ETV Bharat / bharat

తమిళ పోరు: కౌంటింగ్​కు వేళాయెరా - తమిళనాడు ఫలితాలు 2021

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరగనున్న కౌంటింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. విజయం తమనే వరిస్తుందని డీఎంకే ధీమాగా ఉంది. అన్నాడీఎంకే మాత్రం గెలుపుపై నమ్మకం పెట్టుకుంది. అదే సమయంలో కమల్​ హాసన్​ వంటి వారు ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

tamilanadu counting
తమిళ పోరు- కౌంటింగ్​కు వేళాయెరా
author img

By

Published : May 1, 2021, 6:50 PM IST

తమిళ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి ఆదివారం తెరలేవనుంది. 234 సీట్లకు ఏప్రిల్​ 6న పోలింగ్​ నిర్వహించగా.. ఆదివారం కౌంటింగ్​ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

తమిళ పోరు..

  • మొత్తం సీట్లు: 234
  • మ్యాజిక్​ ఫిగర్​: 118
  • ఎన్నికలు: ఏప్రిల్​ 6
  • ప్రధాన పోటీ: అన్నాడీఎంకే X డీఎంకే
  • బరిలో ప్రముఖులు: పళనిస్వామి, పన్నీర్​సెల్వం, స్టాలిన్​, కమల్​హాసన్

ఈసీ చర్యలు

కరోనా నిబంధనల నడుమ కౌంటింగ్​ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపట్టింది. ఫేస్​ షీల్డ్స్​, మాస్కుల పంపిణీ, శానిటైజేషన్​ ప్రక్రియను ముమ్మరం చేసింది. కౌంటింగ్​ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, వారి ఏజెంట్లు.. కచ్చితంగా కరోనా నెగెటివ్​ రిపోర్టును చూపించాలి. లేదా టీకా రెండు డోసులు తీసుకున్నట్టు ధ్రువపత్రాలను సమర్పించాలి.
అదే సమయంలో.. కౌంటింగ్​ కేంద్రాల బయట ప్రజలు గుమిగూడకుండా చర్యలు చేపట్టింది ఈసీ. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

స్టాలిన్​కే ప్రజల ఓటు!

ఈ దఫా ఎన్నికల్లో ప్రజలు స్టాలిన్​కే ఓటు వేశారని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. మూడోసారి అధికారం చేపట్టాలనుకున్న అన్నాడీఎంకే ఆశలు నెరవేరవని స్పష్టం చేశాయి. మరోవైపు కమల్​హాసన్​, దినకరన్​ వంటి వారు ఏ మేరకు ప్రభావం చూపిస్తారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

tamilanadu etv bharat exit poll
ఈటీవీ భారత్​ సర్వే

ఇదీ చూడండి: కేరళ సమరం- కౌంటింగ్​కు సర్వం సిద్ధం

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్​లో విజేత ఎవరు?

తమిళ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి ఆదివారం తెరలేవనుంది. 234 సీట్లకు ఏప్రిల్​ 6న పోలింగ్​ నిర్వహించగా.. ఆదివారం కౌంటింగ్​ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

తమిళ పోరు..

  • మొత్తం సీట్లు: 234
  • మ్యాజిక్​ ఫిగర్​: 118
  • ఎన్నికలు: ఏప్రిల్​ 6
  • ప్రధాన పోటీ: అన్నాడీఎంకే X డీఎంకే
  • బరిలో ప్రముఖులు: పళనిస్వామి, పన్నీర్​సెల్వం, స్టాలిన్​, కమల్​హాసన్

ఈసీ చర్యలు

కరోనా నిబంధనల నడుమ కౌంటింగ్​ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపట్టింది. ఫేస్​ షీల్డ్స్​, మాస్కుల పంపిణీ, శానిటైజేషన్​ ప్రక్రియను ముమ్మరం చేసింది. కౌంటింగ్​ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, వారి ఏజెంట్లు.. కచ్చితంగా కరోనా నెగెటివ్​ రిపోర్టును చూపించాలి. లేదా టీకా రెండు డోసులు తీసుకున్నట్టు ధ్రువపత్రాలను సమర్పించాలి.
అదే సమయంలో.. కౌంటింగ్​ కేంద్రాల బయట ప్రజలు గుమిగూడకుండా చర్యలు చేపట్టింది ఈసీ. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

స్టాలిన్​కే ప్రజల ఓటు!

ఈ దఫా ఎన్నికల్లో ప్రజలు స్టాలిన్​కే ఓటు వేశారని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. మూడోసారి అధికారం చేపట్టాలనుకున్న అన్నాడీఎంకే ఆశలు నెరవేరవని స్పష్టం చేశాయి. మరోవైపు కమల్​హాసన్​, దినకరన్​ వంటి వారు ఏ మేరకు ప్రభావం చూపిస్తారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

tamilanadu etv bharat exit poll
ఈటీవీ భారత్​ సర్వే

ఇదీ చూడండి: కేరళ సమరం- కౌంటింగ్​కు సర్వం సిద్ధం

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్​లో విజేత ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.