ETV Bharat / bharat

'జోధ్​పుర్​ ఐఐటీ'పై కొవిడ్​ పంజా

జోధ్​పుర్​ ఐఐటీలో కరోనా విజృంభిస్తోంది. సుమారు 70 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. అయితే.. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం లేదని, బాధితులకు చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు.

author img

By

Published : Apr 5, 2021, 10:23 AM IST

Around 70 students test positive for COVID-19 at Rajasthan's IIT-Jodhpur
జోధ్​పుర్​ ఐఐటీపై కొవిడ్​ పంజా

రాజస్థాన్​లోని జోధ్​పుర్​ ఐఐటీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా మొత్తం 65-70 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వారిలో 60 మందికి కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్టు అధికారులు తెలిపారు.

అయితే.. చండీగఢ్​, గుజరాత్​, జైపుర్​లోని గిరిజన ప్రాంతాల వారి వల్లే వైరస్​ వ్యాప్తి చెందిందని డిప్యూటీ చీఫ్​ మెడికల్​ హెల్త్​ ఆఫీసర్​ పి.సింగ్​ అన్నారు.

"మార్చి 11న వైరస్​ సోకిన(గిరిజన ప్రాంతాల) వారు కొందరు ఇక్కడకు వచ్చారు. వారి నుంచే​ కరోనా విస్తరించింది. బాధితుల్లో విద్యార్థులే అధికంగా ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు. క్యాంపస్​లోని జీ3 బ్లాక్​ను కంటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించాం."

- పి.సింగ్​, డిప్యూటీ చీఫ్​ మెడికల్​ హెల్త్​ ఆఫీసర్​, జోధ్​పుర్​

జోధ్​పుర్​లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నందున పోలీసులు, వైద్యాధికారులు అప్రమత్తమయ్యారని సింగ్​ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు​ తప్పనిసరి చేశామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కొవిడ్ పంజా: దేశంలో ఒక్కరోజే లక్షకుపైగా కేసులు

రాజస్థాన్​లోని జోధ్​పుర్​ ఐఐటీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా మొత్తం 65-70 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వారిలో 60 మందికి కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్టు అధికారులు తెలిపారు.

అయితే.. చండీగఢ్​, గుజరాత్​, జైపుర్​లోని గిరిజన ప్రాంతాల వారి వల్లే వైరస్​ వ్యాప్తి చెందిందని డిప్యూటీ చీఫ్​ మెడికల్​ హెల్త్​ ఆఫీసర్​ పి.సింగ్​ అన్నారు.

"మార్చి 11న వైరస్​ సోకిన(గిరిజన ప్రాంతాల) వారు కొందరు ఇక్కడకు వచ్చారు. వారి నుంచే​ కరోనా విస్తరించింది. బాధితుల్లో విద్యార్థులే అధికంగా ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు. క్యాంపస్​లోని జీ3 బ్లాక్​ను కంటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించాం."

- పి.సింగ్​, డిప్యూటీ చీఫ్​ మెడికల్​ హెల్త్​ ఆఫీసర్​, జోధ్​పుర్​

జోధ్​పుర్​లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నందున పోలీసులు, వైద్యాధికారులు అప్రమత్తమయ్యారని సింగ్​ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు​ తప్పనిసరి చేశామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కొవిడ్ పంజా: దేశంలో ఒక్కరోజే లక్షకుపైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.