ETV Bharat / bharat

దేవీ నిమజ్జనంలో అపశ్రుతి- ఐదుగురు మృతి

author img

By

Published : Oct 27, 2020, 5:39 AM IST

Updated : Oct 27, 2020, 7:40 AM IST

దుర్గా దేవీ విగ్రహ నిమజ్జనం చేస్తుండగా రెండు నాటు పడవలు నీటిలో మునిగిపోయాయి. బంగాల్​లో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. రెండు పడవల్లో మొత్తం 20 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

5-killed-as-boat-capsizes-in-west-bengals-murshidabad
దేవీ నిమజ్జనంలో అపశ్రుతి- ఐదుగురు మృతి

పశ్చిమ్ బంగలో దుర్గా దేవీ విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. విగ్రహాన్ని తీసుకెళ్తున్న రెండు నాటు పడవలు నీటిలో మునిగిపోయాయి. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ముర్షిదాబాద్​ జిల్లా బెల్దంగలో ఈ ఘటన జరిగింది.

దేవీ నిమజ్జనంలో అపశ్రుతి

ఐదుగురి మృతదేహాలను నీటిలో నుంచి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. రెండు పడవల్లో 20 మంది ప్రయాణించినట్లు చెప్పారు.

మరిన్ని మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. విపత్త నిర్వహణ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

పశ్చిమ్ బంగలో దుర్గా దేవీ విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. విగ్రహాన్ని తీసుకెళ్తున్న రెండు నాటు పడవలు నీటిలో మునిగిపోయాయి. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ముర్షిదాబాద్​ జిల్లా బెల్దంగలో ఈ ఘటన జరిగింది.

దేవీ నిమజ్జనంలో అపశ్రుతి

ఐదుగురి మృతదేహాలను నీటిలో నుంచి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. రెండు పడవల్లో 20 మంది ప్రయాణించినట్లు చెప్పారు.

మరిన్ని మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. విపత్త నిర్వహణ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

Last Updated : Oct 27, 2020, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.