ETV Bharat / bharat

తన సీట్లో కూర్చున్నాడని తోటి విద్యార్థిపై కాల్పులు - ఉత్తర్​ప్రదేశ్​లో విద్యార్థిపై కాల్పులు

తరగతి గదిలో తన సీట్లో కూర్చున్నాడన్న కోపంతో 14 ఏళ్ల విద్యార్థి తన తోటి విద్యార్థిని కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​షహర్ జిల్లాలో జరిగింది.

14-year-old fatally shoots classmate after dispute over seats in UP school
తన సీట్లో కూర్చున్నాడని తోటి విద్యార్థిపై కాల్పులు..
author img

By

Published : Dec 31, 2020, 5:26 PM IST

తరగతి గదిలో సీట్ల కోసం జరిగిన వివాదం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరొక వ్యక్తిని కటకటాలపాలు చేసింది. ఉత్తర్​ ప్రదేశ్​ బులంద్​షహర్ జిల్లా శిఖర్​పుర్​లో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..

తరగతి గదిలో తన సీట్లో కూర్చున్నాడని తోటి విద్యార్థిపై కోపం పెంచుకున్నాడు ఓ పదో తరగతి విద్యార్థి. దీంతో తన అంకుల్​ దగ్గర ఉన్న లైసెన్సుడు​ తుపాకీ తీసుకొచ్చి క్లాస్​లోనే సదరు విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో విద్యార్థి మరణించాడు. వెంటనే అప్రమత్తమైన ప్రిన్సిపల్​... పారిపోయేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులకు పట్టించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ సూపరింటెండ్​ పోలీస్ అధికారి సంతోష్​ కుమార్​ సింగ్​ తెలిపారు.

ఇదీ చదవండి: పట్టపగలే కాల్చివేత.. పరువు హత్యలేనా?

తరగతి గదిలో సీట్ల కోసం జరిగిన వివాదం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరొక వ్యక్తిని కటకటాలపాలు చేసింది. ఉత్తర్​ ప్రదేశ్​ బులంద్​షహర్ జిల్లా శిఖర్​పుర్​లో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..

తరగతి గదిలో తన సీట్లో కూర్చున్నాడని తోటి విద్యార్థిపై కోపం పెంచుకున్నాడు ఓ పదో తరగతి విద్యార్థి. దీంతో తన అంకుల్​ దగ్గర ఉన్న లైసెన్సుడు​ తుపాకీ తీసుకొచ్చి క్లాస్​లోనే సదరు విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో విద్యార్థి మరణించాడు. వెంటనే అప్రమత్తమైన ప్రిన్సిపల్​... పారిపోయేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులకు పట్టించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ సూపరింటెండ్​ పోలీస్ అధికారి సంతోష్​ కుమార్​ సింగ్​ తెలిపారు.

ఇదీ చదవండి: పట్టపగలే కాల్చివేత.. పరువు హత్యలేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.