న పిటిషనర్.. తప్పుడు తీర్పుల నుంచి రక్షణ, సత్యానికి రక్షణగా నిలుస్తుందన్నారు. పిటిషన్​లో న్యాయ మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్​ను ప్రతివాదులుగా పేర్కొన్న పిటిషనర్.. నేరపూరిత ధిక్కరణ కేసులకు సంబంధించి అదే కోర్టుల్లో అప్పీల్​ చేసుకోవటానికి నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నేరపూరిత ధిక్కరణ కేసులో దోషిగా ఖరారైన వ్యక్తి కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ వేసే రివ్యూ పిటిషన్అర్హతను పిటిషనర్​ను సంప్రదించకుండా బెంచ్​ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఇదీ చదవండి: అసలెవరీ ప్రశాంత్‌ భూషణ్​? ఆయన ఏమన్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.