ETV Bharat / bharat

భారత్​లో క్లినికల్​​ ట్రయల్స్​కు 9 ఆస్పత్రులకు అనుమతి - WHO's 'Solidarity Trial' to find an effective treatment for the novel coronavirus disease

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 విజృంభిస్తోంది. దీనికి సమర్థవంతమైన చికిత్స కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆధ్వర్యంలో 'సాలిడారిటీ ట్రయల్‌' జరుగుతోంది. ఇందులో చేరడానికి భారత్​ నుంచి 9 ఆస్పత్రులకు ఆమోదం తెలిపింది ఐసీఎంఆర్​. ఇవన్నీ వైరస్​ నియంత్రణకు సరైన చికిత్స అందించడం, వ్యాక్సిన్ కనుక్కొవడమే లక్ష్యంగా పని చేయనున్నాయి.

9 hospitals approved to join WHO's Solidarity Trial to find treatment for COVID-19
డబ్ల్యూహెచ్​ఓ సాలిడరీటి ట్రయల్​లో చేరడానికి 9 ఆస్పత్రులు సిద్ధం
author img

By

Published : May 14, 2020, 2:21 PM IST

Updated : May 14, 2020, 3:46 PM IST

కరోనాకు సమర్థవంతమైన చికిత్సా విధానం కనుగొనే లక్ష్యంతో పనిచేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ). ఇందుకోసం వేర్వేరు పరిశోధనశాలలు, ఆస్పత్రులను ఏకతాటిపైకి తెచ్చి 'సాలిడారిటీ ట్రయల్' నిర్వహిస్తోంది. ఇందులో చేరడానికి భారత్​ నుంచి తొమ్మిది ఆస్పత్రులకు ఆమోదం తెలిపింది భారతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్)​.

కొవిడ్‌-19కు చికిత్సలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఈ ఆసుపత్రులు ర్యాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ ఔషధ పరీక్షలు నిర్వహించనున్నాయి.

ఆ ఆస్పత్రులు ఇవే!

రెమ్​డెసివిర్, లోపెనావిర్, రిటోనావిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఇంటర్ఫెరాన్ బీటా-లా లోపినావీర్​​, రిటోనావీర్​ ఔషధాలను క్లినికల్ ట్రయల్స్​లో పరీక్షించనున్నారు. ఈ ఔషధ పరీక్షల నిర్వహణకు.. జోధ్‌పుర్‌లోని ఎయిమ్స్, చెన్నైలోని అపోలో ఆసుపత్రి​, అహ్మదాబాద్‌కు చెందిన బీజే మెడికల్​ కళాశాల, పౌర ఆసుపత్రి, భోపాల్‌లోని చిరాయు మెడికల్​ కళాశాల, తదితర సంస్థలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది ఐసీఎంఆర్​.

అవి తెలుసుకోవడమే లక్ష్యం..

ఔషధ పరీక్షలకు రోగుల స్పందన ఎలా ఉంది? వ్యాధిపై అవి ఎంత ప్రభావం చూపిస్తున్నాయి? అని తెలుసుకోవడం లక్ష్యమని సాలిడారిటీ ట్రయల్​ బృందం తెలిపింది.

"ట్రయల్స్​కు అవసరమైన అనుమతులు ఇప్పటికే ప్రభుత్వం నుంచి లభించాయి. దేశంలో కొవిడ్​​-19 రోగులను ఎంచుకుని, ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాం. దేశవ్యాప్తంగా కనీసం 20 నుంచి 30 ఔషధ పరీక్షా కేంద్రాలను నెలకొల్పాలనేది ప్రణాళిక."

-డాక్టర్​ షీలా గాడ్‌బోల్, జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థలో అంటువ్యాధులు విభాగం అధిపతి

కనీసం 1500 నమూనాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున 'సాలిడారిటీ ట్రయల్' కు జాతీయ సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు షీలా. 'క్లినికల్​ ట్రయల్​ రోగుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నాం. తొలుత ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి కనీసం 1500ల నమూనాలు సేకరిస్తాం' అని షీలా అన్నారు.

ఇదీ చూడండి: కరోనా సహజంగా రాలేదు.. ల్యాబ్​లోనే తయారైంది: గడ్కరీ

కరోనాకు సమర్థవంతమైన చికిత్సా విధానం కనుగొనే లక్ష్యంతో పనిచేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ). ఇందుకోసం వేర్వేరు పరిశోధనశాలలు, ఆస్పత్రులను ఏకతాటిపైకి తెచ్చి 'సాలిడారిటీ ట్రయల్' నిర్వహిస్తోంది. ఇందులో చేరడానికి భారత్​ నుంచి తొమ్మిది ఆస్పత్రులకు ఆమోదం తెలిపింది భారతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్)​.

కొవిడ్‌-19కు చికిత్సలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఈ ఆసుపత్రులు ర్యాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ ఔషధ పరీక్షలు నిర్వహించనున్నాయి.

ఆ ఆస్పత్రులు ఇవే!

రెమ్​డెసివిర్, లోపెనావిర్, రిటోనావిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఇంటర్ఫెరాన్ బీటా-లా లోపినావీర్​​, రిటోనావీర్​ ఔషధాలను క్లినికల్ ట్రయల్స్​లో పరీక్షించనున్నారు. ఈ ఔషధ పరీక్షల నిర్వహణకు.. జోధ్‌పుర్‌లోని ఎయిమ్స్, చెన్నైలోని అపోలో ఆసుపత్రి​, అహ్మదాబాద్‌కు చెందిన బీజే మెడికల్​ కళాశాల, పౌర ఆసుపత్రి, భోపాల్‌లోని చిరాయు మెడికల్​ కళాశాల, తదితర సంస్థలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది ఐసీఎంఆర్​.

అవి తెలుసుకోవడమే లక్ష్యం..

ఔషధ పరీక్షలకు రోగుల స్పందన ఎలా ఉంది? వ్యాధిపై అవి ఎంత ప్రభావం చూపిస్తున్నాయి? అని తెలుసుకోవడం లక్ష్యమని సాలిడారిటీ ట్రయల్​ బృందం తెలిపింది.

"ట్రయల్స్​కు అవసరమైన అనుమతులు ఇప్పటికే ప్రభుత్వం నుంచి లభించాయి. దేశంలో కొవిడ్​​-19 రోగులను ఎంచుకుని, ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాం. దేశవ్యాప్తంగా కనీసం 20 నుంచి 30 ఔషధ పరీక్షా కేంద్రాలను నెలకొల్పాలనేది ప్రణాళిక."

-డాక్టర్​ షీలా గాడ్‌బోల్, జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థలో అంటువ్యాధులు విభాగం అధిపతి

కనీసం 1500 నమూనాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున 'సాలిడారిటీ ట్రయల్' కు జాతీయ సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు షీలా. 'క్లినికల్​ ట్రయల్​ రోగుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నాం. తొలుత ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి కనీసం 1500ల నమూనాలు సేకరిస్తాం' అని షీలా అన్నారు.

ఇదీ చూడండి: కరోనా సహజంగా రాలేదు.. ల్యాబ్​లోనే తయారైంది: గడ్కరీ

Last Updated : May 14, 2020, 3:46 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.