అఫ్గానిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న(Afghan crisis) క్రమంలో ఆ దేశం నుంచి తమ వారిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. ఈ క్రమంలోనే నాటో, అమెరికా విమానాల్లో అఫ్గాన్ నుంచి కతార్కు చేరిన భారతీయులను(india evacuation afghanistan) సోమవారం స్వదేశానికి తీసుకొచ్చింది. దోహా విమానాశ్రయం నుంచి 4 విమానాల్లో మొత్తం 146 మందిని భారత్ తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. కాబుల్ నుంచి తరలించిన వారిలో దోహా నుంచి తీసుకొచ్చిన రెండో బ్యాచ్గా చెప్పారు.
దోహా నుంచి 104 మంది విస్తారా విమానం, 30 మంది కతార్ ఎయిర్వేస్ విమానం, 11 మంది ఇండిగో, ఒకరు ఎయిర్ ఇండియా విమానం ద్వారా భారత్ చేరినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం తొలి బ్యాచ్లో మూడు విమానాల ద్వారా మొత్తం 392 మందిని భారత్కు తీసుకొచ్చింది కేంద్రం. అందులో ఇద్దరు అఫ్గాన్ చట్టసభ్యులు కూడా ఉన్నారు. కాబుల్ నుంచి దోహాకు చేరుకున్న భారతీయుల్లో చాలా మంది విదేశీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నట్లు తెలిసింది.
ఇద్దరికి కరోనా..
అఫ్గానిస్థాన్ నుంచి భారత్కు వచ్చిన 146 మందిలో ఇద్దరికి కొవిడ్-19 పాజిటివ్గా తేలింది. విమానాశ్రయంలో దిగిన తర్వాత అందరికీ పరీక్షలు నిర్వహించామని, అందులో ఇద్దరికి వైరస్ నిర్దరణ అయినట్లు దిల్లీ ప్రభుత్వ నోడల్ అధికారి రాజేందర్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: Afghan news: తాలిబన్ చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి..