ETV Bharat / bharat

నిజమైన రైతులు దిల్లీని వీడాలి: అమరీందర్​

author img

By

Published : Jan 26, 2021, 7:21 PM IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారటం వల్ల..నిజమైన రైతులు దిల్లీని వీడి సరిహద్దుకు చేరాలన్నారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్. దిల్లీలోని దృశ్యాలు షాక్​కు గురిచేశాయన్నారు.

Amarinder says scenes in Delhi shocking, asks farmers to vacate national capital
'నిజమైన రైతులు దిల్లీని వీడి సరిహద్దుకు రావాలి'

దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలోని దృశ్యాలు తనను షాక్​కు గురిచేశాయన్నారు. నిజమైన రైతులు రాజధానిని ఖాళీ చేసి సరిహద్దులకు చేరాలన్నారు.

"దిల్లీలో దృశ్యాలు షాక్​కు గురి చేస్తున్నాయి. కొంతమంది సృష్టించిన హింస ఆమోదయోగ్యం కాదు. దీనివల్ల రైతుల పేరు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుంది. నిజమైన రైతులు దిల్లీని వదిలి సరిహద్దుకు వచ్చేయండి."

--పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​

ఇలాంటి ఘటనల వల్ల.. శాంతియుతంగా నిరసనలు చేస్తూ రైతులు ఇంతకాలం తెచ్చుకున్న పేరు పోతుందన్నారు అమరీందర్​ సింగ్​.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించిన వేళ.. దిల్లీలోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. భద్రత కోసం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. నిబంధనలను పక్కనపెట్టి.. అనుమతులిచ్చిన మార్గాన్ని వీడి ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. ఎర్రకోటపై ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో దిల్లీవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది.

దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలోని దృశ్యాలు తనను షాక్​కు గురిచేశాయన్నారు. నిజమైన రైతులు రాజధానిని ఖాళీ చేసి సరిహద్దులకు చేరాలన్నారు.

"దిల్లీలో దృశ్యాలు షాక్​కు గురి చేస్తున్నాయి. కొంతమంది సృష్టించిన హింస ఆమోదయోగ్యం కాదు. దీనివల్ల రైతుల పేరు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుంది. నిజమైన రైతులు దిల్లీని వదిలి సరిహద్దుకు వచ్చేయండి."

--పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​

ఇలాంటి ఘటనల వల్ల.. శాంతియుతంగా నిరసనలు చేస్తూ రైతులు ఇంతకాలం తెచ్చుకున్న పేరు పోతుందన్నారు అమరీందర్​ సింగ్​.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించిన వేళ.. దిల్లీలోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. భద్రత కోసం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. నిబంధనలను పక్కనపెట్టి.. అనుమతులిచ్చిన మార్గాన్ని వీడి ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. ఎర్రకోటపై ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో దిల్లీవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఇదీ చదవండి : దద్దరిల్లిన దిల్లీ- ఎర్రకోటపై 'రైతు' జెండా

ఎర్రకోటపై రైతుల జెండా

దిల్లీ ఐటీఓ వద్ద ఆందోళన ఉద్రిక్తం- రైతు మృతి

ట్రాక్టర్​ ర్యాలీలో హింసపై షా సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.